శశికళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తన భర్తని చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కిడ్నీ మరియు లివర్ మార్పిడి ఆపరేషన్ జరిపారు. అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంతకు మునుపు నటరాజన్ కి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చినప్పుడు, శశికళ పెరోల్ పై వచ్చి భర్తని పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే.

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా

అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్‌పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.  

ఇరాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి, ఒకరు మృతి

గుర్తుతెలియని ఉగ్రవాది ఇరాన్ పార్లమెంట్ పై చేసిన దాడిలో ఒక భద్రతాధికారి మృతి చెందగా, పలువురు గాయ పడ్డారు. దాడి చేసిన వ్యక్తి రెండు కలష్నికోవ్ రైఫిల్స్ మరియు ఒక హ్యాండ్ గన్ క్యారీ చేసాడని తెలిసింది. ఇరాన్ లోకల్ మీడియా కథనం ప్రకారం, అధ్యక్షుడి భవనం పూర్తిగా తాళం వేయబడి, ఎవరినీ లోపలి అనుమతించడం లేదు. అయితే, అదే సమయంలో పార్లమెంట్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అయాతుల్లా ఖొమెయినీ సమాధుల వద్ద కూడా ఒక ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత, ఖొమెయినీ వద్ద సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతాధికారులతో సహా 8 మంది గాయపడినట్లు సమాచారం. ఇరాన్ అధికార వర్గాలు ఈ దాడికి కుట్ర పాకిస్థాన్‌లో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణంలో భద్రతా బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. ఈ రెండు సంఘటనల గురించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.