నేడే పరిషత్ ఫలితాలు
posted on May 13, 2014 6:33AM
గ్రామీణ ఓటరు నాడిని పట్టిచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. గతనెల 6,7 తేదీలలో నిర్వహించిన ఈ ఎన్నికలలో 1,096 జడ్పీటీసీ స్థానాలకు 5,0 34 మంది, 16, 589 ఎంపీటీసీ స్థానాలకు 53, 345 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఈరోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్లతో నిర్వహించినందున లెక్కింపులో జాప్యం అనివార్యమవుతుంది గనుక ఫలితాలు వెలువడేందుకు కూడా సమయం పట్టవచ్చును. బహుశః మధ్యాహ్నం నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో కూడా నిన్నటిలాగే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి, సీమాంద్రాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లయితే, ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలదే విజయం అని భావించవచ్చును. తెరాస, వైకాపాలకు గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టు ఉందనే అభిప్రాయం నిజమో కాదో నేటి ఫలితాలాలో తేలిపోతుంది.