కుమారుడి విజయం కోసం టీటీడీ నిధులు.. భూమన భారీ స్కెచ్!?

గతంలో రాజకీయ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టే వారు. అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు. అయితే రానురాను  ఆ పరిస్థితి మారింది. ఏపీ సీఎం జగన్ భాషలో చెప్పాలంటే రివర్సైంది. దాంతో  రాజకీయమే కాదు.. రాజకీయ నాయకులూ మారిపోయారు. దీంతో ఈ నయా రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టిల్లో, లేకుంటే బ్యాంకు లాకర్లలో.. అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకోని..  ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ.. తమ జేబులో నుంచి కోట్లకు కోట్ల రూపాయిలు తీసి..చెల్లిస్తున్నట్లుగా  బిల్డప్ ఇస్తున్నారు.   అయితే టీటీడీ  చైర్మన్ కం తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి  దేవుడికి ముడుపులు రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును   ప్రజావసరాల  పేరుతో సొంత లాభం కోసం వినియోగించేందుకు వీలుగా  నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర వివాదాస్పదంగా మారింది.  విషయమేమిటంటే..  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌,తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షన తాజాగా  జరిగిన టీటీడీ  పాలక మండలి సమావేశంలో టీటీడీకి వార్షిక  బడ్జెట్‌ నిధుల్లో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని ఇప్పుడు దేవుడి నిధులను కూడా పక్కదారి పట్టించేయడానికి నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో  తన కుమారుడు  భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలుపించుకొనేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలు తిరుపతి అభివృద్ధికి  టీటీడీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని నిర్ణయించారని అంటున్నారు.  అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ వందల, వేల కోట్ల రూపాయిల్లో ఉంటుందని.. అందులో ఒక శాతం అంటే.. దేవుడి సొమ్ము కోట్లాది రూపాయిలు కైంకర్యం చేసేందుకు భూమన స్కెచ్ వేశారని అంటున్నారు.   అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం  లేదని  గుర్తు చేస్తున్నారు. అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయని.. దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం, ఏ నగరం అభివృద్ధికి నోచుకోలేదని.. దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లీస్తే.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని  అభివృద్ధి చేశానంటూ.. ప్రజలకు చెప్పుకుని, మా అబ్బాయిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఓట్లు దండుకునేందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి అభివృద్ధి కోసం మళ్లించే నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా గతంలో  తాను నాస్తికుడినని బాహాటంగా చెప్పి.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న  భూమన   కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డ్ చైర్మన్ గా నియమించిన నాడే.. జగన్ పై విరమ్శలు వెల్లువెత్తాయి. వినాశకాలే విపరీత బుద్ధీ అంటూ నాడే నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు.    పద్దతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్‌లాగా నిలువు బొట్టు పెట్టి.. తనకు మాత్రమే సాధ్యమైన అభినయంతో మాట్లాడుతూ.. తాను గతంలో అన్న మాటలు జనం మరిచిపోయారన్న భ్రమలో  పరమ భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చుకునే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధుల మళ్లింపు నిర్ణయంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం.. ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని.. ఇది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని.. అదీకాక   టీటీడీని జగన్ సర్కార్ కామధేనువుగా భావించి ఇష్టారీతిన పద్ధతులు పాటించకుండా దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వస్తున్నాయి. ఇందుకు  తార్కానంగా ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డు సభ్యులను ఉదహరిస్తున్నారు.  అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడి  విజయం కోసం దేవుడు సొమ్మును ఇలా వాడుకొవడం చూస్తుంటే.. ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్‌గా అభివర్ణిస్తున్నారు.  అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు, విపక్షాలు మండిపడుతుండగా.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

జనసేనలో వైసీపీ స్లీపర్ సెల్స్!

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ వైనాట్ 175 అన్న అధికార పార్టీలో ఇప్పుడు బ్రతుకు జీవుడా అనే భావన కనిపిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర, తెలుగుదేశం అధినేత చంద్రబాబు యాత్రలతో తెలుగుదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడే జోష్ కనిపిస్తుండగా.. అకస్మాత్తుగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓ రెండు మూడు  రోజులు  మహా అయితే వారంలో చంద్రబాబు బయటకి వస్తారనుకోగా నెల గడిచినా వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు జైలు పాలైతే తెలుగుదేశంను   దెబ్బతీయొచ్చని వైసీపీ భావించగా.. తెలుగుదేశం ఇప్పుడు అంతకు మించిన బలంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు ఒకే చెప్పి సమరశంఖం పూరించడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలలో తెలుగుదేశంకు బలం పెరగడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది.  నిజానికి తెలుగుదేశం, జనసేన పొత్తును వైసీపీ తొలి నుండి జీర్ణించుకోలేకపోతోంది. రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందన్నది వైసీపీ భావన. అందుకోసమే ఈ పొత్తును చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. తెలుగుదేశంకు బీ టీమ్ జనసేన, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే పవన్ ఒంటరిగా  పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే పని చేశారు. కానీ, పవన్ నా పార్టీ నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మాటలతో పని కాకపోవడంతో వైసీపీ కుట్ర పూరితంగా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టార్గెట్ గా వైసీపీ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కుట్ర పన్ని జనసేన పార్టీకి భారీ నష్టం చేకూరేలా అమలు పరుస్తున్నట్లు చెప్తున్నారు. సాధారణంగా టెర్రరిజంలో స్లీపర్ సెల్స్ అని ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు సామాన్య ప్రజలలో కలిసిపోయి తీవ్రవాదుల కోసం పనిచేస్తుంటారు. అవసరమైన సమయంలో వీళ్ళు ఆత్మహుతి దాడులకు సిద్దపడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటారు. తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే వీరికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసీపీ జనసేనపై ఇదే తరహా కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కొందరు వైసీపీ సానుభూతి పరులైన నేతలను ముందుగా జనసేనలోకి పంపించి.. అవసరమైనప్పుడు వారిని జనసేనలో రెబల్స్ గా తెరపైకి తెస్తారు. ముందుముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి మిగతా నాయకులలో అభద్రతా భావం కలిగిచడం, తద్వారా రాజకీయ శూన్యత సృష్టించి తెలుగుదేశంతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అలా చేయడం ద్వారా  రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ  చూస్తున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ వ్యూహం రూపొందిందని  అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై పవన్ ప్రకటన అనంతరం జనసేనలో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మీడియాకి ఎక్కి పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. మరి కొందరు వారిని సమర్ధిస్తూ పార్టీలోనే కొనసాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టిసారించిన జనసేన నాయకత్వం.. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. అయితే, ముందు ముందు సీట్ల సర్దుబాటు సమయంలో వీళ్ళు మరోసారి రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక, వీళ్ళని ముందుగానే గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే జనసేనకు, తద్వారా జనసేన, తెలుగుదేశం కూటమికి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

జనంలోకి భువనేశ్వరి

స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది.  ఆయన క్వాష్ పిటిషన్ పైసుప్రీంకోర్టు స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. అదలా ఉంటే  చంద్రబాబు అరెస్ట్‌ వార్త విని 105 మంది గుండె పగిలి చనిపోయారు. ఈ నేప్యథంలో వారి కుటుంబాలను పరామర్శించి.. ధైర్యం చెబుతానని నారా భువనేశ్వరీ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో ప్రకటించిన విషయం విదితమే. అందులోభాగంగా నిజం గెలవాలి పేరుతో ఓ కార్యక్రమాన్ని భువనేశ్వరీ చేపట్టనున్నారు.  అందులో భాగంగా జోన్‌కు ఒకటి చొప్పున అయిదు జోనుల్లో సభలు నిర్వహించి ఆ సభలలో భువనేశ్వరి పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.   అక్టోబర్ 21న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్ ఎప్పుటి నుంచి.. ఎక్కడకెక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభించాలనే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్, నారా బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేశ్ సమావేశమై.. పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు (బాబుతో నేను)  ఐ యామ్ విత్ బాబు కార్యక్రమాన్ని ఈ మాసాంతం వరకు కొనసాగించనున్నారు. అదేవిధంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలిపే విధంగా కర్రపత్రాలను ముద్రించి.. ప్రజలకు అందించేందుకు పార్టీ సమాయత్తమైంది. ఇంకోవైపు గతంలో నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటూ నంద్యాలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే చంద్రబాబును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో.. ఆ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ కార్యక్రమాన్ని నారా లోకేశ్ చేపట్టి.. కొనసాగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.  ఇక చంద్రబాబు అరెస్ట్‌తో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సైతం బ్రేకు పడింది. అయితే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాత్రను లోకేశ్ పున: ప్రారంభించనున్నారని సమాచారం. ఓ వేళ నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఇప్పుడే పున: ప్రారంభిస్తే.. చంద్రబాబు నాయుడు కోసం మళ్లీ మధ్యలో న్యాయ సమీక్ష కోసం ఢిల్లీకి వెళ్లవలసి ఉంటుందని.. అటువంటి పరిస్థితుల్లో యువగళం పాదయాత్రకు మధ్యలో బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యువగళగం పాదయాత్రను నారా లోకేశ్ మళ్లీ చేపడతారని అంటున్నారు.

వ్యక్తిగత వైద్యునితో పరీక్షలు.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అనుమతి

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌  విచారణకు ఏపీ హై కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ దసరా తరువాత చేపట్టనున్నట్లు తెలిపింది. అయితే ఒక విషయంలో మాత్రం చంద్రబాబుకు హైకోర్టు ఊరట కల్పించింది. చంద్రబాబు వ్యక్తిగత వైద్యునితో పరీక్షలకు అనుమతి ఇచ్చింది.   ఇక బెయిల్ పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదలీ చేసింది.   కాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షల వివరాలను జైలు అధికారులు గోప్యంగా ఉంచడం, వారు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో సమగ్ర సమాచారం లేకపోవడంతో చంద్రబాబు కుటుంబసభ్యులు, తెలుగుదేశం శ్రేణులూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయనకు చేసిన వైద్య పరీక్షల వివరాలను బయటపెట్టాలనీ, అలాగే ఆయనకు ఇచ్చిన మందుల వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలనీ డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు అందుకు అంగీకరించలేదు. ఆ తరువాత వైద్యులు చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై సమగ్రనివేదికను సీల్డ్ కవర్ లో జైలు అధికారులకు వెల్లడించినట్లు బయటపడటంతో ఆ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. చంద్రబాబు నెల రోజులలో ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిక్ పేషెంట్ అయినా చంద్రబాబు సుగర్ లెవెల్స్ పరీక్షించకపోవడం, అలాగే ఆయనకు అందించిన చికిత్స, ఇచ్చిన మందులపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ఆయన వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలుగుదేశం వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.  ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం(అక్టోబర్ 20)న తీర్పు వెలువరించనుంది.

రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు గాయాలు

భూపాలపల్లిలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం( అక్టోబర్ 19)బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బస్సు యాత్రను  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  బుధవారం (అక్టోబర్ 18)ములుగు నియోజకవర్గంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ  బస్సు యాత్ర బుధవారం (అక్టోబర్ 18)  రాత్రి  భూపాలపల్లికి చేరుకుంది . రాత్రి భూపాలపల్లి  జెన్ కో అతిథి గృహంలో  బస చేసిన రాహుల్ గాంధీ గురువారం అక్టోబర్ 19) ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదవ గని నుండి బాంబుల గడ్డ వరకు  నిరుద్యోగులతో   బైక్ ర్యాలీ నిర్వహించారు.  అంబేద్కర్ సెంటర్ వరకు  ర్యాలీ కొనసాగింది.  అంబేద్కర్ సెంటర్ లో కొద్దిసేపు రాహుల్ గాంధీ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెండో రోజూ బస్సు యాత్ర ప్రారంభమైంది.  అయితే ఈ బైక్ ర్యాలీలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. బైక్ నడుపుతూ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కిందపడిపోయారు. ఆమె ముఖానికీ, చేతులకూ గాయాలయ్యాయి.   

టార్గెట్ కేసీఆర్.. ఆ నాలుగు నియోజకవర్గాల్లో నిజామాబాద్ వ్యూహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఎన్నికల షెడ్యూల్  విడుదలైన క్షణం నుంచీ క్షణ తీరిక లేకుండా మూడు ప్రధాన పార్టీలూ  ప్రచార వ్యూహాల ఖరారులో మునిగిపోయారు. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన విధంగానే అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచార శంఖారావాన్నికూడ ముందే పూరించారు.  ఆ తరువాత కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని రాహుల్, ప్రియాంకల పర్యటనతో ఆరంభించింది. ఇక బీజేపీ  నేడో రేపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు  ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుని గత  రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ  సెంటిమెంటే ప్రతిబంధకంగా మారినట్లు  కనిపిస్తున్నది. పార్టీ  పేరులోంచే  తెలంగాణను తొలగించి, అభివృద్ధి, సంక్షేమం  అజెండాగా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణ అమరుల కుటుంబాలు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అమరుల  త్యాగాలను స్మరించకుండా, వారి కుటుంబాలకు న్యాయం చేయకుండా  హ్యాట్రిక్ విజయాలపై గురిపెట్టారంటూ అమరుల కుటుంబాలు  ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో  కేసీఆర్ పోటీ  చేయాలని భావిస్తున్న గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ పోటీ చేసే  సిరిసిల్ల, అలాగే  ఆయన మేనల్లుడు  హరీష్ రావు పోటీ చేయనున్నసిద్ధిపేట నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. గత లోక్ సభ  ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు ఎలాగైతే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు  చేసి ఆమె ఓటమికి కారకులయ్యారో.. అదే  విధంగా ఈ అసెంబ్లీ   ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే  స్థానాలలో  పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని అమరుల కుటుంబాలు  నిర్ణయించాయి.   అమరుల త్యాగాలను నిచ్చెనగా చేసుకుని అధికారాన్ని అధిరోహించిన  కేసీఆర్ ఆ తరువాత ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం చేయలేదనీ, న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి  కూడా తాము ఆహ్వానానికి నోచుకోలేదని వారు చెబుతున్నారు.  అందుకే తమ ఆగ్రహాన్ని, నిరసనను చూపేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేసే స్థానాల్లో  అమరవీరుల కుటుంబాల నుంచి నామినేషన్లు వేయాలనే  నిర్ణయం తీసుకున్నా మంటున్నారు.   అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ నాలుగు నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో కనీసం 150 మందితో నామినేషన్లు వేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  తెలంగాణ  ఉద్యమ సమయంలో అమరుల కుటుంబాలకు ఇంటికో  ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటిని పూర్తిగా విస్మరించారని, కనీస గౌరవం కూడా చూపలేదని అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా కేసీఆర్ తమ పట్ల వ్యవహరించారని, అందుకే కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసే నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వివరిస్తున్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో పసుపు రైతులు వందకు పైగా నామినేషన్లు వేసి కవిత గెలుపును ఎలా అడ్డుకున్నారో  అదే విధంగా ఇప్పుడు గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలలో కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

రిషికొండ నిర్మాణాలపై సుప్రీంలో పిల్

రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. పర్యవరణ వేత్త  శివరాం ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, కోస్టాల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా రిషికొండపై కాంప్ కార్యాలయం నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు.  కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో   విచారణ జరుగుతున్నదనీ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.   నిబంధనలు తుంగలోకి తొక్కి కోర్టులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి మరీ  రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం, విశాఖలో సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11-10-2023 న ఇచ్చిన జీవో 2015 ను వెంటనే రద్దు చేయాలనీ శివరాం ప్రసాద్ తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ )లో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని కోరారు.  ఎన్జీటో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిషికొండ పై రిసార్ట్ నిర్మాణం పై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. అలాగే  పిటిషన్ తో పాటు… కార్యాలయాల తరలింపుపై జిఎడి ఇచ్చిన జీఓ, వివిధ పత్రికలలో వచ్చిన వార్తల  క్లిప్పింగులు,  రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. అలాగే రిషికొండ నిర్మాణాలపై  సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జత చేశారు.  డిసెంబర్ నుంచి పాలన మొత్తం విశాఖ నుంచే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో దాఖలైన ఈ  పిటిషన్ అత్యం  ప్రాధాన్యత సంతరించుకుంది. రిషికొండపై నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేపట్టారన్నఆరోపణలు  ఎప్పటి నుంచో ఉండగా, అధికారులు, వైసీపీ వర్గాలు కూడా అంతర్గత  సంభాషణల్లో నిబంధనల  ఉల్లంఘన  నిజమే అంటున్నారు. దీంతో సుప్రీం కోర్టులో దాఖలైన పిల్ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.  

తెలంగాణ ఎన్నికల బరిలో టీఆర్ఎస్.. గుర్తు గ్యాస్ సిలెండర్

వచ్చే నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. అదేమిటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది కదా.. మళ్లీ ఎన్నికలలో  టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో ఉండటమేమిటను కుంటున్నారా?  అక్కడికే వస్తున్నాం ఆగండి. జాతీయ రాజకీయాలపై మక్కువతో.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీగా గుర్తింపు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ పార్టీకి తొలి నుంచీ ఉన్న కారు గుర్తునే కేటాయించింది. అయితే తెలంగాణ ఉద్యమ కారులు, రాష్ట్రానికి  చెందిన కొందరు కీలక నేతలు కలిసి తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తెలంగాణ  రాష్ట్ర సమితి పార్టీని రిజిస్టర్ చేయించి.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిపారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అంగీకరించింది. తెలంగాణ రాజ్య సమితి (ఆఆర్ఎస్) పార్టీకి గ్యాస్ సిలెండర్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. దీంతో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే వారందరికీ గ్యాస్ సిలెండర్ గుర్తు కేటాయిస్తుంది. మొత్తంగా రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్ బరిలో ఉండటం, ఆ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం ఎంత లేదన్నా అధికార బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

షర్మిల పార్టీ.. పోటీకి అభ్యర్థులేరీ?

వైఎస్సార్టీపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద తెలంగాణలో ఏర్పాటైన పార్టీ. ఈ పార్టీని వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏర్పాటు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ ఆమె ప్రారంభించిన ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. పార్టీ  ఆవిర్భావం నుంచీ కూడా షర్మిల రాజకీయ లక్ష్యం ఏమిటన్న అనుమానాలు బలంగానే వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే ఆమె వాటిని  వేటినీ  పట్టించుకోకుండా  తన  మానాన  తాను  నడిచారు. ఏళ్ల  తరబడి ఆమె రాష్ట్రంలో సాగించిన నడక, చేపట్టిన దీక్షలతో ఏదో మేరకు జనం దృష్టిని ఆకర్షించగలిగారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల విమర్శల  బాణాలు గుప్పించారు. ఆమె ఎవరు వదిలిన బాణం..  ఏ లక్ష్యంతో గురిపెట్టిన బాణం  అన్న ప్రశ్నలను  అధిగమించి.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువగా కేసీఆర్ కుటుంబాన్ని  టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దాంతో షర్మిల పార్టీకి ప్రజలలో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు  ఎన్నికలలో విజయం సాధించిపెట్టేంత ఎక్కువగా లేకపోయినా షర్మల  మాత్రం తెలంగాణ  రాజకీయాలలో  తన ఉనికిని  బలంగానే చాటుకున్నారు.  విజయం  సంగతి ఎలా ఉన్నా.. ఆమె పార్టీ కచ్చితంగా  కొన్ని నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు  సైతం విశ్లేషించారు. అయితే ఆ గుర్తింపును, ఆ బలాన్నీ షర్మిల  చేజేతులా ‘చే’ జార్చుకున్నారు. ఎంత కష్టపడినా, వేల కిలోమీటర్లు పాదయాత్ర  చేసినా, వారం వారం  దీక్షలు చేసినా  తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ సాధికార విజయం తరువాత.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో  షర్మిల ఆ పార్టీవైపు అడుగులు వేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా ఏపీ సీఎం, స్వయానా తనకు అన్న అయిన జగన్ తో ఉన్న ఆస్తి తగాదాల సెటిల్ మెంట్ తో పాటు.. తన రాజకీయ భవిష్యత్ కు కూడా డోకా లేకుండా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన తండ్రి వైఎస్ కు ఆత్మగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు, అలాగే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానానికి టచ్ లోకి వెళ్లారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదన పెట్టారు. హై కమాండ్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే వైఎస్ వారసురాలిగా షర్మిలకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఏమిటంటూ తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో షర్మిల అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తే బాగుంటుందని అధిష్ఠానానికి తెగేసి చెప్పారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లోకి విలీనం కావడం ఆగిపోయింది. అయితే ఆ క్రమంలో తెలంగాణలో వైఎస్సార్టీపీ ప్రతిష్ట కూడా పాతాళానికి పడిపోయింది. కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఆమె ప్రతిష్టకు పోయి వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తుందనీ, అది కూడా మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతానని షర్మిల ప్రకటించారు. అక్కడే ఆమె తప్పులో కాలేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదించిన క్షణం నుంచే ఆమె వెనుక అప్పటి వరకూ నడిచిన వారు షర్మిల నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారు. దీంతో ఆమె 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించే నాటికి.. పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరవయ్యారు. పాలేరుతో పాటు మరో స్థానం నుంచి షర్మిల నిలబడతారు. ఇది ఖాయమే. అలాగే మరో రెండు స్థానాల నుంచి అభ్యర్థులుగా ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్, తల్లి విజయమ్మ నిలబడినా మిగిలిన 115 నియోజకవర్గాలలో నిలబడేందుకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి. దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చానా ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలుపుతామంటూ ఆమె చేసిన ప్రకటనను నెటిజన్లు హేళన చేస్తున్నారు. ఎవరి కోసమో, ఎవరో వదిలిన బాణంగా రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు  దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంతలా చెబుతున్నా ఎందుకు నమ్మరు.. జనంపై సజ్జల ఆక్రోశం!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవినీతికి  పాల్పడ్డారు. స్కిల్ స్కాంలో ఆయనకు ముడుపులు అందాయి. అని ఎంతగా చెబుతున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? మేం ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు? అంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పేది మీరు నమ్మి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెప్పినా ఎందుకు నమ్మడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. గత  40 రోజులుగా చెప్పించే చెబుతూ వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డీ నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నా జనం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మడం లేదు. ఆయనను జగన్ సర్కార్ కక్ష పూరితంగా అరెస్టు చేసిందంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన గొడవ.. కేసులు, దాడులను ఎదుర్కొనవలసిన అవసరం ఏముంది? అనుకుంటూ తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ మనస్సులలోనే దాచుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడిపేసిన జనం ఇప్పుడిక తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ  దాచుకోవడానికి, అణచుకోవడానికి ప్రయత్నించడంలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగా, బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సజ్జల వారికి చిర్రెత్తుకొచ్చింది. మీడియా సమావేశం పెట్టి మరీ  ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటూ మేం చెబుతున్నా మీరెందుకు నమ్మరు? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఔను మీడియాలో ఆయన మాట్లాడిన విషయాల సారాంశమిదే. దీంతో ఇప్పటి వరకూ ఏమో స్కిల్ కేసులో కుంభకోణం ఉందేమో అని జనంలో ఏమూలైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. సజ్జల మాటల తరువాత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారని విస్పష్టంగా అర్ధమైంది. ఇదే విషయంపై నెటిజన్లు సజ్జలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఇరికించిందనడానికి సజ్జల మాటలే నిదర్శనమంటూ ఫైరౌతున్నారు. వైసీపీ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు జనం నమ్మడం లేదనడానికి సజ్జల మాటలే సాక్ష్యమంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వివరిస్తున్నారు.  ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఓ వైపు సజ్జల అండ్ కో  చెబుతుంటే.. న్యాయస్థానాలలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం.. ఆధారాలా వాటి గురించి అడగకంటి.. స్కిల్ కేసులో అవినీతి జరిగింది. ఇక ఇప్పుడు ఆధారాలు సేకరించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశాం అంటూ చెబుతున్నారు. సెక్షన్ 17ఏపై కూడా అదే వితండ వాదన అటుతిప్పీ ఇటు తిప్పీ వినిపిస్తున్నారు.  రేపు, మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్కిల్ కేసులో తనకు కావలసింది బెయిలు కాదు.. అసలు కేసే కొట్టేయాలంటూ చంద్రబాబు ధర్మాగ్రహంతో న్యాయపోరాటం సాగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. నీళ్లు నములుతోంది. అవినీతి జరిగిందని చెబుతున్నాం కదా.. కేసు కట్టేశాం.. ఇక ఇప్పుడు ఆధారాల కోసం విచారిస్తాం అంటున్నారు.   అందుకే సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు అంటూ జనాన్ని నిందిస్తున్నారు. వాస్తవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే జనం అబద్ధాలు ఎందుకు  నమ్ముతారన్న లాజిక్ ను సజ్జల మరచిపోయారు పాపం. 

ఆ ఒక్కటీ అడక్కండి.. బాబు కేసులో సర్కర్ లాయర్ల వాదనల తీరు!

చంద్రబాబు అక్రమ అరెస్టు..తదననంతర పరిణామాలతో వైసీపీ నేతలలో గుబులు రేగుతోంది. చంద్రబాబు  అరెస్టుతో ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహ జ్వాలలు తమ రాజకీయ భవిష్యత్ ను సమాధి చేయడం ఖాయమని ప్రైవేటు సంభాషణల్లో  చెబుతున్నారు. రేపు వైసీపీ పరాజయం పాలైతే.. వచ్చే కొత్త సర్కార్ ఇదే పద్ధతిని అనుసరిస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై 40 రోజులు అయ్యింది.   ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా ఆయన చేసిన న్యాయపోరాటంలో పసలేని ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ఎవరైనా.. ఇంత అడ్డగోలుగా, ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయి. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు.  చంద్రబాబు, తెలుగుదేశం ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే.. రెండో వైపు చంద్రబాబు అక్రమ అరెస్టు రాజకీయ వేధింపులలో భాగమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జాతీయ మీడియా వేదికగా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. న్యాయవాదులు కోర్టులకు కూడా ఇదే విషయాన్ని విన్నవించారు. అమిత్ షా స్వయంగా  లోకేష్ ను పిలిపించుకుని విషయాన్ని ఆరాతీశారు. చంద్రబాబు  ఆరోగ్య పరిస్థితి గురించీ వాకబు చేశారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయినా.. బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు అరెస్టు విషయంలో ఎటువంటి స్పందనా రాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులే కాకుండా, గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే బీజేపీ అగ్రనేతలు అ మిత్ షా, మోడీల నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. అది మినహా రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ ఉద్యోగులూ..ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.  స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని న్యాయనిపుణులు సైతం చెబుతున్నారు. అయినా కోర్టులలో మాత్రం కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చివరాఖరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఆ తీర్పు శుక్రవారం (అక్టోబర్ 19) వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న విషయంపైనే అందరి దృష్టీ ఉంది. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా జరిగిన వాదనలూ, వాటిపై న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలను గమనించిన న్యాయనిపుణులు కచ్చితంగా సుప్రీం లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని చెబుతున్నారు. అయినా గత 40 రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్య జనంలో మాత్రం ఎక్కడో ఏ మూలో ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతుంటే.. ఎటువంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉండటమంటే ఏపీలో న్యాయం, ధర్మం అనే మాటలకు అర్ధం లేకుండా పోయిందా అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఇక ఇప్పుడు ఈ పద్ధతులనే ఉపయోగించి పార్టీలోని ఇతర ముఖ్య నేతలను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముందు అరెస్టు చేసి.. ఏవో సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడితే చాలు.. అక్కడా జగన్ సర్కార్ కు తెలిసిన సాగదీత విధానాలతో రోజుల తరబడి బెయిలు రాకుండా వాదనలు కొనసాగించే కొత్త పద్ధతికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందని పరిశీలకులు అంటున్నారు. అయితే రాజకీయ అరాచకత్వానికి ఇది పరాకాష్ట అనీ, రేపు ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైతే.. అప్పుడు జగన్ పరిస్థితి ఏమిటని పరిశీలకులు అంటున్నారు. ఇదే ఆందోళన వైసీపీ నేతలలో కూడా వ్యక్తం అవుతోంది. కొందరైతే బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. అయితే ఈ తీరు సరికాదనీ, కక్ష సాధింపు రాజకీయాలతో తాత్కాలికంగా పై చేయి సాధించినా, ముందు ముందు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనీ వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు అక్రమ అరెస్టు తమ రాజకీయ భవిష్యత్ నే ప్రమాదంలో పడేసిందన్న ఆందోళన వైసీపీ సీనియర్ నేతలలో వ్యక్తం అవుతోంది. ధర్మాన, తమ్మినేని లాంటి వారు కార్యకర్తల సమావేశాల్లో, ప్రైవేటు మీటింగులలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

దసరా గిఫ్ట్ గా ఎమ్మెల్యేలకు జగన్ సీల్డ్ కవర్లు.. విషయమేమిటంటే..?

ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు జగన్ దసరా గిఫ్టుల సంచలనం రేపుతున్నాయి. ఔను ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి దసరా గిఫ్టులు పంపించారన్న ప్రజారం జోరుగా సాగుతోంది. అయితే అవేం ఆషామాషీ గిఫ్లులు కాదని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ కొందరు ఎమ్మెల్యేలకు పింపించిన ఈ దసరా గిఫ్టులు వారి వారి నియోజకవర్గాలలో వారి పనితీరు, వారి విజయావకాశాలు తదితర అంశాలకు సంబంధించిన జగన్ సొంతంగా చేయించిన సర్వే రిపోర్టుల సీల్డ్ కవర్ లు అంటున్నారు . అయితే ఈ సీల్డ్ కవర్ లు ఏయే ఎమ్మెల్యేలకు పంపించారన్న సమాచారం లేకపోయినా.. చాలా మంది సిట్టింగులకు ఇవి అందాయని అంటున్నారు.  దీంతో ఈ సీల్డ్ కవర్లు ఎవరెవరికి అందాయి, అందులో వివరాలేంటి అన్న వివరాలు తెలియక మొత్తం ఎమ్మెల్యేలంతా తెగ టెన్షన్ పడిపోతున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అక్టోబర్ నెలలో అందిన తాజా సర్వే ఫలితాలను సీల్డ్ కవర్ లో  అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరన్న వివరాలు కూడా గోప్యంగానే ఉన్నాయి.  దీంతో ఆ రిపోర్టులలో ఏముంది?..  ఈసారి  పార్టీ టికెట్ గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ, అలాగే టికెట్ దక్కకుండా పోయే వారు ఎవరు? ఒక వేళ టికెట్ ఇచ్చినా.. తమ సిట్టింగ్ స్థానాలలోనే ఇస్తారా.. లేక నియోజకవర్గం షిఫ్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఉంటుందా? లేదా ఎమ్మెల్యేగా మీ సేవలు చాలు..ఇక లోక్ సభకు పోటీ చేయండి అంటారా? అసలు ఎవరెవరికి ఈ రిపోర్టులను దసరా గిఫ్టుగా జగన్ పంపించారు అన్న ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో  వ్యక్తమౌతోందంటున్నారు.   ఏపీలో మరో ఐదారు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆరు నెలల లోపు అంటే ఇక సమయం లేదు మిత్రమా రణమే అన్నట్లుగా  పరిస్థితి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆరంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కోఆర్డినేటర్ల ద్వారా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆరంభమైపోయిందంటున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను బుజ్జగిస్తూ కలిసి పనిచేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, పలు నియోజకవర్గాలలో అసంతృప్తులు రెబల్స్ గా మారుతుండడం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారుతుంది. మరోవైపు  వైసీపీ సొంత సర్వే ఫలితాలు జగన్ చేతికి చేరడంతో..ఆ సర్వే ఫలితాల ఆధారంగానే  అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తులో భాగంగానే జగన్ కొందరు ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో సర్వే ఫలితానికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్ లో పంపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అంతే కాదు సర్వేల ఫలితాల ఆధారంగా పంపిన సీల్డ్ కవర్ లో ఆయా నియోజకవర్గాలలో  పార్టీ పరిస్థితి, సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, గెలుపు అవకాశాల వివరాలతో పాటు 25 అంశాలతో కూడిన లేఖలను సీఎం పంపించారని చెబుతున్నాయి. అయితే ఇప్పటికింకా ఆ లేఖలు ఎవరికీ చేరలేదనీ, ఒకటి రెండు రోజులలో అవి అందుతాయనీ పార్టీ వర్గాల సమాచారం.  దీంతో   తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా తీసిన సర్వేల ఫలితాలు ఈ లేఖలో ఉండనుండగా.. పనితీరు బాగోలేని వారి పట్ల జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీటు ఉంటుందా ఉండదా అన్నది లేఖ వస్తే కాని అర్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది.  పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు మెరుగ్గా పనిచేయాలని, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని గతంలోనేజగన్ సంకేతాలు  పంపారు. గతంలో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భం ఆ ఎమ్మెల్యేలకే ఇప్పుడు మళ్ళీ లేఖలు పంపి ఉంటారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా వైసీపీ సొంత సర్వేల ఫలితాలు వెలువడగా.. తాజాగా మూడవ విడత  ఫలితాలు కూడా అందాయి. గతంలో అందిన రెండు ఫలితాల ఆధారంగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరించగా.. ఇప్పుడు ఈ ఫైనల్ సర్వే ఫలితాల తర్వాత మాత్రం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు లేఖలు పంపిన జగన్ అందులోనే పూర్తి వివరాలను పొందుపరిచారంటున్నారు. దాదాపుగా 25 నుండి 30 మందికి ఈసారి టికెట్లు కష్టమేనని.. ఇప్పటికే కొత్త అభ్యర్థుల కోసం అన్వేషణ కూడా మొదలైనట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు ఈ లేఖల కలకలం రేగుతుంది. కాగా, ఎమ్మెల్యేల పనితీరుపై లేఖలు సరే.. అసలు వైసీపీ తాజా ఫైనల్ సర్వేలో రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అందాయన్నది రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారింది. కాగా పరిశీలకులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ సిట్టింగులకు టికెట్ నిరాకరించి కొత్త అసంతృప్తిని ఆహ్వానించే పరిస్థితిలో లేరనీ, పని తీరు, ప్రజా మద్దతుతో పని లేకుండానే సిట్టింగులను బుజ్జగించి పనితీరు మెరుగుపరుచుకోమని బతిమలాడుకోవడమే ఆ లేఖల సారాంశం అయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక సెగ తగిలిన ఎమ్మెల్యేలూ, నేతలలో గెలుపు ఆశలు అడుగంటి పోయాయని, అందుకే పార్టీ పెద్దల హెచ్చరికలు, బెదరింపులను ఖాతరు చేసే పరిస్థితి ఉండదనీ అంటున్నారు. తాను ఎవరినీ వదులుకోననీ, అందరూ తనవారేనని గతంలో జగన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జగన్  సీల్డ్ కవర్ నివేదికల్లో ఉన్న విషయాన్ని బట్టి ప్రజ్వరిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు ఖరారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశాలపై ఈ రోజు బిజెపి, జనసేన పార్టీలు చర్చలు జరిపాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో జనసేన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఎన్డి ఏలో జనసేన పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కల్సి పోటీ చేసి విజయం సాధించడానికి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.  రానున్న ఎపిఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలు   పొత్తు  ఖరారైంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్ డి ఏలో భాగ స్వామి అయిన జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది.  తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డికి వివరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి,  బిజెపి అభ్యర్థుల విజయానికి తమ పార్టీ కృషి చేసినట్టు జనసేనాని కిషన్ రెడ్డికి వివరించారు. బి జెపి అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ మున్సిల్  కార్పోరేషన్  ఎన్నికల నుంచి జనసేన పార్టీ తప్పుకున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో కిషన్ రెడ్డికి గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 స్థానాల నుంచి జనసేన పోటీ  చేయాలని యోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షుడికి వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల్లో బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. 

చంద్రబాబు లీగల్ ములాఖత్ కుదింపు వెనక మరో కుట్ర?

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన స్కిల్  కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై  దాదాపు 40 రోజులు కావస్తోంది. కోర్టులలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది.  సీఐడీ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో  ఘోరంగా విఫలమైంది. మొత్తానికి ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ, వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వులో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారం (అక్టోబర్ 20) తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకూ చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయనను కలిసేందుకు ములాఖత్ సాధారణంగానే ఉండేది.    సాధారణంగా కుటుంబ సభ్యులు, మిత్రులకు ములాఖత్ లో అవకాశం ఇస్తారు. ఇలా వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంటుంది.  ఇది కాకుండా లీగల్ ములాఖత్ అని మరో అప్షన్ కూడా ఉంటుంది. ఈ లీగల్ ములాఖత్ లో న్యాయవాదులు చంద్రబాబును   రోజుకు రెండుసార్లు కలిసే వెసులు బాటు ఉంటుంది.  చంద్రబాబు విషయంలో కూడా  ఇప్పటి వరకూ అలాగే వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు, మిత్రులకు.. రోజుకు రెండుసార్లు లాయర్లకు ములాఖత్ అవకాశం ఇచ్చారు. కానీ  ఉన్నట్లుండి ఇప్పుడు ఒక్కసారిగా ములాఖత్ సంఖ్యను కుదించినట్లు జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇకపై రోజుకు ఒక్కసారి మాత్రమే లీగల్ ములాఖత్ కు అవకాశం ఇస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. గతంలో వారానికి రెండుసార్లు ఉన్న ఫ్యామిలీ-ఫ్రెండ్స్ ములాఖత్ ను కూడా వారానికి ఒక్కసారికి పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు. నిత్యం న్యాయవాదులు చంద్రబాబును కలుస్తుండడంతో జైలులో ఉన్న ఇతర ఖైదీలు ఇబ్బంది పడుతున్నారని.. ఈ కారణంతోనే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.  దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.   జైళ్ళ శాఖ డీఐజీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేశారు. జైళ్ల శాఖ ఈ ములాఖత్ కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నది. నిజానికి రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ అనేది చంద్రబాబు హక్కు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు..  సాధారణంగా అందరికీ ఉన్న హక్కు. అయితే ఇతర ఖైదీలకు ఇబ్బంది కారణంగా ఒక్క చంద్రబాబు ములాఖత్  సంఖ్యను ఒకటికి కుదించడం అంటే హక్కులను కాలరాయడమే అవుతుంది,   అయితే, చంద్రబాబు లీగల్ ములాఖత్ సంఖ్యను రెండు నుంచి ఒకటికి కుదించడం వెనుక  భారీ కుట్ర  ఉందని  న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లీగల్ ములాఖత్ ద్వారానే చంద్రబాబు అటు పార్టీ వ్యవహారాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. మరోవైపు కేసుకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కీలక అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు నడిపిస్తున్నారని వైసీపీ బలంగా అనుమానిస్తోంది. అందుకే పార్టీతో పాటు కేసు విషయంలో చంద్రబాబు యాక్టివిటీ తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఈ తరహా సాకులతో చంద్రబాబు లీగల్ ములాఖత్ ను రెండు సార్లు నుంచి ఒక సారికి తగ్గించిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ కేసు పై ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు విచారణలు కొనసాగుతున్నాయి. ఒక్క స్కిల్ స్కామ్ కేసే కాదు. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసుతో పాటు తాజాగా అమరావతి సీఆర్డీఏ కేసును కూడా మళ్ళీ రీ ఓపెన్ చేయాలనీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా అన్ని రకాల కేసులపై ఏకకాలంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు విచారణలు కొనసాగుతున్న క్రమంలో పదుల సంఖ్యలో లాయర్లు జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. అది అవసరం కూడా. ఈ క్రమంలోనే ములాఖత్ పై ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం జైళ్ల అధికారుల ద్వారా ఈ తరహా కుట్రకు తెరతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జైళ్ల శాఖ డీజీపీ దృష్టికి తెలుగుదేశం తీసుకువెళ్లింది.  ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.

చంద్రబాబు గొప్ప విజనరీ.. కన్వాల్ లేఖీ

నారా చంద్రబాబు నాయుడు.. అభివృద్ధికి ఐకాన్. ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు అనుసంధానం చేయడంలో ముందుంటారు. అందరూ  రేపటి గురించి  ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం రేపటి  తరం గురించి  కూడా ఆలోచిస్తారు. ఇలా చంద్రబాబు గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి చంద్రబాబును.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉఫాథి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో తీసుకువచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఒక్క ఆధారం చూపకుండా.. అరెస్టు చేసేసి, ఇప్పుడు ఎలాగూ అరెస్టు చేశాం కదా.. ఆయనను విచారించి ఆధారాలు సంపాదిస్తామన్న వితండవాదన చేస్తోంది. ఈ కేసులో కావాలనుకుంటే చంద్రబాబుకు ఒక్క రోజులో బెయిలు మంజూరై ఉండేది. అయితే ఆయన బెయిలుపై బయటకు రావడం కంటే.. తనపై కేసునే సవాల్ చేయడానికే చంద్రబాబు మొగ్గు చూపారు. అందుకే ఇది తప్పుడు కేసు క్వాష్ చేయండంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు అలవాటైన సాగదీత విధానంతో కోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు జాప్యం అయ్యేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నది. అందులో కొంత మేరకు సఫలమైందనే చెప్పాలి. అయితే కోర్టుల్లో వాదనల్లో ప్రభుత్వ  డొల్లతనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సామాన్యులకు, చిన్న పిల్లలకు సైతం అర్థమైపోయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒకటి  రెండు రోజులలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే చేయని నేరానికి, లేని కేసులో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఖండనలు వెల్లువెత్తుతున్నాయి.  సామాన్య ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను తెలుపుతూ..బాబు కు సంఘీభావం చెపుతున్నారు. రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ సర్కిల్స్ లో దిగ్గజాలైన వారు కూడా సామాజిక మాధ్యమంలో స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇ యామ్ విత్ బాబు హ్యాట్ టాగ్ తో వారి పోస్టులు వైరల్ అవుతున్నాయి.  తాజాగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇన్వెంటస్ ఎండీ కన్వాల్ రేఖీ లింకెన్డెన్ లో షేర్ చేసిన పోస్టులో చంద్రబాబు ఓ విజనరీ అంటూ పేర్కొన్నారు. ఆయన దార్శనికత.. చిట్టడవిలా.. కొండలు, గుట్టలతో నిండిన నిర్మాణుష్య ప్రదేశాన్ని హైటెక్ సిటీగా మార్చిందని పేర్కొన్నారు.   సంపద సృష్టిలో దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. చంద్రబాబు విజన్ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేసిందని పేర్కొన్నారు.  హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చే క్రమంలో సైబరాబాద్ నగర నిర్మాణానికి, రాష్ట్ర భవిష్యత్, పురోగతి, ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు పడిన తపన, అందుకోసం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్రానికి సీఈవోగా ఆయన చేసిన కృషి ప్రస్తావించి ఆయన నిజంగా చాలా చాలా గ్రేట్ అని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు.   అప్పట్లో విదేశీ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిథులతో ఆయన నిర్వహించిన సమావేశం వివరాలనూ వివరించారు. తానూ ఆ సమావేశంలో భాగస్వామినేనని పేర్కొన్న ఆయన.. ఆ సమావేశానికి ముందు జరిగిన వివరాలను పూసగుచ్చినట్లు వివరించారు. వాస్తవానికి తాము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందనీ, అయితే అప్పటికి దుబాయ్ లో ఉన్న చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పొద్దున్నే తాను వచ్చి కలుస్తాను ఉండమని కోరారు. అన్నట్లుగానే తెల్లవారి నాలుగు గంటలకల్లా చంద్రబాబు తమతో భేటీ అయ్యారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. ఆ భేటీలో  రాష్ట్ర భవిష్యత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఐటీ పురోగతి తదితర అంశాలపై తమ మధ్య అర్ధవంతమైన చర్చ జరిగిందనీ, భేటీ తరువాత ఆయన తమను పోలీసు ఎస్కార్ట్ తో ఎయిర్ పోర్టుకు పంపించారని కన్వాల్ రేఖీ పేర్కొన్నారు. అటువంటి విజన్ ఉన్న నేత, అభివృద్ధి కోసం, ప్రగతి కోసం అంతగా తపనపడే నేత చంద్రబాబునాయుడు తప్ప మరొకరు ఉండరని పేర్కొన్నారు.  కన్వర్ రేఖి పోస్టు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు వంటి గొప్ప నేతను అక్రమంగా అరెస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట మసకబారిందని నెటిజన్లు అంటున్నారు. జగన్ ఒక సైకో సీఎం అని సందేహాతీతంగా చంద్రబాబు అక్రమ అరెస్టు రుజువు చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు.  ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయాలని చూస్తే ఆకాశంపై ఉమ్ము వేయడానికి చూసినట్లే. చంద్రబాబు విషయంలో ఈ విషయం పదే పదే రుజువు అవుతోంది. ఇప్పుడు జగన్  సర్కార్ ఆయనపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆన ప్రతిష్టకు కానీ, గొప్పతనానికి కానీ వీసమెత్తు నష్టం జరగలేదు.. కానీ అక్రమంగా అరెస్టు చేసిన జగన్ ప్రతిష్ట మాత్రం పాతాళానికి పడిపోయింది. దేశ విదేశాల నుంచి ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ వెల్లువెత్తుతున్న ఆందోళనలే సాక్ష్యం. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు ముందు చూపును ప్రస్తావిస్తూ నాడు ఆయన హైదరాబాద్ కు ఇండియన్ బిజినెస్ స్కూలు రావడంలో పోషించిన పాత్రను గుర్తు చేస్తున్నారు.  రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే  ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయని ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

ప్రజల వద్దకు తెలుగుదేశం నుంచి.. ప్రజలే తెలుగుదేశం చెంతకు.. బాబు అరెస్టుతో మారిపోయిన పరిస్థితి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజలలోకి వెళ్లకుండా నిలువరించడమే లక్ష్యంగా జగన్ పన్నిన వ్యూహం ఫలించిందా? వికటించిందా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి మాత్రం పూర్తిగా బెడిసికొట్టిందన్న సమాధానమే వస్తున్నది. జగన్ ఇప్పుడేమిటి? రెండేళ్ల కిందటే తన పార్టీపై, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను గ్రహించారు. అందుకే డైవర్షన్ స్కీమ్ లో భాగంగా వైనాట్ 175 అన్న నినాదాన్ని ఎత్తుకుని ప్రజలలో కాకపోయినా.. పార్టీ శ్రేణుల్లోనైనా ఏదో మేరకు ఉత్సాహాన్ని నింపాలని భావించారు. అందుకు అనుగుణంగానే సమయం, సందర్భం లేకుండా, పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా అన్న విచక్షణ కూడా లేకుండా మైకు పట్టుకున్న ప్రతి సారీ.. పరనింద, ఆత్మస్థుతి అజెండాగా అవు కథ కాలంటి ప్రసంగాలు చేస్తూ.. వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు జగన్ ఆ వైనాట్ 175 నినాదాన్ని ప్రజలు తెలుగుదేశం కు మద్దదుగా నినదిస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. అన్నిటికీ మించి పార్టీ  పరంగా గడపగడపకు మన ప్రభుత్వం, బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్ అంటూ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్ల లేని పరిస్థితి ఉండటంతో  అవన్నీ విఫలమయ్యాయి. జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అయితే ఘోరంగా విఫలమైంది. ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజాగ్రహ సెగ తగిలి విలవిలలాడిపోయారు. దీంతో చాలా మంది అసలా కార్యక్రమంలో పాల్గొనకుండానే మమ అనిపించేశారు. దీనిపై జగన్ పలు మార్లు సమీక్ష చేసి.. గడపగడపకూ కార్యక్రమాన్ని  నిర్లక్ష్యం చేసిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని హెచ్చరికలు కూడా  చేశారు. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. టికెట్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో తత్వం బోధపడిన సీఎం.. ఇక గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడమే మానేశారు. తాను ఎటూ పరదాలు లేకుండా తాడెపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెట్టరు.. యధా రాజా తథా ప్రజ అన్నట్లుగా జగన్ ను చూసి పార్టీ నేతలు కూడా జనం మొహం చూడటం మానేశారు. కేవలం బటన్ నొక్కితే చాలు అన్నీ సర్దుకుంటాయన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత విపక్ష నేత చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనసందోహం రూపంలో కనిపించడంతో.. తానెటూ జనంలోకి వెళ్లను.. విపక్షాలను ఎందుకు వెళ్ల నివ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. కోర్టులలో కేసులను ఎలా సాగదీయాలన్న విషయంలో దిట్ట అయిన జగన్.. చంద్రబాబు అరెస్టు తరువాత ఆయనను 40 రోజులుగా నిర్బంధంలో ఉంచేందుకు తనకు బాగా తెలిసిన సాగదీత నే నమ్ముకున్నారు. దీంతో చంద్రబాబు ప్రజల మధ్యకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అంతే కాదు.. అశేష ప్రజాదరణతో  నిరాటంకంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. మొత్తం తెలుగుదేశం శ్రేణులన్నీ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలకే పరిమితమయ్యారు. కీలక నేతలంగా రాజమహేంద్రవరం, హస్తిన, బెజవాడ కే పరిమితమైపోయారు.  చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో  ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యక్రమాలే.  బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ , ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో  జగన్ పార్టీ కాళ్ల కింద నేల కదిలిపోతోందా అనిపించేలా పరిస్థితి ఉండేది. అయితే అరెస్టు తరువాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు అరెస్టుతో ఆవేదనలో పడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు, ఆందోళనలు లేవు.  అంతా  చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ.. సుదీర్ఘంగా సాగుతున్న కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికే పరిమితమయ్యారు. దీంతో జగన్ పార్టీ నేతలు తమ వ్యూహం ఫలించిందని సంబరాలు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో, దేశంలో చివరకు విదేశాలలో సైతం జనం స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్ల మీదకు వస్తుండటంతో .. చంద్రబాబు అరెస్టుతో జగన్ స్వయంగా తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ రాష్ట్రంలో తటస్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండేవారనీ, అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందో.. ఆ క్షణం నుంచీ తటస్థులంతా తెలుగుదేశం పక్షానికి చేరిపోయారనీ సోదాహరణంగా చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ దిద్దుకోలేని తప్పు చేశారనీ, దాని  ఫలితం వచ్చే ఎన్నికల్లో పరాజయం రూపంలో అనుభవించక తప్పదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు. ఇక పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.  గత కొన్ని రోజులుగా  వైరల్ ఫీవ‌ర్ తో ఇబ్బంది పడిన పవన్ కల్యాణ్  కోలుకున్నారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే  మంగ‌ళ‌గిరి వ‌చ్చారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆయన మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతతో ఇబ్బంది పడ్డారు. బందర్ లో పార్టీ నేతల సమావేశం జరుగుతుండగా తీవ్రమైన నడుం నొప్పితో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైరల్ ఫీవర్ బారిన పడటంతో హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. పీవర్ తగ్గగానే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ పరిస్థితులు, వారాహి విజ‌య‌యాత్ర ఐదో విడ‌త, జ‌న‌సేన‌,తెలుగుదేశం పార్టీల ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీలో చ‌ర్చించాల్సిన అంశాలు,  రాష్ట్రంలో రైతాంగం  స‌మ‌స్య‌ల‌పై చర్చించారు.

తెలుగుదేశం విజయానికి రెడ్ కార్పెట్!

రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం ఖరారైంది. ఇప్పటికే వెలువడిన ముందస్తు సర్వేలు, రాష్ట్ర ప్రజల మూడ్ (మూడ్ ఆఫ్ ఏపీ)ను బట్టి రాజకీయ పరిశీలకులు ప్రభుత్వం మారడం ఖాయమని తేల్చేశారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ సొంత సర్వేలలో ప్రజల అసంతృప్తి స్పష్టంగా వెలువడింది. గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తి సెగ కు మాడిపోయారు. ప్రజాగ్రహాన్ని స్వయంగా చవి చూశారు.   దానికి తోడు ఇప్పుడు పసలేని అక్రమ కేసులలో అలవి గాని సెక్షన్లను బనాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పట్ల ప్రజలలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నెరవేరని హామీలు, పడకేసిన అభివృద్ధి, ఊసే లేని ఉపాధి, ఏ రంగానికి దక్కని ప్రోత్సాహం, స్పష్టత లేని మంత్రులు,   దిశా నిర్ధేశం లేని ప్రభుత్వం,  ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే పనిగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఫలితంగా ఈ అసంతృప్తి  రేపు ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఓట్లుగా మారనుందన్నది పరిశీలకుల విశ్లేషణ. . వైసీపీ మీద అసంతృప్తి  ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమికి ఓటు బ్యాంకు కానుందా అంటే ఖచ్చితంగా ఔననే సమాధానమే వస్తున్నది.  ఏపీలో ఇప్పుడు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలే కాగా.. మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన కనిపిస్తున్నది. అయితే, పవన్ జనసేన ఇప్పుడు టీడీపీలో ఉంది. మిగతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రెండూ కలిపినా రెండు శాతం ఓటింగ్ కూడా లేని పార్టీలు. ఇక కమ్యూనిస్టులు కూడా టీడీపీ, జనసేనతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రాష్ట్ర   ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమివైపే మొగ్గు చూపుతున్నారు.   ప్రజా వ్యతిరేకత, ప్రధాన ప్రత్యామ్నాయంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు కూడా టీడీపీ విజయానికి రెడ్ కార్పెట్ పరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నాలుగేళ్ల జగన్ పాలనలో సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాధం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మీడియా మైకుల ముందుకొచ్చిన ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజికవర్గాన్ని కలవరించే వారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సొంత సామజిక వర్గానికి దోచి పెట్టారనే కోణంలోనే విమర్శలు సాగేవి. చివరికి రాజధాని కూడా చంద్రబాబు సామాజికవర్గం కోసమే అమరావతిలో పెట్టారనే ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల పాటు ఈ తరహా విమర్శలు సాగగా ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ పాఠాలను వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంశంలో కూడా అదే జరిగింది. వైసీపీలో పవన్ సామాజిక వర్గ నేతలను ఉసిగొల్పి విమర్శలు చేయించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు అనే నినాదం అందుకున్నారు. ఫైనల్ గా వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై ఈ తరహా విమర్శలతో రెండు సామాజికవర్గాలకు జగన్   వ్యతిరేకి అనే ముద్ర బలంగా వేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోని ఈ రెండు సామజిక వర్గాలు కూడా వైసీపీకి దూరమయ్యాయి.  అనాది నుండి బీసీ సామజిక వర్గాలు టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ హయం నుండి ఇప్పటి వరకూ టీడీపీలో పెత్తనంతో పాటు పదవులలో కూడా బీసీలకు ప్రధాన వాటా ఉంటుంది. అయితే, 2019లో కొద్ది శాతం బీసీలను రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ఆకర్షించింది. కానీ  ఈ నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు కూడా జగన్ దూరమయ్యారు. బీసీలలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఏం చేద్దాం అనే మాటే వినిపించకుండా చేశారు. వ్యవసాయం అంటే రైతు భరోసా బటన్ నొక్కడమే అనుకున్న సీఎం పట్ల సీఎం సొంత సామాజికవర్గ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అటు కులాల మధ్య చిచ్చు పెట్టడం.. తమ వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈ సామజిక వర్గాలన్నీ వైసీపీకి దూరమై టీడీపీ, జనసేన కూటమికి చేరువయ్యారు. ప్రజల పోలరైజేషన్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఇది జగన్ తప్పిదాల వలనే ప్రజలకు తెలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు.