యు.పి.లో వరదలు... 49 మంది మృతి
posted on Aug 19, 2014 @ 10:32AM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఇంకా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బహరైచ్ జిల్లాలో 22మంది, శ్రవస్తి జిల్లాలో 10మంది, బలరామ్పూర్ జిల్లాలో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో 11మంది, సితాపూర్ జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద కారణంగా మరణించారు. ఇప్పటికీ 15 వందల గ్రామాలు నీట మునిగి వున్నాయి. వరద సహాయం నిమిత్తం రాష్ట్రప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు, పోలీసులు, జాతీయ విపత్తు సహాయక సిబ్బంది....సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాప్తీ, సరయు, ఘాఘ్ర, శారద తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.