తెలంగాణలో తగ్గిన కారు జోరు
posted on May 13, 2014 @ 3:25PM
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో వుంది. ఆ తర్వాత చాలాసేపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ ముందుకు దూసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధిగమించి ముందుముందుకి వెళ్ళిపోయింది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన టీఆర్ఎస్ స్థానిక ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోబోతోందా అనే సందేహాలు కలిగాయి. అయితే మధ్యాహ్నం రెండున్నర తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీ పైచేయి సాధించింది. కాంగ్రెస్ పార్టీ 460 ఎంపీటీసీ స్థానాలతో మొదటి స్థానంలో వుండగా, టీఆర్ఎస్ 427 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ 183 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.