Read more!

చంద్రబాబు సభలకి వెళ్తే చంపేస్తారా?

ఈ వైసీపీ పిశాచాలు ఎంతకి తెగించాయంటే, చంద్రబాబు సభలకి వెళ్తున్న వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలను ఇంతవరకు ఏ దేశ రాజకీయల్లోనూ కనీవినీ ఎరుగం. నమ్మశక్యం అనిపించకపోయినప్పటికి ఇది నిజం. 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరు పంచాయితీ, వెంకటేశ్వర పాలేనికి చెందిన పామంజి శ్రీరాములు అనే వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త. నెల్లూరు జిల్లాలో ఎక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమం జరిగినా తప్పకుండా హాజరవుతాడు. శనివారం నాడు పొదలకూరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పామంచి శ్రీరాములు తన స్నేహితులతో కలసి వెళ్ళాడు. సభ ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకున్న శ్రీరాములు మీద స్థానిక వైసీపీ కార్యకర్త ఈశ్వరయ్య మరో నలుగురితో కలసి దాడి చేశాడు. కత్తులతో దాడి చేయడంతో శ్రీరాములు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభలుగానీ, కూటమిలో భాగస్వాములుగా వున్న జనసేన, బీజేపీ నాయకుల సభలు గానీ భారీ స్థాయిలో విజయవంతం అవుతున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ అక్కసు కూడా ఇలాంటి హత్యాయాత్నాలు చేయడానికి కారణాలుగా మారుతున్నాయి.