సదానందగౌడ కొడుకు మీద కేసు...
posted on Aug 29, 2014 @ 2:01PM
కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుని మోసం చేశాడని కన్నడ సినీనటి మైత్రేయ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో కేసు బుక్ చేయాలా వద్దా అని తర్జన భర్జనలు పడిన పోలీసులు చివరికి కార్తీక్ గౌడ మీద కేసు నమోదు చేశారు. మైత్రేయ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టిన తర్వాతే కార్తీక్ గౌడను అదుపులోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంతముందు వార్తలు వెలువడినట్టుగా మైత్రేయ కార్తీక గౌడ తనను మానభంగం చేసినట్టుగా ఆమె ఫిర్యాదు చేయలేదని, తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాత్రమే ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా వుంటే తాను సదానంద గౌడ ఇంటికి కోడలిగా వెళ్ళాలని కోరుకుంటున్నానే తప్ప, ఆ కుటుంబాన్ని అభాసుపాలు చేసే ఉద్దేశం లేదని మైత్రేయ చెబుతున్నారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకూ బోసి మెడతో కనిపించిన మైత్రేయ గురువారం సాయంత్రం నుంచి మెడలో పసుపు కొమ్ము కట్టిన పసుపుతాడు వేసుకుని కనిపించడం విశేషం.