Read more!

మరో విద్యార్థి మృతదేహం దొరికింది

 

హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన 24మంది విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలు ఇప్పటికే లభించాయి. సోమవారం ఉదయం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈరోజు ఉదయం మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. వెలికితీసిన ఈ మృతదేహాన్ని బాగ్‌అంబర్‌పేట సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీకి చెందిన దేవాషిస్ బోస్‌గా గుర్తించారు. నిన్న నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, ఈ ఉదయం మరో విద్యార్థి మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు. మిగిలిన 19 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.