చంద్రబాబుకి పోటిగా షర్మిల పాదయాత్ర

 

జగన్ కి బెయిల్ వస్తుందని గంపెడు ఆశలతో ఉన్న వైయస్ఆర్ పార్టీశ్రేణులు సుప్రీం తాజా తీర్పుతో డీలా పడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పాదయాత్రతో జనంలోకి వెళ్లిపోవడంతో దీనికి కౌంటర్‌గా వైఎస్ కూతురు, జగన్ సోదరి షర్మిలతో సుదీర్ఘ పాదయాత్ర చేయించడం మినహా మరో మార్గం లేదని వారు భావిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు జగన్ కూడా ఒకే చెప్పారని, ఇక అధికారిక ప్రకటనే తరువాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో విజయమ్మ సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఓదార్పు యాత్రకన్నా ప్రజాసమస్యలపై షర్మిళ పాదయాత్రకే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షర్మిళ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించాలా లేక మరో ప్రాంతమా అన్న విషయంపైనా త్వరలోనే వైకాపా క్లారిటీ ఇవ్వనుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.