రాజకీయ ఆశ్రయం కోసం రేవంత్ పంచన ఆర్జీవీ
posted on May 18, 2024 @ 11:57AM
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు. దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలపై చిత్రం నిర్మించారు. పూర్తి అవాస్తవాలతో తెరకెక్కిన చిత్రం ఇది. . జగన్ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. తాజాగా ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. త్రికూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఎలాంటి నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ డైరక్టర్ల అసోసియేషన్ అంటూ ఈ కొత్త డ్రామాకు తెరతీశాడు. కొంత మందితో కల్సి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. పబ్లిసిటీ పిచ్చిబాగా ఉన్న రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా చూసుకున్నారు. గతంలో డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించని వర్మ సడెన్ గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది. డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి వచ్చి ఎవరైనా కలిస్తే కించ పరిచేవారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ? ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది.