తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త...వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
posted on May 13, 2025 @ 6:35PM
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉంటాయని ఏపీ దేవాదయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు తిరుమల దేవస్థానం సిద్ధమైంది. ఈ క్రమంలో మే 15 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు ప్రారంభం కానునట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై బ్రేక్ దర్శనాలు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ టీటీడీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి దర్మనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో టీటీడీలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా, మరికొన్ని సార్లు స్వల్పంగా ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.