ramgopal varma

అక్కడ పుట్టకపోవడం రాజమౌళి దురదృష్టం.. రాంగోపాల్ వర్మ

  ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ బాహుబలి సినిమాను డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి తరువాతే అని ప్రశంసించారు. అంతేకాక సినిమాలో ప్రభాస్ టెర్రిఫిక్ గా చేశాడని.. రానా అయితే విలన్ పాత్రలో ఒదిగిపోయాడని.. ఫిజికల్ గా, నటనలో కూడా శిఖర స్థాయి అందుకున్నాడని.. రమ్యకృష్ణ కూడా చాలా బాగా చేసిందని అన్నారు. అసలే విమర్శల వర్మ కదా అటు బాహుబలిని పొగుడుతూనే ఇండస్ట్రీలో ఉన్నకొంతమంది నాయకులకు చురకలు అంటించారు. సినీ ఇండస్ట్రీలో తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు బాహుబలి ఒక మేలుకొలుపని.. ఇండస్ట్రీ మొత్తం సింహాలు, పులులు, ఏనుగులతో నిండిపోయిందని.. ఈ జంగిల్ ఇండస్ట్రీలోకి బాహుబలి ఒక డైనోసార్ లాగ వచ్చిందని వ్యాఖ్యానించారు. అయినా రాజమౌళి ఇక్కడ పుట్టినందుకు తెలుగువారు గర్వపడనక్కర్లేదు.. బాంబే లాస్ ఎంజిల్స్ లో పుట్టక పోవడం అతని దురదృష్టకరమని అన్నారు.

kishan reddy bjp

టీడీపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం... కిషన్ రెడ్డి

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల నుండి కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నా పట్టించుకునే తీరిక తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. సమ్మె వల్ల నగరం అంతా చెత్తతో నిండిపోయిందని.. చెత్త వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా వారు తమ వేతనాలు పెంచమని అంటున్నారు.. అందులో తప్పేం లేదని.. అన్ని శాఖలకు వేతనాలు పెంచిన కేసీఆర్ వాళ్లకు పెంచడం న్యాయం అని అన్నారు. అయినా తెలంగాణ కోసం సమ్మె చేయవచ్చు కానీ, పొట్టకూటి కోసం సమ్మె చేస్తే తప్పా అని నిలదీశారు. అంతేకాక ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకూ సరిగా స్పందించని కిషన్ రెడ్డి ఇప్పుడు ఓటుకు నోటు కేసు వల్ల తెలుగుదేశం పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకే ఎక్కున నష్టం కలిగించిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వ్యవహారం పై మాకు సంబంధం లేదని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం పై ఆసక్తి నెలకొంది. అలాగే ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

pawan kalyan fire on congress

మోడీ పై ఉన్న శ్రద్ధ ఆంధ్రులపై లేదా.. పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ పోస్ట్ చేశారు. మొన్నటి వరకూ ఏపీ ఎంపీలు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడటం లేదని.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు.

kcr vaastu

వాస్తుని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్.. సచివాలయానికి 3సార్లే

  తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయం వాస్తు బాలేదని దానిని వేరే చోటికి మార్చాలని అప్పట్లో చాలానే ప్రయత్నించారు. మొదట్లో దానిని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోకి మార్చాలని అనుకున్నారు కానీ అక్కడ దానికి వ్యతిరేకత రావడంతో సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లోకి మార్చాలని అనుకున్నారు. కానీ అది కూడా ఇంతవరకూ జరగలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ మాత్రం సచివాలయ వాస్తు బాలేదన్న కారణంతో సచివాలయానికి అరుదుగా వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ సమయాన్ని తన క్యాంపు కార్యాలయంలోనే గడుపుతున్నారట. లేకపోతే జూబ్లీహిల్స్‌లోని హెచ్ఆర్డీ కార్యాలయం నుంచి రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గత నెలరోజులలో కేవలం మూడుసార్లు మాత్రమే సచివాలయానికి వెళ్లారు.. ఇదిలా ఉండగా రాజ్ భవన్ ను ఎక్కువసార్లు సందర్శించినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. కేసీఆర్ సచివాలయానికి సరిగా వెళ్లకపోవడం వల్ల చాలా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ వాస్తును బలంగా నమ్ముతున్నారన్నది అర్ధమవుతోంది.

chandrababu naidu

బాహుబలిపై చంద్రబాబు ప్రశంసలు

  తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రంగా రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రంపై ఇంకా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సినిమా విడుదలైన రోజునుండి అటు బాలీవుడ్ సెలబ్రీల నుండి.. ఇటు టాలీవుడ్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ తమ ప్రశంసలను ట్విట్టర్ ద్వారా ట్వీట్ తూనే ఉన్నారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా 'బాహుబలి' తీసిన రాజమౌళి ని ప్రశంసిస్తూ ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలిపారు. 'బాహుబలి' లాంటి ఓ కళాఖండాన్ని తీసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో ప్రదర్శించారని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా అభినందించారు. అయితే చంద్రబాబు ట్వీట్ కు స్పందించిన రాజమౌళి మీ అభినందనలతో మా చిత్రబృందం మొత్తం ఉప్పొంగిపోతోందని ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

revanth reddy

రేవంత్ రెడ్డి ఆగష్టు 3న హాజరుకావాలి.. ఏసీబీ కోర్టు

  ఓటుకు కేసులో ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి ఈనెల 13వ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఏసీబీ విధించిన రిమాండ్ ఈరోజుతో ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కానీ రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోడంతో ఆగష్టు 3న హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొన్ని షరతులు విధించిందని.. దానిలో భాగంగానే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌లో హైదరాబాద్‌కు రావద్దని ఆదేశాలు ఉండటం వల్లే కోర్టుకు రాలేకపోతున్నారని రేవంత్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ బెయిల్ ఉన్నప్పటికీ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అని న్యాయమూర్తి చెప్పడంతో.. ఆగష్టు 3న రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు చెప్పడంతో విచారణను వాయిదా వేశారు.

jupalli krishna rao challenge

టైమ్ మీరు చెప్పినా సరే.. జూపల్లి

  పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్టీఆర్ భవన్ లో చర్చించుకుందామని జూపల్లి కృష్ణారావు టీడీపీ నేతలపై సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే సవాల్ మాత్రం విసిరారు కాని చర్చకు మాత్రం రాలేదు. ఇదే విషయంపై టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా జూపల్లి పై ఘాటు విమర్శలే చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని జూపల్లి సవాల్ విసిరారు.. వస్తానని ముఖం చాటేశారని ఎద్దేవ చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో జూపల్లి కోసం 3 గంటల పాటు ఎదురు చూశానని.. జూపల్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో జూపల్లి తాను చర్చకు సిద్ధమేనంటూ.. టైమ్ మీరు డిసైడ్ చేసి చెప్పినా సరే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే సోమవారం, బుధవారం, గురువారం మూడురోజుల్లో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి తాను సిద్ధమని చెప్పారు. కాగా.. అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని, చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని, ప్రజలు, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని జూపల్లి సవాల్ విసిరారు. చూద్దాం ఈసారైనా జూపల్లి మాట మీద నిలబడతారో లేదో.

revanth reddy ACB court

ఓటుకు నోటు కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకూ నోటీసులు!

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారణ చేసిన సంగతి తెలిసిందే. సండ్రను విచారణ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు విచారణకు రానుంది. మరో వైపు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్నారు. ఎందుకంటే ఏసీబీ న్యాయస్థానం జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కానీ... జూలై 1న హైకోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. 

Former Congress MP

హర్షకుమార్ అరెస్ట్, రాజమండ్రి జైలుకి తరలింపు

  అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవుల శ్మశానవాటిక కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులు తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారు. తను ఒట్టినే బెదిరించడంలేదని తెలిపేందుకు ఆయన గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ పోలీసులు ఆయన వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకొని ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యాప్రయత్నం చేసినందుకు, బహిరంగ ప్రదేశంలో గాలిలోకి కాల్పులు జరిపినందుకు పోలీసులు ఆయనని 3వ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయనకు ఈనెల 23వరకు రిమాండ్ విదించారు. పోలీసులు ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

Tollywood

ట్రూ జెట్ విమాన సేవలని ప్రారంభించిన రామ్ చరణ్ తేజ్

  ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ కి చెందిన ‘ట్రూ జెట్’ విమాన సర్వీసులు నిన్నటి నుండి ప్రారంభం అయ్యాయి. నిన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి కేటిఆర్, టర్బో మేఘా సంస్థ డైరెక్టర్లు ప్రేమ కుమార్, వి. ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రూ జెట్ విమాన సర్వీసులను రామ్ చరణ్ తేజ్ జెండా ఊపి ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 12 నుండి 25 వరకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి ట్రూ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపబోతోంది. ఈ నెల 26నుండి ఔరంగాబాద్, మరికొన్ని ప్రాంతాలకు కు ట్రూ జెట్ సర్వీసులు నడుపబోతోంది.

Dokka Manikya Varaprasad

వైకాపాలో చేరట్లేదు: డొక్కా

  మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవదానికి సిద్దపడిన తరువాత అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన రాజకీయ గురువుగారైన నరసరావు పేట యంపీ రాయపాటి సాంభశివరావు ఆయనని వైకాపాలోకి వెళ్ళవద్దని సూచించడంతో ఆయన తన ఆలోచనను విరమించుకొంటున్నట్లు ప్రకటించారు.చాలా సౌమ్యుడిగా పేరున్న ఆయన అంబటి రాంబాబుకి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి మాట ఇచ్చి తప్పు తున్నందుకు పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో తను సరయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నానని కనుక మరి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండదలచానని తెలిపారు.    ప్రజలలో మంచి పేరున్న వాడు, రాజకీయ అనుభవజ్ఞుడు, దళితుడు అయిన ఆయనని తెదేపాలోకి తీసుకొంటే బాగుంటుందని రాయపాటి తెదేపా అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తెదేపా అధిష్టానం, జిల్లా నేతలు కూడా చాలా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కనుక నేడు కాకపోయినా ఏదో ఒకనాడు ఆయన తెదేపాలో చేరవచ్చని అందరూ భావిస్తున్నారు.

congress clp jana reddy

డీఎస్ మారడం వల్ల ఏం నష్టంలేదు

  డీఎస్ లాంటి వారు పార్టీ మారిన ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డినే కొనసాగుతారని.. అతనిని మార్చే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని దానికోసం త్వరలోనే గ్రామ స్ధాయిలో కమిటీలను నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుందని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు రాహుల్ సమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కేసీఆర్ ను విమర్శించిన కూతురు కవిత

  రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ.. ఒక నేత పై మరో నేత విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అది కామన్.. కానీ అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ పైనే అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అది కూడా ఒక పార్టీ అధినేత.. రాష్ట్రానికి సీఎం కేబినేట్ పై ఆసీఎం కూతురు అసంతృప్తి వ్యక్తం చేయడం ఆశ్చర్యం. ఇంతకీ ఎవరా సీఎం.. ఎవరా కూతురు అనుకుంటున్నారా.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తన కూతురైన కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. కవిత యంగ్ ఫిక్కీ లేడీసీ ఆర్గనైజేషన్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన 'ఉమెన్ లీడింగ్ ద ప్యూచర్ ఆఫ్ ఇండియా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్‌లో మహిళకు ప్రాతనిధ్యం లేకపోవడం తనను కూడా బాధిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిలో తను కూడా ఉన్నానని అన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే మందకృష్ణ కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. అంతేకాదు మహిళలతో కలిసి భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. ఏది ఏమైనా ఈవిషయంలో ప్రతి పక్షాలనుండి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు కూతురు కవితి నుండి కూడా విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.

సమ్మె చేస్తున్నా పట్టించుకునే వారు లేరు

  సీఎం కేసీఆర్ దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలి.. అందుకోసం కృషి చేయాలి అని మాటలు చెప్పినోళ్లే తప్ప చెప్పనోళ్లు లేరు. మరి ఇప్పుడు హైదరాబాద్ నగర పరిస్థితి చూస్తుంటే బంగారు తెలంగాణ ఏమో కానీ కనీసం మాములు తెలంగాణ చేస్తే చాలు అని అనిపిస్తుంది. గత ఐదురోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల హైదరాబాద్ నగరం కాస్త చెత్త నగరంగా మారిపోయింది. ఎక్కడ చూసిన కుప్పలుకుప్పలు చెత్తతో నగరంగా అద్వానంగా తయారైంది. ఐదురోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్న కనీసం పట్టించుకునే తీరిక ఎవరికి లేకుండా పోయింది. అప్పుడెప్పుడో స్వచ్ఛ భారత్ పేరుతో ఏదో అధికారులంతా పేరుకోసం చీపురు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఒక్కరోజు చేస్తే అయిపోతుందా.. అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేతులు గ్లౌజులు.. కాళ్లకు బూట్లు వేసుకొని మరీ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. అలాంటిది నిరంతరం చెత్తలో పనిచేసే జీహెచ్ఎంసీ కార్మికులు తమ కావాల్సిన పరికరాలు.. వేతనంలో పెంపుదల అడిగితే మాత్రం అవి గొంతెమ్మ కోర్కెలు అంటున్నారు.   మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు సి.కృష్ణయాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు రోజులుగా నగరంలో జిహెచ్‌ఎంసి సిబ్బంది సమ్మెబాట పట్టారని..ముందుగానే వారి సమస్యలను ప్రభుత్వంతోపాటు జిహెచ్‌ఎంసి కమీషనర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికి పట్టించుకోలేదని, కనీసం సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనైనా కార్మికులతో చర్చలు జరపక కమీషనర్ సమస్యను పెంచి పోషించారని అన్నారు. ఇలాగే ఉంటే నగరంలో చెత్త వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. నగరంలో నలుగురు మంత్రులు ఉన్న ఎవరూ పట్టించుకోని స్థితిలో ఉన్నారని.. ఇక జిహెచ్‌ఎంసి కమిషనర్ ఎలాగూ కార్మికుల సమస్యలు పట్టని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కనీసం సీఎం కేసీఆర్ అయినా ఈ సమ్మె విషయంలో కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు.

బాహుబలి చూడనున్న కేసీఆర్

  ప్రస్తుతం నిన్నటి నుండి ఎక్కడ చూసిన బాహుబలి గురించే చర్చలు ఎక్కువయ్యాయి. ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతాకాదు మరీ. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిన్నటితో ఆ ఎదురుచూపులకు తెర పడింది. ఈ బాహుబలి ఎఫెక్ట్ అటు అభిమానులపైనే కాదు ఇటు పొలిటీషియన్స్ పై కూడా పడిందని అర్థమవుతోంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాహుబలి సినిమాను చూడాలని నిర్ణయించుకున్నారట. దీనికోసం నిర్మాత దిల్ రాజు ఈ రోజు రాత్రి వారికోసం ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సినిమాను చూడటానికి కేసీఆర్ తోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా రానున్నారట. భారత సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోవడమే దీనికి కారణం. ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు కానీ.. అటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కానీ ఈ సినిమా ఒక అద్భుతమని.. జక్కన్న రాజమౌళి మీద ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. మరీ సీఎం కేసీఆర్ గారు సినిమా చూసి ఏం జడ్జ్ మెంట్ ఇస్తారో చూద్దాం..

మూడుసార్లు ఛాన్స్.. కలుసుకోని సీఎంలు

  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నా ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు. అయితే ఓటు నోటు కేసు వ్యవహారం వల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇద్దరు సీఎంలు కలుసుకోవడానికి ఇప్పటికి మూడుసార్లు అవకాశం వచ్చినా వారు మాత్రం కలుసుకోలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ విడిదిలో భాగంగా ఇక్కడకి రాగా అప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబు హాజరుకాలేదు. తరువాత ఆయన స్వయంగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లి కలిశారు. తరువాత గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి విందు ఏర్పాటు చేయగా.. అప్పుడు కూడా గవర్నర్ ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. కానీ అప్పుడు చంద్రబాబు మాత్రమే విందుకు హాజరయ్యారు.. కేసీఆర్ కు జ్వరం కారణంగా హాజరుకాలేకపోయారు. అప్పుడు కూడా ఇద్దరు సీఎంలు ఒకరినొకరు కలవలేకపోయారు. ఇప్పుడు కూడా మూడోసారి కలిసే ఛాన్స్ వచ్చినా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి హాజరుకాలేదు.. కేసీఆర్ కూడా హాజరుకాలేదు. అయితే ఈసారి గవర్నర్ విందుకు ఏకంగా ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టారు. అసలు వీరు యాదృశ్చికంగానే కలుసుకునే ఛాన్స్ రావట్లేదా.. లేకపోతే కావాలనే కలుసుకోవట్లేదా అనే సందేహాలు మొదలయ్యాయి అందరిలో.