డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ ఛార్జీల బాదుడు

డీజిల్ ధరల్ని పెంచుతూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చీరాకముందే రాష్ట్రంలో సామాన్యులపై భారం పెరిగిపోయింది. ఆర్టీసీ చార్జీల పెంపురూపంలో రాష్ట్ర ప్రజలనెత్తిన ఇంకా కాస్త బరువుని కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా మోపింది. పెరిగిన ఆర్టీసీ చార్జీలు ఆదివారం అర్థరాత్రినుంచే అమల్లోకొచ్చాయి. డీజిల్ ధరలు పెరగడంవల్ల ఆర్టీసీమీద అదనపు భారం పడిందని, నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పల్లెవెలుగు బస్సులకు 25 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, 45 కి.మీ. వరకు రూ.2, ఆపై ప్రతి కి.మీ. ఐదు పైసలు, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులకు కి.మీ.కు 10 పైసలు, సూపర్ లగ్జరీ బస్సులకు కి.మీ.కు 12 పైసలు చార్జీలు పెరిగాయి. ఇంద్ర, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల చార్జీల్లో ఎలాంటి మార్పూలేదు. నెలవారీ సిటీ బస్‌ పాస్ లపై  వందరూపాయల భారం అదనంగా పడింది. విద్యార్థుల బస్ పాస్ చార్జీల్నిమాత్రం పెంచలేదు. 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.