చంద్ర‌బాబు కుటుంబం హత్యకు వైసీపీ కుట్ర!!

చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇటీవలే విశాఖలో చంద్రబాబు, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు, లేకేష్‌ను లేకుండా చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై లోకేశ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ రాస్తామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

Teluguone gnews banner