రాయపాటి సాంబశివరావుకి సతీ వియోగం.. చంద్రబాబు ఓదార్పు
posted on Jul 16, 2016 @ 10:34AM
టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు సతీ వియోగం కలిగింది. రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి (67) గుండెపోటు కారణంతో కన్నుమూశారు. నిన్న ఉదయం వరకూ బాగానే ఉన్న లీలాకుమారి.. రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మరోవైపు రాయపాటి భార్య మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రాయపాటికి స్వయంగా ఫోన్ చేసి లీలాకుమారి మృతికి సంతాపం ప్రకటించి.. రాయపాటిని ఓదార్చారు. ఈరోజు సాయంత్రం గుంటూరులోని లక్ష్మీపురంలో లీలాకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి.