ఏపీలో కలకలం.. వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా!!
posted on Jun 22, 2020 @ 8:37PM
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా.. తాజాగా ఏపీలో కూడా ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చారు. యూఎస్ నుంచి రావడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఎమ్మెల్యే.. పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఏపీ లో ఒక ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే గన్ మెన్ కి కూడా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సమాచారం.