ఆఫీసుకి ఇలా వెళ్తే... ఆయుష్షు పెరుగుతుంది!

ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షలా యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం. వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. ఏతావాతా.... సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది. సైకిల్ మీద ఆఫీసుకి వెళ్లేవారు, సగటున వారానికి 30 మైళ్ల వరకూ ప్రయాణం చేస్తున్నట్లు తేలింది. ఇదేమీ మామూలు వ్యాయామం కాదు కదా! క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తే ఎంత లాభమో, రోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అంతే లాభమని చెబుతున్నారు. ఒక్కసారి కనుక ఈ అలవాటు మన జీవితంలో భాగమైతే, అదిక పెద్ద కష్టంగా తోచదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు! ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట. ఇంతాచేసి పరిశోధకులు చెబుతున్న విషయం ఏమిటంటే... వీలైనప్పుడల్లా బైక్‌ని పక్కనపెట్టి సైకిల్‌ మీద స్వారీ చేయమనే! దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికీ మేలు జరుగుతుంది, బస్సుల కోసం నిరీక్షించే సమయమూ మిగులుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం దక్కుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. -నిర్జర.

కంటి క్యాన్సర్ కు థెరపీ

కంటి క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు శుభవార్త. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ థెరపీని విజయ వంతంగా  నిర్వహించింది. కంటి క్యాన్సర్ రోగులకు అక్యులర్ ట్యూమర్లు కు ఎయిమ్స్ ఢిల్లీ డాక్టర్లు రుతినియం 106 ప్లాక్యూ ను వినియోగించి రక్త నాళాలలో ఉండే ట్యూమర్లను హోలగించడంలో వైద్యులు విజయం సాధించారు. బాబా అటామిక్  రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ కు థెరపీ రోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు కేంద్ర అణు శక్తి ఇంధన శాఖా మంత్రి జితేందర్ సింగ్ అదే శాఖకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అఫామిక్సైన్స్ ఎయిమ్స్ బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ సంయుక్తంగా అతి తక్కువ ఖర్చులో దీనిని రూపొందించినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన సింపుల్ గ ఉండే పద్ధతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. బాబా అటామిక్ ఎనెర్జీ  అభివృద్ధి చేసిన్ ప్లాక్ సర్జన్లకు చాల సులభమైనదని అన్నారు. ప్లాక్ థెరపీ రేడియో యాక్టివ్ సోర్స్ తో రుతినియం 106 రేడియో వేస్ట్ నుండి రూపొందించినట్లు తెలిపారు. ఇది చాల సులభమైనదని చిన్న పరిమాణంలో ఉండే ప్లాక్యూ 50 మంది రోగులకు సంవత్సరం పాటు వినియోగించవచ్చని చెప్పారు. కాగా ఎయిమ్స్ ఈ చికిత్సను చేసేందుకు రెండు ఆసుపత్రులకు అందించనుంది.  అందుకు శంకర్ నేత్రాలయా హైద్రాబాద్, బెంగుళూరు ఆసుపత్రులను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ ప్రకటించిన వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదానికి బలం చేకూర్చి నట్లయింది. గత సంవత్సరం అక్టోబర్ లో డిఏసి  ఛైర్మెన్ వ్యాస్ జితేంద్ర సింగ్ తో సుదీర్ఘ చర్చలు అనంతరం డీఐఈ, బార్క్, ఎయిమ్స్ , ఆప్తమాలిక్ సైన్సెస్ శాఖలు సంయుక్తంగా డాక్టర్ వ్యాస్, డాక్టర్ అతుకుమార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ల సమన్వయంతో రూపొందించామన్నారు. అయితే కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ డాక్టర్ కావడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

శాకాహారంతో ఆరోగ్యమే కాదు, పర్యావరణమూ క్షేమమే!

శాకాహారమా, మాంసాహారమా... ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న అనుమానం ఈనాటిది కాదు. సాధారణంగా శాకాహారానికే ఎక్కువ ఓట్లు పడినప్పటికీ, కొన్ని రకాల పోషకాలు కేవలం మాంసాహారం ద్వారానే సాధ్యమనే వాదనా వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ Academy of Nutrition and Dietetics (AND) అనే సంస్థ ఒక నివేదికను రూపొందించింది.     ఆరోగ్య సమస్యలు దూరం మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారులలో అనేకరకాల ఆరోగ్య సమస్యలు తక్కువగా కలుగుతాయని తేల్చారు ‘AND’ పరిశోధకులు. శాకాహారం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 62 శాతం తక్కువగా కనిపిస్తోందట. ఇక ప్రొస్టేట్‌ క్యాన్సర్ సోకే ప్రమాదం 35 శాతం తక్కువగానూ, గుండెజబ్బులు ఏర్పడే అవకాశం 29 శాతం తక్కువగానూ ఉండటాన్ని గమనించారు. పైగా మాంసం తినే అలవాటు ఉన్న పిల్లలతో పోలిస్తే శాకాహారంపు అలవాట్లు ఉన్న పిల్లలలో ఊబకాయం కూడా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాదు! రక్తపోటు, అధికకొవ్వు, పేగు క్యాన్సర్‌ వంటి సమస్యలూ అంతగా పీడించవంటున్నారు. పైగా మాంసాహారతో పోలిస్తే శాకాహారం తీసుకునేందుకు అయ్యే ఖర్చు కూడా అంత భారంగా ఉండదన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు.     పర్యావరణానికీ క్షేమమే మాంసాహారంతో పోలిస్తే శాకాహారం మీద ఆధారపడటం వల్ల పర్యావరణానికి కూడా మేలు అంటున్నారు ‘AND’ నిపుణులు. ఒక కిలో మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ఖర్చయ్యే వనరులతో పోల్చుకుంటే ఒక కిలో బీన్స్‌ను ఉత్పత్తి చేయడంలో అవసరమయ్యే వనరులు చాలా తక్కువని తేలుస్తున్నారు. దీనివల్ల నీరు, భూమి, ఎరువులు, ఇంధనం... వంటి వనరులన్నీ ఆదా అవుతాయని చెబుతున్నారు. పైగా వాతావరణంలోకి పేరుకునే విషవాయువుల (greenhouse gases) శాతం కూడా తగ్గుతుందట.     తారకమంత్రం కాదు మాంసాహారంకంటే శాకాహారం మంచిది అన్నారు కదా అని ఏది పడితే అది తింటే ఉపయోగం లేదంటున్నారు. అన్ని రకాల పోషక విలువలు ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమేనని హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్త కనుక తీసుకుంటే ఏ వయసువారి అవసరాలనైనా శాకాహారం తీరుస్తుందంటున్నారు. ఒక్క B12 తప్ప శాకాహారులకు అన్నిరకాల పోషకాలూ అందుతాయని భరోసా ఇస్తున్నారు. ఆ B12ని కూడా శాకాహారులకు అందించేందుకు ఇప్పుడు B12ని జోడించిన ఆహారపదార్థాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.   అదీ విషయం! శాకాహారం మీద ఆధారపడటం వల్ల మంచి ఫలితాలే ఉంటాయన్న మాట ఇప్పుడు తేలిపోయింది. కాకపోతే శాకాహారం అన్నారు కదా అని ఉత్త తెల్లటి బియ్యం, కాసిని చారునీళ్లు తీసుకోకుండా తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు వంటి అన్నిరకాల ఆహారపదార్థాలనీ తీసుకోమన్న హెచ్చరికా అందిపోయింది.  - నిర్జర.

ఒంటరితనంలో జలుబు కూడా సమస్యే!

సంసారాన్ని విడిచిపెట్టేసి హిమాలయాల్లో గడపాలనుకోవడం వింతేమీ కాదు. అది ఏకాంతం! కానీ సమాజంలో ఉంటూ కూడా ఇతరుల తోడు లేకపోవడం బాధాకరం. అది ఒంటరితనం! మన ఆరోగ్యం మీద ఈ ఒంటరితనం ప్రభావం గురించి ఇంతకుముందు చాలా పరిశోధనలే జరిగాయి. ఒంటరితనంతో వేగిపోయేవారు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారనీ, త్వరగా గతించిపోతారనీ తేల్చారు.   ఒంటరితనంలో దీర్ఘకాలిక అనారోగ్యాల సంగతి అలా ఉంచితే చిన్నపాటి జలుబు ఎలా వేధిస్తుందో చూడాలని అనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 159 మందిని అయిదు రోజుల పాటు గమనించారు. వీరంతా కూడా 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపలివారే! పరిశోధన కోసం ఎన్నుకొన్నవారందరి దగ్గరా కొన్ని వివరాలను సేకరించారు. వారు తమ జీవితాలలో ఎంత తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు? ఇతరులతో వారి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను గ్రహించారు. ఆ తరువాత వారందరికీ జలుబుని కలిగించే ఒక మందుని ఇచ్చారు. ఒంటరితనంతో వేగిపోయేవారిని జలుబు చాలా తీవ్రంగా వేధించిందట! జలుబు లక్షణాలు, వాటి వల్ల వారు బాధపడిన తీరు కూడా తీవ్రంగానే ఉన్నాయట.   అబ్బా...జలుబుతో బాధపడటం కూడా ఓ బాధేనా! ఇదీ ఓ పరిశోధననే అనుకోవడానికి వీల్లేదు. జలుబు వల్ల డబ్బుకి డబ్బు, సమయానికి సమయం వృధా అయిపోతుంటాయి. పైగా ఒంటరతనంలో ప్రతి చిన్న ఆరోగ్య, మానసిక సమస్యా అమితంగా వేధిస్తుందనడానికి ఇదో రుజువు. ఉదాహరణకు ఒంటరితనంతో బాధపడేవారిలో ఒత్తిడి కూడా మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చునట. ఆ ఒత్తిడే వారి శరీరాన్ని కూడా లోబరుచుకుని కేన్సర్ వంటి అనారోగ్యాలకి దారితీస్తుంది.   ఒంటరితనంటే ఎవరూ లేకపోవడమే కాదు.... తన చుట్టూ వందమంది ఉన్నా కూడా ఎవరితోనూ మనసుని పంచుకోలేకపోవడం. ఇది నిజంగా ఓ మానసిక సమస్యే! దానికి పరిష్కారం వెతుక్కోవాల్సిందే. వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగుల శారీరిక లక్షణాలకి మందులు ఇచ్చేసి ఊరుకోకుండా... వీలైతే వారి మానసిక పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైద్యం ఓ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో అంత శ్రద్ధ ఎవరికన్నా ఉంటుందంటారా! - నిర్జర.

చలికాలంలో చమటలు పడుతున్నాయా..?

చలికాలంలో వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలను వెంటపెట్టుకుని వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు కమ్ముకోవడం వంటి కారణాలతో అనేక అనారోగ్యాలకు గురవ్వాల్సివస్తుంది. ఈ కాలంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జలుబు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, దగ్గు, తలనొప్పిలాంటివి ప్రధానంగా ఏర్పడే అనారోగ్యాలు. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పడుతుంటే దాన్ని హైపోధెర్మియా అంటారు. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతూ, శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలు చేసే పనులు మందకొడిగా సాగుతాయి. ఈ అనారోగ్యం ఏర్పడటానికి కారణం చల్లనిగాలి తాకుతున్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించకపోవడం, ఆందోళన ఎక్కువగా ఉండటం, సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం,  ఎక్కువ సమయం నీళ్ళల్లో నానటం లాంటి వాటివల్ల ఈ అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ వ్యాధికి గురయినప్పుడు  మాటల్లో స్పష్టత ఉండదు. వణుకు ఏర్పడుతుంది.  మెదడుకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అశ్రద్ద, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి తగినవైద్యం చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించ టమే కాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చల్లనిగాలి శరీరానికి సోకకుండా శరీరాన్ని పూర్తిగా కప్పివుంచి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. గోరువెచ్చని నీటిని తాగాలి, వేడివేడిగా కాఫీ, టీ, సూప్ లు తాగవచ్చు, హైపోధెర్మియాకు వైద్య చికిత్స ఎంతో అవసరం.  లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆస్తమాతో బాధపడుతున్నవారు.. చలికాలంలో ముఖ్యంగా వృద్ధులలో ఆస్తమా, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. చలిగాలికి రక్షణ చర్యలు తీసుకోకపోతే జలుబు, తుమ్ములు, గొంతు నొప్పివంటి లక్షణాలు కనిపిస్తే  వెంటనే వైద్యునికి చూపించాలి. ముందుజాగ్రత్తగా పిల్లలకు, వృద్ధులకు చలిగాలి సోకకుండా  స్వెట్టర్‌, మంకీ క్యాప్ లు వాడాలి. చలికాలంలో ఆస్తమా  రోగులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.  శ్వాస నాళాలలో ఒత్తిడి ఏర్పడి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది.  కొంతమందికి ఎలర్జీ, దుమ్ము, పొగ కారణంగా శ్వాసనాళాలలో మెలికలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పొద్దున, రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. వేగంగా నడవలేరు. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. కఫం అధికంగా ఏర్పడుతుంది. దగ్గినపుడు కళ్ళె ఆకుపచ్చరంగులో పడుతుంది.  ఆకలి లేకపోవడంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఆ కారణంగా బలహీనంగా మారుతారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఆహారం తీసుకోవాలి. చలిగాలిలోనూ, మంచు కురిసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు.వేడి  తగ్గని ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. చలికాలంలో కూడా రోజుకు 6 నుండి 10 గ్లాసుల వరకూ పరిశుభ్రమైన కాచి చల్లార్చి, వడకట్టిన నీటిని తాగాలి. జలుబు, దగ్గు ఎక్కువగా వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.  పొగ, దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. సిగిరెటు, చుట్టా, బీడి తాగే అలవాటు ఉన్నవారికి దూరంగా ఉండాలి.

బరువు తగ్గాలంటే జామకాయ తింటే సరి!

రోజుకో యాపిల్ తింటే రోగాలన్నీ తగ్గిపోతాయని అంటారు. కానీ యాపిల్‌ సామాన్యులకి అందుబాటులో ఉండని పండు. పైగా డయాబెటిస్‌ ఉన్నవారు యాపిల్ ఎక్కువగా తినకూడదని చెబుతూ ఉంటారయ్యే! ఇక రోగాలు తగ్గే అవకాశం ఎక్కడిది. అందుకనే ఈ సామెతని మార్చి రోజుకో జామకాయ తినమని సూచిస్తున్నారు నిపుణులు...   బరువు తగ్గిస్తుంది – జామకాయలో పీచుపదార్థం అధికం. కానీ కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మాత్రం ఇంచుమించుగా కనిపించవు. శరీరానికి పోషణని అందించే ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం జామలో పుష్కలంగా కనిపిస్తాయి. ఓ మాటలో చెప్పాలంటే బరువుపెరగకుండా, శక్తిని అందించేందుకు రూపొందించిన మందులా జామకాయ కనిపిస్తుంది.   కఫానికి విరుగుడు – కాలుష్యం పుణ్యమా అని ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కానీ కఫాన్ని కరిగించేందుకు, ఊపిరితిత్తులలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకూ దోర జామకాయలు దివ్యంగా పనిచేస్తాయి. ఇందులో సమృద్ధిగా ఉండే సి విటమిన్ మళ్లీమళ్లీ జలుబు రాకుండా అడ్డుకొంటుంది.     రక్తపోటుకి అడ్డుకట్ట – శరీరంలో సోడియం శాతం పెరిగి పొటాషియం నిష్ఫత్తి తగ్గినప్పుడు, అది రక్తపోటుకి దారి తీస్తుంది. కానీ జామకాయతో ఈ నిష్ఫత్తి సాధారణ స్థితికి చేరుకుటుంది. వందగ్రాముల జామకాయలో కేవలం 2 mg సోడియం ఉంటే... పొటాషియం ఏకంగా 400 mg ఉంటుంది. ఇంకా మన ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్‌, LDL కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. వీటన్నింటి కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.   పళ్లని మెరిపిస్తుంది – జామకాయని తినగానే పళ్లు, చిగుళ్లు బలంగా నున్నగా అనిపిస్తాయి. జామకాయలో ఉండే ఆస్ట్రింజంట్‌ అనే పదార్థమే దీనికి కారణం. అంతేకాదు! జామలో వాపుని తగ్గించే లక్షణాలు, సూక్ష్మక్రిములను సంహరించే శక్తి కనిపిస్తుంది. అందుకనే జామకాయని తింటే పళ్ల దగ్గర నుంచీ పేగుల దాకా జీర్ణవ్యవస్థ అంతా బాగుపడిపోతుంది.     డయాబెటిస్‌ను అదుపుచేస్తుంది – జామకాయలో glycaemic index చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనర్థం... జామకాయని తిన్నాక, అందులోని శక్తి నిదానంగా విడుదల అవుతుందన్నమాట. పైగా ఇందులో చక్కెర పదార్థాలు కూడా తక్కువే! అందుకనే డయాబెటిస్‌ ఉన్నవారు నిక్షేపంగా జామకాయని తినవచ్చని చెబుతూ ఉంటారు. ఇక వంశపారంప్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో, ఆ మహమ్మారిని వీలైనంత దూరంగా ఉంచేందుకు కూడా జామ ఉపయోగపడతుందట. జామలో ఉండే ఫోలేట్ ధాతుపుష్టిని కలిగిస్తుంది; ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ కేన్సర్‌ దరిచేరకుండా చేస్తాయి; విటమిన్‌ ఏ కంటిచూపుని మెరుగుపరుస్తుంది... ఇలా చెప్పుకొంటూ పోతే అసలు ఈ జాబితాకి అంతమే ఉండదనిపిస్తుంది. మరింకేం... చిరుతిండి పేరుతో ఏది పడితే అది తినేసే బదులు ఓ నాలుగు జామకాయలని ఇంటికి తెచ్చుకుంటే పోలా!!!   - నిర్జర.

నువ్వులని మించిన ఔషధం ఉందా!

నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.   - మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.   - నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.   - నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.   - నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.   - నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.   ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు. మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. - నిర్జర.  

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే?

చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  

పండ్లు ఆ సమయంలోనే తినాలా?!

ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది అని అడగ్గానే ఫ్రూట్స్ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. నిజమే. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవు. అందుకే వీలైనన్ని ఫలాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఫ్రూట్స్ తీసుకోడానికి సరైన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో తింటే వాటిలోని పోషకాలన్నీ శరీరానికి సరిగ్గా అందుతాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.   సాధారణంగా చాలామంది టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం రాత్రి భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఆ సమయాల్లో కంటే ఉదయం పరగడుపునే పండ్లు తినడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మామూలుగానే పండ్లు త్వరగా అరిగిపోతాయి. పరగడుపునే అయితే ఆ అరుగుదల మరింత మెరుగ్గా ఉంటుంది. పైగా అప్పటికి ఏ ఇతర ఆహార పదార్థాలూ కడుపులోకి వెళ్లకపోవడం వల్ల ఫలాల పోషకాలు శరీరానికి అందండంలో ఎటువంటి అవరోధాలూ ఉండవట.   అయితే కడుపులో అల్సర్లు ఇతరత్రా సమస్యలు ఉన్నవారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తీసుకోకూడదట. ముఖ్యంగా అనాస, ద్రాక్ష, నిమ్మ, నారింజ, టొమాటో వంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కారణంగా గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి.. తద్వారా పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట.   మీకు అలాంటి సమస్యలేమీ లేవా? అయితే భయపడక్కర్లేదు. రోజూ ఉదయాన్నే పరగడుపున పండ్లు తినండి. వాటిలోని పోషకాలను పూర్తిగా పొందండి. - sameeranj

పెద్దవాళ్లు మీ మాటను ఎందుకు వినలేరు!

కొంతమంది పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు ఎందుకో మన మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అనిపిస్తుంది. ఇంకాస్త గట్టిగా మాట్లాడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగని వారికి ఏమన్నా చెముడు వచ్చిందా అంటే, పరీక్షలలో అంతా బాగానే ఉన్నట్లు తోస్తుంది. దాంతో సమస్య ఎక్కడ ఉందా అని అటు వినేవారూ, ఇటు వాగేవారు కూడా వాపోతుంటారు. ఇన్నాళ్లకి ఆ సమస్యకి తగిన సమాధానం దొరికింది.   కథలు వినిపించారు మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు 61-73 ఏళ్లలోపు ఉన్న కొందరు వ్యక్తులను ఎన్నుకొన్నారు. వీరికి ఒకేసారి మూడు కథలను వినిపించారు. వాటిలో కేవలం ఒక్క కథ మీదే తమ దృష్టిని నిలపమని ముందుగానే చెప్పారు. అలా దృష్టి పెట్టిన కథలోంచి కొన్ని ప్రశ్నలకు అడిగి చూశారు. ఫలితం! వారు ఎంతగా ప్రత్యేక దృష్టి సారించినా కూడా సదరు కథలోని చిన్న చిన్న వివరాలను సైతం వెల్లడించలేకపోయారు.   కార్టెక్సే కారణం మనుషి మిగతా జీవులలాగానే అన్ని శబ్దాలనూ వింటాడు. కానీ ఆ విన్న శబ్దాలను విశ్లేషించేందుకు అతని మెదడులోని ‘కార్టెక్స్‌’ అనే భాగం మరింతగా అభివృద్ధి చెంది ఉంటుంది. ముసలివారు అవుతున్న కొద్దీ ఈ కార్టెక్స్‌ సామర్థ్యం తగ్గిపోవడాన్ని గ్రహించారు పరిశోధకులు. ఫలానా కథ మీదే దృష్టి పెట్టమని అడిగినప్పుడు, పెద్దవారిలో కార్టెక్స్‌ సహకరించకపోవడాన్ని గమనించారు. ఇదే సమస్యని యువకుల ముందు ఉంచినప్పుడు, కార్టెక్స్‌ స్పందన ఖచ్చితంగా కనిపించింది.   వింటారు కానీ ఈ పరిశోధనతో పెద్దవారు మిగతావారిలాగానే వినగలిగినా, తాము విన్నదాన్ని ఠక్కున విశ్లేషించడంలో విఫలం అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా రెండుమూడు రకాల శబ్దాలు ఒకేసారి వినిపించినప్పుడు, వాటిలో ఏ శబ్దాన్ని ఎన్నుకోవాలి, ఆ శబ్దం ద్వారా ఏం గ్రహిస్తున్నాను అనే అయోమయంలోకి వారి మెదడు జారిపోతోందట. ఒకోసారి వారు ప్రశాంతమైన వాతావరణంలో వింటున్న శబ్దాలను సైతం గ్రహించలేకపోతుంటారని తేలింది.   నిదానంగా చెప్పాలి పెద్దవారితో ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు రణగొణధ్వనులు లేని సందర్భాన్ని ఎంచుకోవాలి. వారితో ఏదన్నా సంభాషణ చేసేటప్పుడు టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇతర మోతలు లేకుండా చూసుకోవాలి. అన్నింటికీ మించి గట్టిగా అరవడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకోవాలి. దాని బదులుగా మనం చెప్పదల్చుకున్న విషయాన్ని నిదానంగా, స్పష్టంగా తెలియచేయాలి. అప్పుడు వినిపించడం లేదన్న వేదన వారికీ ఉండదు, చెప్పలేకపోతున్నామన్న విసుగు మనకీ కలగదు.   - నిర్జర.

ఇంటర్నెట్‌తో మానసిక వ్యాధులు

ఒకప్పుడు ఇంటర్నెట్‌ అంటే అదో విలాసం. అందులో ఏమన్నా సమాచారం వెతకాలంటే ఎక్కడెక్కడికో వెళ్లి వందలకొద్దీ రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఆ సమాచారం కూడా నిక్కుతూ నీలుగుతూ నిదానంగా ‘లోడ్‌’ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇంటింటా ఇప్పుడు ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోంది. సాంకేతిక విప్లవం పుణ్యమా అని గంపల కొద్దీ సమాచారం సెకన్లలో కంప్యూటర్లో మెదుల్తోంది. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక సైట్ల విజృంభణా తక్కువేం లేదు. మరి కళ్ల ముందు ఇంత ప్రపంచం కనిపిస్తోంది కదా అని, కదలకుండా కూర్చునేవారి పరిస్థితి ఏంటి?   ఇంటర్నెట్‌ ఎడిక్షన్‌ టెస్ట్‌  ఇంటర్నెట్‌ మీద ఎక్కువసేపు గడిపేవారిలో ఇతరత్రా మానసిక వ్యాధులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అన్న సందేహం వచ్చింది, కొందరు కెనడా పరిశోధకులకి. సందేహం వచ్చిందే తడవు, ఓ 254 మందిని విద్యార్థులను ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొన్నవారిలో ఇంటర్నెట్ వాడకాన్ని పరిశీలించారు. ఈ 254 మందిలో ఓ 33 మందిలో ఇంటర్నెట్‌ పట్ల విపరీతమైన వ్యసనం ఉన్నట్లు తేలింది.   వ్యాధుల గంప ఇంటర్నెట్‌ వ్యసనం ఉన్న వారిలో రకరకాల మానసిక సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. విపరీతమైన క్రుంగుబాటు, ఉద్వేగం, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ను వాడేవారిలో ఈ కింది గణాంకాలను కూడా పరిశోధకులు నమోదు చేశారు. - ఒక 56 శాతం విద్యార్థులు వీడియోలకి సంబంధించిన సైట్లకి అతుక్కుపోతున్నారట. - 48 శాతం మంది విద్యార్థులైతే సోషల్‌ మీడియా సైట్లను వదిలి ఉండలేకపోతున్నారు. - విద్యార్థులలో 29 శాతం మంది ఇన్‌స్టంట్ మెసేజింగ్ సైట్లను పట్టుకుని వేళ్లాడుతున్నారు. మొత్తం మీద ఇంటర్నెట్‌ ఓ వ్యసనంగా ఉన్నవారిలో 42 శాతం మంది నానారకాల మానసిక ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు.   కొత్త కోణం ఇప్పటివరకూ మనస్తత్వ వైద్యలు తమ వద్దకు వచ్చే మానసిక రోగుల జీవితంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యతని అంతగా గమనించనేలేదు. కానీ ఇక మీదట ఇంటర్నెట్‌ వాడకాన్ని కూడా ఒక లక్షణంగా భావించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతేకాదు! ఇప్పుడు ఇంటర్నెట్ వ్యసనం అనేది రెండు రకాల ప్రమాదాన్ని మన ముందు ఉంచుతోంది. ఒకటి- ఏదన్నా మానసిక వ్యాధి ఉన్న వ్యక్తుల, ఆ వ్యాధి కారణంగా ఇంటర్నెట్‌కు మరింతగా వ్యసనపరులు కావడం; రెండు- తెలియకుండా ఇంటర్నెట్‌ మీద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారు, నిదానంగా ఏవో ఒక మానసిక ఇబ్బందులకు లోను కావడం. ఎలా చూసినా అవసరానికి మించిన ఇంటర్నెట్ వాడకం నష్టమేనని రుజువవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త!   - నిర్జర.  

పుదీనా..... సేద తీర్చేనా

ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.   నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి

భారతీయుల వంటల్లో ఇంగువ ఎందుకు?

అసెఫీటిడా అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే ఇంగువని విడిగా తినడం కష్టమే. కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇంగువ లేకుండా పని జరగదు. వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన రుచిని సాధిస్తుంటారు. మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో... - చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్‌ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి. - కేవలం కడుపు ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం, ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది. - అటు ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఫిట్స్‌ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు ఇంగువను వాడుతుంటారు. - ఆడవారిలో రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు. రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు. - ఇంగువ ఇటు పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గలకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తీవ్ర పడిశాన్ని (Influenza) కలిగించే H1N1 అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది. - ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా షుగర్‌ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని చెబుతున్నారు. - ఇంగువలో coumarin అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. రక్తంలో కొలెస్టరాల్‌ పేరుకోకుండా నివారించవచ్చు. - ఇంగువకి ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది హరిస్తుంది. చెప్పుకొంటూ పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది. - నిర్జర.

One-day Detox Therapy

  Feeling tired and irritated ?Are you prone to frequent allergies and infections? Having menstrual or digestive problems? Going through a feeling of disorientation and mental fatigue? In all probabilities your body could be saying I am tired and I need a break! As we get caught up with our daily house-work-family routine we just go off track with our health and when the toxins in our body get accumulated and its time to flush it out and feed it healthy nutrients. All you need is a good Detox to get you back on track and feel energetic again. Detoxification  involves clearing impurities from the blood boosting the liver function and thereby eliminating impurities from the blood. It is necessary to detox once a year like we do in our religious rituals and customs. This has been the ancient practice recommended by Ayurveda also as a good system cleansing practice to be followed by adults. Note: Pregnant and feeding mothers, children below 12 and people suffering with terminal and chronic diseases should not do it. Try this One-Day Veg &Fruit detoxification program Choose one day in  a week other than the weekend to detox. Step 1-Pick any of your favourite fruits and vegetables. Keep some whole fruits like apple, kiwi, pears and the seasonal ones available at that time to eat as it as and choose the high water content ones like melons pineapples , oranges and musk melons  for making into juices.Do not mix sugar or use any of those sugar free pellets. If the you think the juices are thick you could dilute them with water. Step 2- Pick you favourite veggies like carrots, cucumber, beetroot and tomatoes-these can be made into juices and you could keep some long with radishes and capsicum and  celery for salads. You could also look at adding some raisins and nuts and for the burst of freshness. Try combining some fruits and vegetables if you like. Avoid too much of dressing with oils or mayo- may be  some lemon juice with salt and pepper or a spoon of honey for improving the taste should do. Step-3- Green tea or herbal tea bags and hot water for the in between drinking .Since the juices are cold the herbal tea would be used as a warm drink to keep you active. Green tea is wonderful detoxifying- agent and can be had regularly. Step Detox -Now that you have your juices and cut fruit and vegetables ready .You can start the Detox session. You can start with a juice first and alternate that way with a juice and bowl of cut fruit or salad. Drink and eat as much as you want so you do not get hungry. Tea in Between: The herbal or green teas are for drinking in-between and for the evenings. But remember just 2 hours before you go to bed stop the juices and sip only herbal tea. Drinking juices which have sugar in them may stop you from falling asleep in the night. And your dose of H2O should also be had in between to clean your system. Drink at least 2 litres of water throughout the day if you can and complete your detox program. Try this for one day and feel the benefits of this internal cleansing regime!

రక్తపోటు ఓ రాక్షసుడు!

ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత స్థాయిలో మన దగ్గర యువత సంఖ్య ఉంది. కానీ ఏం లాభం! ఇప్పటి యువత కాస్తా వృద్ధులకంటే నిస్సత్తువతో నిండిపోతున్నారు. రక్తపోటుతో కుంగిపోతున్నారు. దీని గురించి మనం మనం చెప్పుకోవడం కాదు... ‘హైపర్‌ టెన్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు ఎ.మురుగనాధన్‌ చేస్తున్న హెచ్చరికల సారాంశమే ఇది. మురుగనాధన్‌ వంటి నిపుణులు చెబుతున్న కొన్ని గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది.   - దేశంతోని 20 యువత రక్తపోటుతో బాధపడుతున్నట్లు ఓ అంచనా! - రక్తపోటు వల్ల 30 ఏళ్ల లోపువారే అనారోగ్యానికి గురవ్వడం, 40 ఏళ్లలోపే చావుకి చేరువ కావడం జరుగుతోంది. - రక్తపోటు, దాంతో పాటు వచ్చే అనారోగ్యాల వల్ల భారతీయ యువత జీవితకాలం దాదాపు 5 శాతం తగ్గిపోతోంది. - మన దేశంలో రక్తపోటు దాదాపు పదిలక్షలకు పైగా చావులకు కారణం అవుతోంది. పైన పేర్కొన్న గణాంకాలని చూసి గుండెలు బాదుకోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటికి కారణాలు కూడా అంతే బలీయంగా ఉన్నాయి. - ప్రతిరోజూ ఒత్తిడితో రోజుని మొదలుపెట్టక తప్పని పోటీతత్వం. - ఆ పోటీల్లో నెగ్గుకు వచ్చేందుకు, లక్ష్యాలను ఛేదించేందుకు... చదువు, ఉద్యోగాలలో ఏర్పడుతున్న ఒత్తిడి. - ఆ ఉద్యోగాలలో కూడా ఏసీ గదుల్లో, కదలకుండా, మెదలకుండా గంటల తరబడి కూర్చోవలసి రావడం. - నిరంతరం కూర్చునే ఉంటున్నామని తెలిసినా కూడా శరీరంలో పేరుకుపోయే కొవ్వుని కరిగించే వ్యాయామం చేయకపోవడం. - తినే తిండి, పీల్చే గాలి, చేసే ఆలోచనల్లో స్వచ్ఛత లేకపోవడంతో జీవితమంతా కాలుష్యంతో నిండిపోవడం. - చిరుతిళ్లు... అందులోనూ మన సంప్రదాయబద్ధమైన తిళ్లు కాకుండా చైనీయులవీ, పాశ్చాత్యులవీ తినడం. - ఊబకాయం, గుండె మంట, అజీర్ణం... వంటి సమస్యలు వచ్చినా కూడా తగిన సమయంలో వైద్యులని సంప్రదించడం కానీ, జీవనశైలిని మార్చుకోవడం కానీ చేయకపోవడం. - ఒకవేళ రక్తపోటు ఉందని తెలిసినా కూడా ఎవరికి వారే సోంతవైద్యాలు చేసుకోవడం. - ఉప్పు అధికంగా ఉండే బేకరీ పదార్థాలు, పచ్చళ్లు; తీపి ఎక్కువగా ఉండే పేస్త్రీలు, కూల్‌డ్రింకులు తీసుకోవడం ... చెప్పుకుంటూ పోవాలే కానీ మన జీవనశైలిలో వేస్తున్న తప్పటడుగులు అన్నీ రక్తపోటుకు దారితీసేవే! అందుకనే చేతులు కాలకముందే మేల్కొని జీవనశైలిని మర్చుకుంటే రక్తపోటు అనేదే మన దరిచేరకుండా చూసుకోవచ్చు. ధ్యానం, వ్యాయామం, మితాహారం, మితభాషణం... ఇవన్నీ ఏవో పెద్దలు చెప్పిన సూక్తులు కావు. రక్తపోటు వంటి రాక్షసుల బారినుండి నిండునూరేళ్లు మనల్ని కాపాడే దీప్తులు.   - నిర్జర.

బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుంటే గుండెపోటే!

బ్రేక్‌ఫాస్ట్‌ అన్న మాటలోనే ఉపవాసాన్ని విరమించడం అన్న అర్థం ధ్వనిస్తుంది. కానీ చాలామంది ఉదయాన్నే ఖాళీకడుపుతోనే పనిలోకి దూకేస్తుంటారు. ఇదేమంత ఆరోగ్యకరమైన అలవాటు కాదంటూ, ఒకదాని తరువాత ఒకటిగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.   కొందరు దూరం తీరిక లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సన్నబడతామనే అపోహతో కావచ్చు... ఉదయపు అల్పాహారాన్ని ముట్టుకోనివారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఖాళీ కడుపుతో రోజుని మొదలుపెట్టకూడదని పెద్దలు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టేవారు నానాటికీ ఎక్కువవుతున్నారు. ఇలా ఉదయపు అల్పాహారానికి దూరంగా ఉండటం వల్ల రక్తపోటు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనీ.... అసలుకే మోసం వస్తుందనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు! బ్రేక్‌ఫాస్టుని పట్టించుకోకుంటే ఏకంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటూ ఒక పరిశోధన సైతం నిరూపిస్తోంది.   హార్వర్డు పరిశోధన బ్రేక్‌ఫాస్టుకీ గుండెపోటుకి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు హార్వర్డు విశ్వవిద్యాలయం తరఫున ఓ భారీ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం పది కాదు వంద కాదు, దాదాపు 27,000 మందిని పరిశీలించారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 16 ఏళ్ల పాటు వీరి ఆహారపు అలవాట్లను గమనించారు. వీరిలో 13 శాతం మంది తమకి ఉదయపు అల్పాహారం తీసుకునే అలవాటు లేదని తేల్చిచెప్పారు. ఆశ్చర్యకరంగా ఇలా అల్పాహారం తీసుకోవడం అలవాటు లేనివారిలోనే గుండెపోటు సమస్య ఎక్కువగా తలెత్తడాన్ని గమనించారు పరిశోధకులు. ఇక అల్పాహారం తీసుకోనివారిలో ధూమపానం, మద్యపానం, చిరుతిళ్లు తినడం, ఊబకాయం, రక్తపాటు వంటి లక్షణాలు కూడా ఉంటే... వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 27 శాతం అధికమని తేలింది.   కారణం! ఉదయం వేళ అల్పాహారాన్ని తీసుకోకపోవడానికీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో పరిశోధకులు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని వివరణలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు.   - ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఉండేవారిలో మధ్యాహ్నానికల్లా విపరీతంగా ఆకలి వేసే అవకాశం ఉంది. దాంతో అవసరమైనదానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.   - మధ్యాహ్నం వరకూ ఖాళీగా ఉన్న శరీరంలోకి ఆకస్మాత్తుగా ఆహారం రావడంతో, రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, రక్తనాళాలలో కొవ్వు పేరుకోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కలుగుతుంది.   - ఉదయం వేళ నిర్ణీత సమయంలో అల్పాహారాన్ని తీసుకునేవారిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనిపించింది. వీరు ఒక క్రమశిక్షణతో, తగిన ఆహారపు అలవాట్లతో ఉంటారు కాబట్టి సహజంగానే గుండెపోటు వీరి దరిచేరదు. - నిర్జర.

గుండె జబ్బుల సమస్యలపై అవగాహన

  చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరము. నివారణ : వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి. పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే. అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.     కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి. మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి. పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.   జాగ్రత్తలు : నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి. వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది. మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి

ఆక్రోటు తింటే మూడ్‌ బాగుంటుంది

ఆక్రోటు పప్పు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఇంత ఆక్రోటు పప్పు నోట్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఆక్రోటు తినడం వల్ల సంతోషంగా ఉంటారన్న విషయం కూడా ఇప్పుడు రుజువైపోయింది.   పీటర్ ప్రిబిస్‌ అనే ఓ పరిశోధకుడు రొజూ ఆక్రోటు పప్పు తినడం వల్ల మనసు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయన ఓ 64 మంది విద్యార్థుల మీద ఒక పరీక్షను నిర్వహించాడు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు ఉన్న ఈ విద్యార్థులంతా ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వీరిని పదహారు వారాల పాటు రొజూ ఓ మూడు బ్రెడ్‌ ముక్కలు తినమని చెప్పారు. ఇందులో ఓ ఎనిమిది వారాల పాటు మామూలు బ్రెడ్‌ను తినమనీ, మరో ఎనిమిది వారాలపాటు ఆక్రోటు పొడి కలిపిన బ్రెడ్‌ ముక్కలు తీసుకోమనీ చెప్పారు.   సాధారణంగా విద్యార్థి దశలో ఉండేవారు చాలా ఉద్విగ్నతగా ఉంటారు. సవాలక్ష సమస్యలతో చిరాకుపడుతూ ఉంటారు. వారి మనసుని కనుక ప్రశాంతంగా ఉంచగలిగితే ఆక్రోటు విజయం సాధించినట్లే! అందుకనే Profiles of Mood States (POMS) అనే పరీక్ష ద్వారా వారి మూడ్‌ ఎలా ఉందో గమనించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఈ పరీక్షతో ఒక వ్యక్తిలోని ఉద్విగ్నత, క్రుంగుబాటు, కోపం, నిస్సత్తువు వంటి లక్షణాలను గమనించడం ద్వారా కొన్ని మార్కులు వేస్తారు. ఈ మార్కుల మొత్తాన్నీ Total Mood Disturbance score (TMD) అంటారు. ఈ TMD ఎంత తక్కువగా ఉంటే మన మూడ్ అంత బాగున్నట్లు లెక్కట!   ఆక్రోటు పొడి కలిపి ఉన్న బ్రెడ్‌ను తిన్న విద్యార్థులలో TMD విలువలు చాలా తక్కువగా నమోదు కావడాన్ని గమనించారు పరిశోధకులు. మిగతావారితో పోలిస్తే వీరి మూడ్ దాదాపు 30 శాతం సానుకూలంగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ మార్పు కేవలం మగవారిలోనే కనిపించడం విశేషం. ‘గతంలో ఆక్రోటు తినడం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయనీ, డయాబెటిస్ అదుపులో ఉంటుందనీ, ఊబకాయం మీద కూడా ప్రభావం ఉంటుందనీ తేలింది. అందుకనే ఈసారి వారి మనసు మీద ఆక్రోటు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేశాము,’ అంటున్నారు పీటర్.   ఆక్రోటులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల.... అవి క్యాన్సర్‌ దగ్గర్నుంచీ చర్మవ్యాధుల వరకూ మన శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. అయితే అందులో ఉండే విటమిన్‌ ఇ, ఫోలేట్ యాసిడ్, మెలటోనిన్, ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్ అనే రసాయనాల వల్ల మన మూడ్‌ కూడా మెరుగుపడుతుందని తాజా పరిశోధనతో తేలిపోయింది. మరింకేం! నిరంతరం ఏవో ఒక చిరాకులతో సతమతం అవుతూ ఉండేవారు, రోజుకో రెండు ఆక్రోటు పప్పులు నములుతూ ఉంటే సరి!   - నిర్జర.