ఈ వినాయక చవితికి బొజ్జగణపయ్య బుజ్జి విగ్రహాలు

హైదరాబాద్ లో పెద్దఎత్తున ఉగ్రవాదుల ఆనవాళ్లు బైటపడుతున్నాయ్. ఇంటెలిజెన్స్ చాకచక్యం కారణంగా చాలామంది కొత్త ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా మారు వేషాల్లో తిరుగుతున్నారో అన్న భయం అందరికీ పట్టుకుంది. ఈ వినాయక చవితికి ఉగ్రవాదులు ఎలాంటి విధ్వంసరచనకు స్కెచ్చేస్తున్నారో అన్న భయం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఉగ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉన్నందుకు వీలైనంతవరకూ చిన్న చిన్న విగ్రహాల్ని ఏర్పాటుచేసుకోవడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు. చిన్న విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజించడంవల్ల చుట్టుపక్కల ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు కొత్తవాళ్లో, ఎవరు విద్రోహులో, ఎవరు స్థానికులో తెలుసుకోవడానికి, అప్రమత్తంగా ఉండడానికి వీలౌతుందని పోలీసులు అంటున్నారు. చిన్న విగ్రహాల్ని నిమజ్జనానికి తరలించడంకూడా చాలా తేలికౌతుంది కనుక ఉగ్రవాదులకు విధ్యంసం సృష్టించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నెట్టుకు రావొచ్చని ప్రచారం చేస్తున్నారు.

 

సాధారణంగా గణేష్ మండపాల్లో హడావుడంతా కుర్రాళ్లదే ఉంటుంది. విగ్రహాన్ని తీసుకురావడం దగ్గర్నుంచి, మంటపాల్ని ముస్తాబు చేయడం, రాత్రివేళల్లో కాపలా పడుకోవడందాకా అంతా కాలనీల్లో కుర్రాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. చాలా పెద్దఎత్తున ఉగ్రవాదులు ఆనవాళ్లు బట్టబయలుకావడంతో ఈ సారి పిల్లల బాగోగులపై తల్లిదండ్రులుకూడా కలవరపడుతున్నారు.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.