జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం
posted on May 13, 2014 9:00AM
మునిసిపల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసే ప్రక్రియ ప్రారంభమైంది. అది పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 441 జడ్పీటీసీ, 6,480 ఎంపీటీసీ స్థానాలకు, సీమాంధ్రలో 1,093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టారు. పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా జరిగే అవకాశం వుంది. ఈరోజు రాత్రి వరకూ కౌంటింగ్ జరుగుతుంది.