గోకరాజు ఛాముండీ మధ్యలో సచిన్!

 

 

 

 

ఛాముండేశ్వరి నాథ్ అమ్మాయిలను బాగా ముస్తాబు చేసుకుని సచిన్ టెండూల్కర్ వద్దకు తీసుకువెళ్లేవాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. కార్యదర్శిగా చాముండేశ్వరి అక్రమాలకు పాల్పడ్డాడని, ఆయన అవకతవకల మూలంగా ఐదు కోట్ల రూపాయల దాకా అసోసియేషన్ నష్టపోయిందని అన్నారు. అందుకే ఆయనను అసోసియేషన్ నుండి సస్పెండ్ చేశామని అన్నారు. ఇద్దరి మధ్య పోరులో సచిన్ ను లాగిన గంగరాజు తనకు ఈ పదవి పెద్దదేం కాదని, తన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పినట్లు తనకి సచిన్ అంటే గౌరవమని అన్నారు.

Teluguone gnews banner