స్కాం ఇండియా నుంచి స్కిల్ ఇండియాకి: మోడీ
posted on Jun 11, 2014 @ 11:15PM
ఇండియా మొన్నటి వరకూ స్కాముల మయమైపోయింది. స్కామ్ ఇండియాగా చెడ్డపేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియాని స్కామ్ ఇండియా నుంచి స్కిల్ ఇండియాగా మార్చడమే తన స్వప్నమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం నాడు ఆయన లోక్సభలో స్ఫూర్తిదాయమైన ప్రసంగం చేశారు. యువతలో స్కిల్ పెంచడానికి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పేదవారిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురాగలనన్న నమ్మకం తనకు వుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అధికధరలను తగ్గించేందుకు రియల్ టైం డేటాను అందుబాలోకి తీసుకుకొస్తామని చెప్పారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు భద్రత ఇవ్వడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత అని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.