Read more!

ఐసీయూలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు

 

తీవ్ర అస్వస్థతకి గురైన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌లోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. బీపీ, సుగర్ వున్న వెంకట్రావుకు ఛాతీనొప్పి రావడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లాకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి వెంకట్రావుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగిత వెంకట్రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.