తెలంగాణలో జోరుగా సమగ్ర కుటుంబ సర్వే
posted on Aug 19, 2014 @ 10:41AM
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు చురుగ్గా జరుగుతోంది. ఎన్యూమరేటర్లకు వివరాలందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆది, సోమ వారాల్లో ప్రీ విజిట్ నిర్వహించిన ఎన్యూమరేటర్లు అందుబాటులోఉంచుకోవాల్సిన సమాచారం గురించి వివరించారు. ఇంటింటికీ కరపత్రాలు అందజేసి, ఇళ్ళమీద స్టిక్కర్లు అంటించారు. ఈ సర్వే మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలైంది. పూర్తయ్యేంత వరకు ఎంత సమయమైనా నిర్వహిస్తారు. ఒక్కో ఎన్యూమరేటర్కు 40 ఇళ్లు.. అవసరాన్నిబట్టి అదనపు అసిస్టెంట్లను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.