ఆ ఊళ్ళు ఏమైపోయాయి... అసలు ఏం జరుగుతోంది...

ఎన్నొ కనిపించకుండా పోతుంటాయి కానీ అక్కడ మాత్రం ఏకంగా గ్రామాలే మాయమైతున్నాయి.వివారాళ్లోకి వెళ్తే  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సర్దార్ పురం, గోనెగండ్ల గ్రామంలోని బాపురావు, పత్తికొండ మండలంలోని దేవమ్మకుంట, రుద్రవరం మండలంలోని లాలాపేట ఈ నాలుగు గ్రామాలు చరిత్ర పుటల్లోంచి తుడిచిపెట్టుకు పోయాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే గ్రామాలుగా ఉన్నాయి. ఆ గ్రామాల్లో అడుగుపెడితే కూలిపోయిన ఇళ్లతో నిర్మానుష్యంగా ఉంటోంది. ప్లేగు వ్యాధి అని కొందరు, మూఢ నమ్మకాలతో ఇంకొందరు ఇలా పలు కారణాలతో ప్రజలందరూ గ్రామన్ని విడిచి వెళ్లారు. ఎమ్మిగనూరు రెవెన్యూ రికార్డుల ప్రకారం ముప్పై మూడు గ్రామాలుండగా ముప్పై రెండు గ్రామాలూ కంటికి కనిపిస్తే కనిపించని గ్రామమే సర్దార్ పూర్వం.

ఈ గ్రామం శ్రీకృష్ణ దేవరాయుల కాలం నాటిదని ఇక్కడి వారు చెప్తారు. ఈ గ్రామ పరిధిలో పొడవైన కోట బురుజు దాదాపు విశాలమైన రెండు వందల ఇళ్లు ఉండేవి. గ్రామం చుట్టూ నీళ్లు పుష్కలంగా ఉండటంతో కనుచూపు మేరలో పచ్చని పొలాలు కనిపించేవి. ఇలా వివిధ రకాల పచ్చని పంటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, నిత్యం జనంతో ఊర్లోనే గుడిసెలు నిండి ఉండేవి. సర్దార్ పురం గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించినప్పటికీ ఆర్థికంగా ఐక్యమత్యంగా ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాడి పంటలతో అలరారుతూ ఎటువంటి కష్టాలను చవిచూడని గ్రామంగా సర్దార్ పురం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. సిరిసంపదల నిలయంగా ఉన్న సర్దార్ పురాన్ని రోగాలు చుట్టుముట్టాయి. కొంతకాలం పాటు ప్లేగు వ్యాధి తిష్టవేసింది, ప్లేగు వ్యాధి దెబ్బకు ఊరి జనం చాలా కాలం పాటు విలవిల్లాడారు. కొంత మంది చనిపోగా, మరి కొంత మంది రోగం బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి సర్దార్ పురం గ్రామ ప్రజలను కష్టాలు వెంటబడ్డాయి.

గ్రామ సమీపంలోని వెంకటాపురంలో వెలిసిన గుంటి రంగస్వామి సన్నిధిలో ఎలాంటి రోగాలు సోకవనే నమ్మకంతో అక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మరికొంతమంది సర్ధార్ పురంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాపురం గ్రామానికి వెళ్లారు. ప్లేగు వ్యాధి భయంతో సర్ధార్ పురం గ్రామవాసులు ఊరు వదిలిన, ఊరికి సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగైన, సర్దార్ పురం గ్రామం పేరు మాత్రం ఎమ్మిగనూరు మండల రెవెన్యూ రికార్డుల్లో నేటికి పదిలంగా ఉండటం విశేషం. రెండు వందల ఏళ్ల క్రితం సర్దార్ పురం గ్రామస్థులు ఊరు విడిచిన, వారి వంశస్థులు ఊరు చుట్టు పక్కల ఉండే పొలాలను నేటికి సాగుచేసుకుంటున్నారు. పండగలు శుభకార్యాలకు సరదాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఆనవాయితీగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు.

Teluguone gnews banner