టైమ్ మీరు చెప్పినా సరే.. జూపల్లి
పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్టీఆర్ భవన్ లో చర్చించుకుందామని జూపల్లి కృష్ణారావు టీడీపీ నేతలపై సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే సవాల్ మాత్రం విసిరారు కాని చర్చకు మాత్రం రాలేదు. ఇదే విషయంపై టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా జూపల్లి పై ఘాటు విమర్శలే చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని జూపల్లి సవాల్ విసిరారు.. వస్తానని ముఖం చాటేశారని ఎద్దేవ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జూపల్లి కోసం 3 గంటల పాటు ఎదురు చూశానని.. జూపల్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో జూపల్లి తాను చర్చకు సిద్ధమేనంటూ.. టైమ్ మీరు డిసైడ్ చేసి చెప్పినా సరే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే సోమవారం, బుధవారం, గురువారం మూడురోజుల్లో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి తాను సిద్ధమని చెప్పారు. కాగా.. అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని, చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని, ప్రజలు, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని జూపల్లి సవాల్ విసిరారు. చూద్దాం ఈసారైనా జూపల్లి మాట మీద నిలబడతారో లేదో.