తెరాస విస్తృత స్థాయి సమావేశం నేడే

 

తెరాస పార్టీ విస్తృత సమావేశం ఈరోజు హైదరాబాద్ కొంపల్లిలో జరగనుంది. రాష్ట్రం నలు మూలల నుండి దాదాపు 3,500 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ లక్ష్యాలను అందుకు పార్టీ నేతలు అనుసరించ వలసిన వ్యూహాలను నిర్దేశిస్తారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ అంతర్గత నిర్మాణం కోసం గ్రామ స్థాయి నుండి కమిటీల ఏర్పాటు, పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పార్టీ నేతలకి వివరించి వాటిని ప్రజలలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పవచ్చును. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పార్టీ కార్యక్రమం ఇది. కనుక తెరాస నేతలు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

Teluguone gnews banner