అప్పుల బాధతో... సొంత ఇంట్లోనే దోపిడీ

 

విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ లో ధర్మాల  ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల క్రితం దోపిడీ జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంట్లో అతని తల్లి కొడుకు కృష్ణ కాంత్ మాత్రం ఉన్నారు అర్ధరాత్రి నిద్రపోతున్న దశలో ఇంటి వెనకనుంచి తలుపులు పగలగొట్టి నాన్నమ్మ మనవడు చేతులకు తాళ్లు కట్టి ముఖానికి ప్లాస్టర్ వేసి ఇంట్లో 12 తులాల బంగారం రెండున్నర లక్షల నగదును దోపిడీ చేశారు. ఆ అగంతకులు హిందీలో మాట్లాడారు దోపిడీ అనంతరం ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలోనే పరారయ్యారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తొలిత భావించారు.

.. విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు 
..
 కాంట్రాక్టర్ ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ విచారణలో విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమ్మలేని నిజాలను చూడాల్సి వచ్చింది. దోపిడి అనంతరం పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు ఇంటి ఆవరణలో నిందితులు ఎత్తుకుపోయిన వాహనం నగర శివారులోని మధురవాడ వద్ద కనిపించింది. అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో ఆనంద్ కుమార్ రెడ్డి తనయుడు కృష్ణ కాంత్ దినచర్యను ఆరా తీశారు. దోపిడీ జరిగిన అర్ధరాత్రి అతను కొందరుతూ ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ జరిగింది. 

ఆ మేరకు విచారణ చేపట్టుగా వారంతా కృష్ణ కాంత్ స్నేహితులు గా తేలింది. పరపతి ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యనారాయణ అనే ఈ ముగ్గురు దోపిడీ జరిగిన కృష్ణ కాంత్ స్నేహితులు వీరంతా విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో  సెల్ టవర్ల ద్వారా నిందితుల కదలికను వెంటాడారు. దోపిడీ జరిగిన రోజు వీరు కంచరపాలెం లో ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆపై ఆ యువకులను పోలీసులు విచరించగా ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కృష్ణ కాంత్ ఇటీవల కాలంలో ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుల పాలయ్యాడు. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లోనే దొంగతనం చేయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకోసం ముగ్గురు స్నేహితులను సిద్ధం చేశారు. 

ఇంట్లో తన తండ్రి లేని సమయంలో నాన్నమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులకు తాళ్లను కట్టి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేయాలని అనంతరం పంచుకుందామని కృష్ణ గాని చెప్పాడు. నెల రోజులుగా చేస్తున్న ఆ ప్రయత్నం ఒకరోజు ఫలించింది కానీ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నలుగురు నిందితులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.... విలాసవంతమైన జీవితం గడపాలని యువత ఆలోచన చేయడంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత  బాచ్చి  తెలిపారు. అయితే నేరం చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కడం ఖాయమని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకు హితవు పలికారు

అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన

వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మదురో అరెస్టు వ్యవహారం వెనుక డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన కారణాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఆయనను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచింది. అయితే మదురో తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ,  దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.  అమెరికా అక్రమంగా తనను పదవి నుంచి తొలగించినా, తానే ఇప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడినని ఆయన ఉద్ఘాటించారు.   మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా కోర్టులో హాజరు పరిచారు. ఆమె కూడా  తాను వెనిజులా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని స్పష్టం చేశారు. అమెరికా మదురోపై  నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు   కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో వాదించారు.  ఇలా ఉండగా మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీనిని పేర్కొన్నారు.    అదలా ఉంటే.. వెనిజువేలా అరెస్టు తరువాత ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా అక్కడి   అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి.  మదురోను అమె రికా బందీగా పట్టుకుని తరలించిన తరువాత ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.  వెనిజువెలాలో సక్రమంగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని పేర్కొన్నారు. కాగా వెనిజువేలాలో పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందించింది.  వెనిజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.  

యుద్ధం అసాధ్యం.. అందుకే లొంగుబాటు!

సాయుధ పోరాటం అసాధ్యమని మావోయిస్టు అగ్రనేత బట్సే దేవా అలియాస్ సుక్కు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల లొంగిపోయన సుక్క.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమైన తరువాత ఆయన స్కథానంలో మావోయిస్టు పార్టీ ఆయుధ దళాధిపతిగా నియమితుడయ్యాడు. బట్సే దేవా అలియాస్ సుక్క తనతో పాటు 19 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి 40 అధునాతన ఆయుధాలతో  ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే.   మావోయిస్టు కేంద్ర కమిటీలో అంతర్గతంగా ఏం జరిగిందన్నది తనకు అంత స్పష్టంగా తెలియదన్న సుక్మ,  మల్లోజుల లొంగుబాటు తరువాత పార్టీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు.  సాయుధ పోరాటం వీడాలన్న చర్చ పార్టీలో జరిగిందా అన్న సందేహాలు కూడా తలెత్తాయనీ,  అయితే కొన్ని రోజుల తర్వాత పరిస్థితిపై స్పష్టత వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  బట్సె దేవా అలియాస్ సుక్క వెల్లడించారు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాతనే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో లొంగిపోయినట్లు వివరించారు.   తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాడుల సమయంలోనే దొరికినవేనని, ఆయుధాల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీ కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునేవారమని చెప్పిన సుక్మ..  హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధాలను కూడా తయారు చేశామన్నారు.  మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ  కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు. హెడ్మా మరణం తర్వాత పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందనీ, హెడ్మా ఎన్ కౌంటర్ కు ముందే పార్టీ తనను  పీఎల్‌జీఏ కమాండర్‌గా నియమించిందనీ, హెడ్మా ఉన్న సమయంలోనే తానా బాధ్యతలు నిర్వహించానని దేవా వెల్లడించారు. ఒకప్పుడు 400 మంది వరకు ఉన్న పీఎల్‌జీఏ కమాండర్లు ఇప్పుడు  60 మందికే పరిమితమయ్యారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లొంగిపోయిన తరువాత  పునరావాసం కల్పించారని, భవిష్యత్ లో ఎటు వెళ్లాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేవా చెప్పారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ఎవరు పనిచేస్తున్నారన్న విషయమూ తనకు తెలియదని దేవా చెప్పారు.   బసవరాజు స్థానంలో దేవిజీ నియమితుడయ్యారన్న సమాచారమూ తనకు అందలేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు వెల్లడించలేనన్న సుక్మా మాట లతో మావోయిస్టు ఉద్యమం ప్రస్తుత స్థితిని, అంతర్గత బలహీనతలు స్పష్టంగా వెల్లడయ్యాయని రాజ కీయ, భద్రతాదళాలు భావి స్తున్నాయి. 

వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వైఫల్యమే కారణం

సిద్దిపేట మెడికల్ కాలేజీ  విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్  లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే  కులాలు వేరు అన్న కారణంతో   ప్రణయ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన లావణ్య మనస్తాపంతో  ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వైద్య విద్యార్థిని కావడంతో పాయిజెనెస్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.  లావణ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు  సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సులో సినిమాకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు

  ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అందరూ కలిసి బస్సులో ప్రయాణించి ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకుని సినిమాను వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ‘పూలే’ సినిమాను హిందీ భాషలో తెరకెక్కించగా 2025 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు.  జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమా నిర్మితమైంది. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలన కోసం పూలే చేసిన పోరాటం, మహిళల హక్కుల కోసం ఆయన సాగించిన ఉద్యమాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టుగా తెరపై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు పూలే సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశం అందించే చిత్రమని తెలిపారు. ఆ నాడు కుల వివక్షను తట్టుకుని సమ సమాజం కోసం వేసిన పునాదుల ఫలితాలను ఈరోజు అనుభవిస్తున్నామని తెలిపారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు

టెంపో డ్రైవ‌ర్ టు...శంఖ్ ఎయిర్ ఓన‌ర్ వ‌ర‌కూ

  ఇటీవ‌ల కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్ర‌వ‌ణ్ కుమార్. దీంతో ఈయ‌న దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నారు. ఒక టెంపో డ్రైవ‌ర్ స్థాయి నుంచి విమాన‌యాన సంస్థ ఓన‌ర్ వర‌కూ ఎలా ఎదిగాడ‌న్న‌దే ఇప్పుడు అంద‌రి ముందున్న ప్ర‌శ్న‌. మ‌ధ్య త‌ర‌గ‌తి విమాన యాన క‌ల‌ను ఎలాగైనా స‌రే సాకారం చేయాల‌న్న దృక్ప‌థంతో శ్ర‌వ‌ణ్ ఈ రంగంలో అడుగు పెట్టిన‌ట్టు చెబుతున్నారు. యూపీ నుంచి వ‌స్తోన్న తొలి విమాన‌యాన సంస్థ‌ను ప్రారంభించారు. శ్ర‌వ‌ణ్ తొలుత సిమెంట్, స్టీల్, ర‌వాణా రంగాల్లో వ్యాపారాలు చేశారు. 2026లో దేశీయ విమాన సేవ‌లు ప్రారంభించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు శ్ర‌వ‌ణ్. శ్ర‌వ‌ణ్ విశ్వ‌క‌ర్మ నేప‌థ్యం ఏంటో చూస్తే సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చారు. చిన్న‌త‌నంలోనే చ‌దువుకు విరామం ప్ర‌క‌టించి టెంపో న‌డ‌ప‌టం స్టార్ట్ చేశారు. తొలుత లోడ‌ర్ గా త‌న కెరీర్ మొద‌లు పెట్టారు శ్ర‌వ‌ణ్. ఆ త‌ర్వాత అంచ‌లంచెలుగా ఎదిగి  ర‌వాణా నుంచి స్టీల్ కి ఆపై సిమెంట్, మైనింగ్ రంగాల్లో విజ‌య‌వంత‌మైన  వ్యాపార నిర్వ‌హ‌ణ  చేశారు. శ్ర‌వ‌ణ్ చిన్న‌ప్ప‌టి క‌ల విమాన‌యానం. దీంతో ఈ రంగంలో అడుగు పెట్టి శంఖ్ ఎయిర్ ప్రారంభించారు. దీని ప్ర‌ధాన  ల‌క్ష్యం.. మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలాంటి ధ‌ర‌లు. సామాన్యులు కూడా ఎంతో సాదా సీదాగా విమాన‌యానం చేసేయ్య‌డ‌మే శ్ర‌వ‌ణ్ త‌న ముందు పెట్టుకున్న టార్గెట్. తొలిగా మూడు ఎయిర్ బ‌స్సుల‌తో శ్ర‌వ‌ణ్ త‌న శంఖ్ ఎయిర్ ని  ప్రారంభించారు. లక్నో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కనెక్ట్ చేయడం, పండుగల సమయంలో కూడా ధరలు పెరగకుండా చూసుకోవడం. త‌న ప్ర‌యారిటీస్ గా పెట్టుకుందీ సంస్థ‌.   ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి విమాన యాన సంస్థ‌లు ఎన్నో పుట‌కు రావ‌ల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంది.. కార‌ణం మొన్న‌టి ఇండిగో వ్యవ‌హారం చూస్తూనే ఉన్నాం. ఈ సంస్థ గుత్తాధిప‌త్యం కార‌ణంగా దేశ‌మే స్తంభించి పోయిన ప‌రిస్థితి  క‌నిపిస్తోంది. కాబ‌ట్టి.. యువ కేంద్ర మంత్రి తెలుగు తేజ‌మైన రామ్మోహ‌న నాయుడి అధ్వ‌ర్యంలో శ్ర‌వ‌ణ్ లాంటి మ‌రి కొంద‌రు ఈ రంగంలోకి రావాల‌ని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు శంఖ్ ఎయిర్- శ్ర‌వ‌ణ్  అంటూ ఆల్ ఓవ‌ర్ ఇండియా కూడా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతోన్న విధం క‌నిపిస్తోంది.

మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

  మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి... ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.  ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.  

సాహితీ స్కామ్ రూ.3000 కోట్ల తేల్చిన సీసీఎస్

  హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాహితీ స్కాంపై సీసీఎస్  పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ స్కాంలో మొత్తం రూ.3000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ కంపెనీ ఎండి సాహితీ లక్ష్మీనారాయణ ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను ఆకర్షించి, అతి తక్కువ ధరలకు ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సాహితీ లక్ష్మీనారాయణను పోలీసులు గుర్తించారు. ఈ సాహితీ స్కాం పై మొత్తం 13 మంది నిందితు లపై అభియోగాలు నమోదు చేశారు. సాహితీ స్కాంలో ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఈ 64 కేసులపై సీసీఎస్ ప్రత్యేక బృందం విచారణ కొనసా గిస్తోంది. ఈ స్కాంలో భాగం గా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అత్యధికంగా మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.  ఈ ప్రాజెక్ట్ పేరుతోనే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. శర్వాణి ఎలైట్‌కు సంబం ధించిన 17 కేసులు నమోదు కాగా, ఈ 17 కేసులపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించ కుండా, సాహితీ లక్ష్మీనారా యణ తన సొంత ప్రయోజ నాలకు వినియోగించినట్లు సీసీఎస్ విచారణలో వెల్లడైంది. ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ప్రజలను నమ్మించి మోసం చేసిన విధానం పైగా పలు ఆరోపణలు ఉన్నాయి.సాహితీ స్కాంలో ఇంకా పలు కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని సీసీఎస్ అధికారులు తెలిపారు. మిగిలిన కేసులపై దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశముందని పేర్కొన్నారు.  

తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే... తెలుగు జాతికి పురోగతి : సీఎం చంద్రబాబు

  తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం తన లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలుగు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి మాతృభాషగా ఉందని, టెక్నాలజీ సహాయంతో భాషను మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఎన్టీఆర్‌ నుంచి ఆధునిక కవులు వరకు తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులను స్మరించుకున్నారు. తెలుగు భాషే మన అస్తిత్వం, ఐక్యతే మన బలం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు... ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు.  తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ... జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు  చేసిన సేవను మరిచిపోలేం.  సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం.  ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస - యాస, మన సంధులు - సమాసాలు, మన సామెతలు – పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు.  నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఆనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.  

సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి...బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

  శాసన సభలో కృష్ణా జలాల పై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారని  అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు కాపీ అందజేశారు. ఇటీవల అసెంబ్లీలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి  పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు.  అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్ పై సీఎం తప్పుదోవ పట్టించారని, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‍ సూచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కే .పీ వివేకానంద ,కోవాలక్ష్మి ,విజయుడు ,అనిల్ జాదవ్ శాసన సభ కార్యదర్శికి నోటీసులు అందజేశారు  

చైనా మాంజా విక్రయించినా...నిల్వ ఉంచినా కఠిన చర్యలు : సీపీ

  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా గాలిపటాల పండుగ ఉత్సాహం వెల్లివిరుస్తున్న వేళ, ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగం, నిల్వపై ఎలాంటి ఉపేక్ష ఉండదని నగర పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పక్షుల ప్రాణాలకు, అమాయక వాహనదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్న ప్రమాదకరమైన ఈ మాంజాను పూర్తిగా అరికట్టేందుకు నగర పోలీసు యంత్రాంగం సమాయత్త మైందని సీపీ వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కచైనీస్ మాంజా నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని జోన్లలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తం గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములు, గుట్టుగా నిల్వ చేసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే వెంటనే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయను న్నట్లు పేర్కొన్నారు.అంతే కాకుండా నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చైనీస్ మాంజా రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసుల పైనా కూడా నిఘా పెంచి నట్లు సీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఏజెన్సీ యజమానుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చైనీస్ మాంజా కేవలం మానవ ప్రాణాలకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోం దని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాంజా మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతూ భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకులు, మెటాలిక్ పదార్థాల పూత ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడం, పిల్లల వేళ్లు కోసుకుపోవడం వంటి దుర్ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు మెటాలిక్ మాంజా కారణంగా విద్యుత్ షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.  తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారా లతో చేసిన మాంజానే ఇచ్చి, సురక్షితంగా గాలిపటాలు ఎగురవేయాలని కోరారు.నగర పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిషేధిత చైనీస్ మాంజాను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచు తామని సీపీ స్పష్టం చేశారు.