ఏకగ్రీవంగా ఏడుగురు ఎమ్మెల్సీల నియామకం..
posted on Mar 10, 2017 @ 3:17PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్ధానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి నారా లోకేష్, బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్.. వైసీపీ నుండి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.