స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు..
posted on Mar 10, 2017 @ 3:43PM
నేడు స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అయిదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ప్రభావం మార్కెట్లపై పడింది. ప్రారంభ ట్రేడింగ్లో మంచి లాభాలతోనే మొదలైన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 17.10 పాయింట్లు లాభపడి 28946.23 పాయింట్లకు చేరింది. నేడు ఎన్ఎస్ఈలో బోష్, భారతి ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభపడ్డాయి.