దాసరికి అంటుకున్న బొగ్గు మసి
posted on Jun 11, 2013 11:42AM
తన ప్రత్యర్ధులను బెదిరించటానికి కేంద్రం వాడుకున్న సిబిఐ అస్త్రం ఇప్పుడు మిస్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది.. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ సిబిఐ సోదాలతో కాంగ్రెస్ అవినీతి డొంక కదులుతుంది.. ఇన్నాళ్లు సిబిఐ చార్జీ షీట్లతో పదివిలో ఉన్న మంత్రలు మాజీలవుతుంటే ఇప్పుడు మాజీలకు కూడా కష్టాలు తప్పేలా లేదనిపిస్తుంది..
ముఖ్యంగా కేంద్రంలో సాక్ష్యాత్తు ప్రదాన మంత్రే అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వినిపించిన స్కాం బొగ్గు కుంభకోణం. అయితే ఇప్పుడు ఈ స్కాంలో ఆ బోగ్గు మసి ఆ శాఖ కు సహాయ మంత్రిగా వ్యవహరించిన దాసరికి కూడా అంటుకున్నట్టుగా కనిపిస్తుంది..
సిబిఐ తాజాగా నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్లో దాసరి పేరును కూడా చేర్చడంతో దాసరి కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతుంది.. చిరు పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన దగ్గర నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న దాసరి పార్టీ పై కాస్త అసంతృప్తిగా కూడా ఉన్నరన్న టాక్ ఉంది..
ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం..
దాసరితో పాటు మరో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్ పేరు కూడా ఎఫ్ ఐ ఆర్లో చేర్చడంతో ఇప్పుడు కాంగ్రెస్ ఈ సమస్యపై ఎలా స్పందిస్తుందో అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..