మునిసిపల్ పదవులతో అధికారం సంపూర్ణం
posted on Jul 3, 2014 @ 8:39PM
రెండు నెలల క్రితం జరిగిన పంచాయితీ, మునిస్పాల్ ఎన్నికలలో విజయ డంకా మోగించిన తెలుగుదేశం పార్టీ, ఈరోజు 90 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికలలో ఏకంగా 74 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులను, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు మరియు అనంతపురం మేయర్ పదవులను కైవసం చేసుకొని రాష్ట్రా స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సంపూర్ణాధికారం చేజిక్కించుకొంది. తెదేపా-బీజేపీలు రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉండటం వలన రాష్ట్రానికి ఏవిధంగా పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతుందో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా అధికార పార్టీకే చెందినవారు అధికారంలో ఉండటం వలన కూడా జిల్లాలు పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకొన్న పధకాల అమలులో, అదేవిధంగా జిల్లాలకు అవసరమయిన నిధులు మంజూరులో ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.