రాహుల్ కామెడీ!

 

 

 

రాబోయే ఎన్నికల తర్వాత దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న రాహుల్‌గాంధీ వ్యవహారశైలి, ఆయన మాట్లాడే తీరు చూసి రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాక విస్తుపోతున్నారు. ఖర్మకాలి వచ్చే ఎన్నికల తర్వాత ఈయనగానీ దేశ ప్రధాని అయిపోడు కదా అని భయపడిపోతున్నాడు. ఆమధ్య నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టించాయి.

 

రాజకీయ అపరిపక్వతతో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ నెత్తిన బండల్లా మారాయి. ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నచ్చలేదు. అలాగే తనకు ప్రాణహాని వుందంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన పిరికిమాటలు ఆయన స్థాయిని చెప్పకనే చెప్పాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు, విచిత్రమైన మాటలు చూసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీదే ఆధారపడి ఆయన్నే కాబోయే ప్రధానిగా ప్రమోట్ చేస్తోంది. సోనియాగాంధీ కొడుకుగా పుట్టిన పుణ్యానికి ఆయనకి దక్కుతున్న అదృష్టమది. లేటెస్ట్‌ గా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ప్రస్తుతం పేపర్లలో ఆఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఛానెళ్ళలో తన బొమ్మ నిండుగా కనబడేట్టు చూసుకుంటున్నారు.

ఈ మధ్య ఒక జాతీయ ఛానెల్లో రాహుల్ గాంధీ ఒక ఇంటర్వ్యూ  ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమాత్రం పరిణతి లేకుండా రాహుల్ చెప్పిన సమాధానాలు నవ్వు తెప్పించేలా వున్నాయని ముక్తకంఠంతో  అంటున్నారు. ఆచితూచి, ఒక పద్ధతి ప్రకారం, ఒక అవగాహనతో మాట్లాడే నరేంద్రమోడీకి  - నోటికి ఏది వస్తే అది మాట్లాడే రాహుల్ గాంధీకి మధ్య పోటీనా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ  ఒక పాపులర్ కమెడియన్‌గా తయారయ్యాడని అంటున్నారు.

Teluguone gnews banner

వెంక‌య్య చెప్పింది వేద‌మ‌య్యా.. కానీ! ?

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంక్షేమ ప‌థ‌కాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆ ఖ‌ర్చు కూడా శృతి మించి పాకాన ప‌డుతోంది. ఈ విష‌యాన్నే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ఉచితాలు అనుచితంగా మారాయ‌ని వెంకయ్య అన్నారు.  ఈ మాట‌లు కూడా నిజ‌మే క‌దా  అనిపించ‌క మాన‌వు. ఏం ప‌థ‌కాల‌వి? జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడు పాల‌న‌ బామ్మ కూడా చేస్తుంద‌న్న బాబు.. ఇప్పుడేం చేస్తున్నార‌న్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశ‌మే. జ‌గ‌న్ ఏటా డెబ్భై వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చయ్యేలాంటి ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న చేస్తే, అదే చంద్ర‌బాబు అంత‌కు రెట్టింపు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.  అలాగ‌ని ఇదంతా చంద్ర‌బాబుకు నచ్చి చేస్తున్న‌ది కాద‌న్న‌ది కూడా అంతే వాస్త‌వం. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో జ‌నాన్ని సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌భ్య పెట్ట‌డం ద్వారా మాత్ర‌మే రాణించ‌గ‌ల‌మ‌న్న‌ది తెలిసిందే.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ జ‌గ‌న్ అయిన దానికీ కానిదానికీ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. ఆయ‌న ప‌థ‌క‌ ర‌చ‌న డీ కోడ్ చేయాలంటే అంత‌క‌న్నా మించిన ప‌థ‌క ర‌చ‌న చేస్తేనే సాధ్యం. జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన చాలా చాలా ప‌థ‌కాలు గ‌తంలో లోకేష్ ప్ర‌స్తావించిన‌వే. ఆ ప‌థ‌కాల‌ను బాబు తొలుత వ‌ద్ద‌న్నారు. కానీ, అదే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌రాజ‌యం కొని తెచ్చి పెట్టింది.  2024 ఎన్నిక‌ల‌ నాటికి చంద్రబాబు త‌న ప్లాన్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌భుత్వ‌ సొమ్ము ప‌ప్పు బెల్లాల్లా పంచి పెట్ట‌డానికి ఏమంత స‌ముఖంగా లేరు. అందుకే పీ-4 వంటి ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ప్ర‌యివేటు వ్య‌క్తుల భాగ‌స్వామ్యం సంక్షేమంలో పెంపొందిస్తున్నారు.  ఇక మెడిక‌ల్ కాలేజీల్లో పీపీపీ ప‌థ‌కం కూడా స‌రిగ్గా ఇలాంటిదే.  ప్రైవేటు భాగ‌స్వామ్యం ఎలాంటి ఫ‌లితాలనిస్తుందో హైద‌రాబాద్- మెట్రోను బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీస్కోవ‌చ్చు. ఇప్పుడు హైద‌రాబాద్ మెట్రోను బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దిన ఎల్ అండ్ టీ చాలా చాలా త‌క్కువ ధ‌ర‌కు త‌మ వాటాల‌ను వ‌దులుకోడానికి సిద్ధ ప‌డుతోంది. దీని ద్వారా లాభ‌మేంటంటే ఈ మొత్తం  ప్ర‌భుత్వానికి ఒక ఆస్తిగా మ‌రుతున్నది. భ‌విష్య‌త్ లో న‌గ‌రానికే ఇదొక మ‌ణిహారంగా మారుతుంది.  కానీ విధిలేని ప‌రిస్థితుల్లో బాబు ఆయా ప‌థ‌కాల‌ను ఇస్తుండ‌టం ఒక రాజ‌కీయ అనివార్య ప‌రిస్థితిలో భాగంగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. పోటా పోటీ రాజ‌కీయాల కార‌ణంగానే ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఆటో డ్రైవ‌ర్ల సేవ ఇంచు మించు అలాంటిదే. ఉచిత బ‌స్సు ప‌థ‌కం  ఆటో డ్రైవ‌ర్లకు ఇబ్బందిక‌రంగా మారింది.  దీంతో ఆటో డ్రైవ‌ర్ల‌కు 15 వేల రూపాయ‌లను విధిలేని ప‌రిస్థితుల్లో ఇవ్వాల్సి వ‌చ్చింది.  వాజ్ పేయి అన్న‌ట్టు విద్యా, వైద్యం త‌ప్ప మ‌రేదీ ఉచితంగా అందివ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ప్ర‌స్తుతం ఇటు ఏపీలో కావ‌చ్చు, అటు తెలంగాణ‌లో కావ‌చ్చు ఉన్న రాజ‌కీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. వ్య‌వసాయ ఆధారిత రాష్ట్రాలు కావ‌డంతో.. ఇక్క‌డ సంక్షేమానికి పెద్ద పీట వేయ‌క త‌ప్ప‌దు.  దానికి తోడు రాజ‌కీయాల్లోకి ఈ వ్యూహకర్తల రాకడ వ‌ల్ల‌ కూడా.. ఈ పోటా పోటీ సంక్షేమ ప‌థ‌కాలు తెలుగు రాజ‌కీయాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో వ‌ర్క‌వుట్ అయిన ప‌థ‌కాల‌ను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌క‌టించ‌డంతో.. అప్ప‌టి వ‌ర‌కూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తూ వ‌చ్చిన ప‌థ‌కాలు కాస్తా గాలికెగిరిపోయాయి. మ‌హిళ‌లంతా క‌ల‌సి త‌మ కోసం కాంగ్రెస్ ప్ర‌క‌టించిన.. రూ. 500కే గ్యాస్ సిలిండ‌ర్, ఉచిత విద్యుత్, స‌న్న‌బియ్యం.. అన్నిటిక‌న్నా మించి ఫ్రీ బ‌స్ కి జై కొట్టారు.  దీంతో కాంగ్రెస్ ఇక్క‌డ అనూహ్యంగా మూడో స్థానం నుంచి దూసుకొచ్చి ఫ‌స్ట్ ప్లేస్ ఆక్ర‌మించింది. అధికారం కైవ‌సం చేసుకుంది.  ఇది గుర్తించిన తెలుగుదేవం కూట‌మి ఇవే సంక్షేమాల‌ను అటు ఇటుగా మార్చి.. సూప‌ర్ సిక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి వ‌ద‌ల‌డంతో.. ఇక్క‌డ జ‌గ‌న్ సంక్షేమ జాత‌ర‌కు ఒక్క‌సారిగా ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్ట‌య్యింది. దీంతో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువైంది.  ఉచితం అన్న‌ది రాజ‌కీయ క్రీడ‌లో ఒక‌ భాగ‌మై పోయింది. మేము ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలూ ఇవ్వం అని చెప్పి ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డానికి వీల్లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం వెంక‌య్య నాయుడు మాత్ర‌మే కాదు గ‌తంలో జేపీ న‌డ్డా ఏపీ వ‌చ్చిన‌పుడు కూడా ఈ సంక్షేమాలు త‌మ అభిమ‌తం కాద‌న్నారు. కానీ ఏపీలోని రాజకీయాల‌పై సంక్షేమం ఎంత‌టి ప‌వ‌ర్ఫుల్ అంటే, సోము వీర్రాజును కాస్తా సారాయి వీర్రాజుగా మార్చేంత‌. ఆయ‌న కూడా ఉచితాల ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఆనాడు.. అత్యంత చౌక‌గా మ‌ద్యం అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ అలాంటి కాంట్ బ‌ట్ సిట్యువేష‌న్ రాజ్య‌మేలేతున్న విధం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల్సి ఉంది.   పొలిటిక‌ల్ గా ఇలాంటి ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ చాలానే ఉన్నాయి. దీంతో సంక్షేమాలు ఒక అనివార్యంగా త‌యార‌య్యాయి. అభివృద్ధి మాత్ర‌మే చేస్తామ‌ని తెలుగు రాజ‌కీయాల్లో నెట్టుకు రావ‌డం చాలా చాలా క‌ష్టం అన్న‌ది ఇక్క‌డ ఏ  క్రియాశీల రాజ‌కీయ నాయ‌కుడ్ని అడిగినా చెబుతారు.

రేవంత్ పై పీకే విమర్శలు.. వ్యూహమేంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం, విమర్శల వెనుక అర్ధవంతమైన కారణమే ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడానికి బీహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలను ఒక్క ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు.. రాజకీయాలకు అతీతంగా బీహార్ వాసులంతా తప్పుపడుతున్నారు. బీహార్ కు చెందిన కన్హయ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు రేవంత్ ను మర్యాద తెలియని మనిషిగా, అనాగరికుడిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. తనది తెలంగాణ డీఎన్ఏగా గర్వపడుతున్నానని చెబుతూ.. కేసీఆర్ డీఎన్ఏను తక్కువ చేసి వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది.  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  కారాలు మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ ను గద్దెదింపడం ఖాయమని పీకే ప్రతిజ్ణ చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు ఉన్న పీకే చేసిన ఈ సవాల్ సంచలనం సృష్టించింది. అంతే కాదు.. రేవంత్ వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలపై చూపే అవకాశం ఉందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై పీకే వ్యక్తం చేసిన ఆగ్రహం, చేసిన సవాల్ 2028 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చూపే ప్రభావం ఏమిటో తెలియదు కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలన్నదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రేవంత్ పై వ్యక్తం చేసిన ఆగ్రహం ద్వారా బీహారీలలో ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపడం ద్వారా తన జనసూరత్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పీకే ఈ ఎత్తుగడ బీహార్ లో ఆయన పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే తన పార్టీ విజయం కంటే.. ప్రత్యర్థి పార్టీల అవకాశాలను దెబ్బతీయడానికే వ్యూహాలు రచిస్తారని గతంలో పలు సందర్భాలలో రుజువైన సంగతి తెలిసిందే.   

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల సవారీ!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల చూసినా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ సజావుగా అమలు ఔతున్నాయి. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల జగన్ పాలనలో పేరుకే సంక్షేమం, అభివృద్ధి శూన్యం అన్నట్లుగా సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. తెలుగుదేశం కూటమి సర్కార్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు సాగుతోందనిపరిశీలకులు సైతం చెబుతున్నారు.  రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ హయాంలో కంటే ఇప్పుడే సంక్షేమం ఎక్కువగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అందించిన సంక్షేమం గోరంత,  చేసుకున్న ప్రచారం కొండంత అన్నట్లుగా ఉండేదని అంటున్నారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం కంటే లబ్ధిదారులకు సంక్షేమం అందడం ముఖ్యం అన్నట్లుగా సాగుతోందని అంటున్నారు. అభివృద్ధి పనులు నిరాటంకంగా నిరంతరం సాగుతుండటంతో ఉపాధి సైతం పుష్కలంగా లభిస్తోంది. గత జగన్ పాలనతో పోలుస్తూ ప్రస్తుత తెలుగుదేశం కూటమి పాలనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ హయాంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అదే ఇప్పడు బాబు పాలనలో తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింప చేస్తున్నారు. అలాగే గతంలో అంటే జగన్ హయాంలో పింఛన్ల కంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎక్కకువ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ హయాంలో పది వేల రూపాయలు ఇస్తే.. ఇప్పుడు చంద్రబాబు 15 వేల రూపాయలు ఇస్తున్నారు.  ఇలా ఏ పథకం చూసుకున్నా.. జగన్ హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు పాలనలో మెరుగ్గా ఉంది. అమలు పారదర్శకంగా ఉంది. గతంలో బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చానని జగన్ చెప్పినా.. ఆ బటన్ నొక్కిన సొమ్ములు ఎప్పడు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక  జగన్ హయాంలో  అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. పెట్టుబడులు ఏపీయే గమ్యం అన్నట్లుగా తరలి వస్తున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ఆందోళనలకు పిలుపునిస్తున్నా పార్టీ శ్రేణులే సీరియస్ గా తీసుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. 

తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం.. ఇంతకు మించి తరుణం ఉంటుందా?!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో   వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో   ఉనికి మాత్రంగానే మిగిలిందని చెప్పవచ్చు.  అయితే ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నది నాయకుల కొరతే తప్ప కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచారు.   ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన పరిస్థితి.  కాంగ్రెస్, బీజేపీలు ఆ ఎన్నికల  ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావన తీసుకురావడమే కాదు, పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు.  అంతే కాదు..  అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నం చేసింది.  ఎవరు ఔనన్నా కాదన్నా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం దండిగా ఉంది. ఈ విషయం పదేపదే నిర్ద్వంద్వంగా రుజువు అవుతూనే వస్తోంది. రాష్ట్ర విభజన అనంతర   పరిణామాలతో  తెలంలగాణలో తెలుగుదేశం పార్టీ   ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యిందన్న మాట వాస్తవమే. అయితే ఆ పార్టీ పునాదులు మాత్రం తెలంగాణలో చెక్కు చెదరలేదు.  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు క్రియాశీలంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న భావనతో ఉన్నారు. ఇందు కోసం ఆయన తరచుగా తెలంగాణ తెలుగుదేశం నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కొద్ది కాలం కిందట జోరుగా సాగింది. అయితే ఆ దిశగా పార్టీ ముందుకు సాగిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే పరిశీలకులు మాత్రం తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడానికి, పునర్వైభవం సంతరించుకోవడానికి ఇది మంచి తరుణమని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కారణాలేమైతేనేం.. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే ఆలా వెళ్లిన నేతల వెంట కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు. అంతెందుకు తొలి నుంచీ తెలుగుదేవం పార్టీతో అనుబంధం ఉన్న పలువురు నేతలు ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం ఇన్ యాక్టివ్ అయినా.. ఎప్పటికైనా తెలుగుదేశం రాష్ట్రంలో పుంజుకుంటుందన్న విశ్వాసం మాత్రం కార్యకర్తలలో ఇసుమంతైనా సడలలేదు.   ఇటీవల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు.  ఇది జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ తరుణంలో తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా.. స్థానిక సమరంలో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించితే.. పార్టీ ప్రజలకు చేరువ అవుతుందనీ, అది రాష్ట్రంలో ముందు ముందు  తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు దోహదపడుతుందని కార్యకర్తలు గట్టిగా చెబుతున్నారు.  పరిశీలకులు విశ్లేషణలు కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో? 

తెలంగాణ స్థానిక ఎన్నికలు.. చేతులెత్తేసిన పార్టీలు

రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించవలసి వుంది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై జీవో జారీ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి మార్గం సుగమం చేసింది. అంతే వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అయితే ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన పార్టీలేవీ రెడీగా లేవు.  వైపు ఓటమి భయం అన్ని పార్టీలలోనూ సమానంగా వ్యక్తం అవుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. అన్న ఆందోళన కనిపిస్తున్నది. ఈ దశలో బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసలు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. అనవసరంగా భారీ ఆర్భాటంతో ప్రచారాలు చేయవద్దనీ, దావతుల పేరుతో డబ్బులు వృధా చేసుకోవద్దనీ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  నిజానికి స్థానిక సమరంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహకాల విషయంలో ఇంకా తొలి అడుగులోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల జీవో తో రేవంత్ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం కాంగ్రెస్ గ్రాఫ్ ను ఏ మాత్రం పెంచిందంటే.. ఆ పార్టీ నాయకులే అనుమానం అంటూ నసుగుతున్నారు. అధికారంలో ఉండి స్థానిక ఎన్నికలలో సత్తా చాటలేకపోతే ఆబోరు దక్కదన్న భయం కాంగ్రెస్ లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ లో స్థానిక ఓటమి పార్టీ ఉనికికే ముప్పు తెస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.    ఇక్కడ మరో ప్రధాన అంశమేంటంటే.. బీజేపీ 42శాతం రిజర్వేషన్లను బాహాటంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేదు. అయినా ఈటల మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థ‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వం  ప్ర‌భుత్వం 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఏదోలా ఎన్నికలు జరిగినా.. తరువాత ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే జరిగిన ఎన్నికలను రద్దు చేసే అవకాశాలున్నాయని ఈటల చెబుతున్నారు. తద్వారా ఈటల హేతురహితంగా ఎన్నికల రద్దు ప్రస్తావన తేలేదనీ, గతంలో  మ‌హారాష్ట్రంలో ఇలాగే జరిగిందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మహారాష్ట్ర కూడా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించింది. అయితే ఆ తరువాత ఆ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని బొంబై హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని కూడా ఈటల ఉదహరించారు. ఆ ఉదాహరణ చూపుతోనే.. ఎన్నికలకు ప్రచారార్భాటాలు, దావత్ లతో సొమ్ము వృధా చేసుకోవద్దన్నారు.  అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేంటంటే స్వయంగా బీసీ నాయకుడై ఉండీ ఈటల కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకించడం. దీనినే ఎత్తి చూపుతూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా.. ఎన్నికల విజయంపై మాత్రం ఆ పార్టీలో ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అందుకే షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల హడావుడి మాత్రం పార్టీలలో పెద్దగా కనిపించడం లేదు. 

స్ధానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ కు రిజర్వేషన్ల సవాల్!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే..  తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 5 వేల 749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు.. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక.. 12 వేల 733 గ్రామ పంచాయతీలకు..  3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.  అక్టోబర్‌ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్‌ 13న రెండో దశఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రెండో దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 15ని చివరి తేదీగా నిర్ణయించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ  స్థానాలకు.. అక్టోబర్ 23న తొలిదశ , అక్టోబర్ 27న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.  అక్టోబర్ 31న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం లక్షా 12 వేల 474 పోలింగ్ స్టేషన్లలో.. పోలింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కోటీ 67 లక్షల మందికి పైగా ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో.. 85 లక్షల 36 వేల మందికి పైగా మహిళా ఓటర్లు, 81 లక్షల 65 వేల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో.. 14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఈ మేరకు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. అక్టోబర్ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అయితే.. దానికంటే ఒక్క రోజు ముందే.. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై.. హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూలమైన ఆదేశాలు గనక వస్తే.. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చర్చ జరుగుతోంది. ఇది.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర మేలు చేస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బహుశా ఇదే తొలిసారి. ఇప్పటికే దీనిపై జనంలో చర్చ మొదలైంది. దాంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవలం చేసుకుంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.

ఆసియా క‌ప్ కాదు.. భార‌త్- పాక్ గ్రౌండ్ వార్?

ఈ సారి ఆసియా క‌ప్   చాలా చాలా ప్ర‌త్యేకం. దీన్ని పిచ్ పై జ‌రిగిన‌ భార‌త్- పాక్  వార్ గానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ లో భార‌త్ గెలిచిందే కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి మొద‌లైంది అస‌లు ర‌గ‌డ‌. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య కేవ‌లం స‌రిహ‌ద్దులోనే కాదు ఏ వైదిక‌మీద‌నైనా యుద్ధం యుద్ధ‌మేని. అందుకే మోడీ కూడా ఇదే త‌ర‌హాలో ట్వీట్ చేశారు. పిచ్ మీద జ‌రిగిన‌ ఆప‌రేష‌న్ సిందూర్ లో కూడా భార‌త్ దే విజ‌య‌మంటూ ఆయ‌న అన‌డం అదే సూచించింది. ఈ టోర్నీలో రెండు జ‌ట్ల మ‌ధ్య మొత్తం మూడు మ్యాచ్ లు జ‌ర‌ిగాయి.. ఫైన‌ల్లో భార‌త్, పాక్ ని ఉత్కంఠ పోరులో చిత్తు చేసి త‌న క్రికెట్ ప్ర‌తీకారంతీర్చుకోగ‌లిగింది.  ఒక ద‌శ‌లో పాక్ ఆట‌గాళ్లు అన్న మాట‌లేంటంటే.. తాము ఎందుకు ఓడిపోయామంటే.. భార‌త్ ని ఫైన‌ల్ వ‌చ్చేలా చేసి.. అక్క‌డ ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోడానికీ అన్న కామెంట్లు పెద్ద ఎత్తున హాస్యాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ స‌రికే గ‌న్ పేల్చిన పోజులు, విమానాన్ని కూల్చామ‌న్న సిగ్న‌ళ్లిచ్చి వివాదాస్ప‌ద‌మైన పాక్ ఆట‌గాళ్లు.. త‌ర్వాత ఐసీసీ చేత చీవాట్లు తినాల్సి వ‌చ్చింది. ఇక ఇలాంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం కూడా నేర‌మ‌న్న కోణంలో సూర్య‌కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌తీకార చ‌ర్య‌కు ఐసీసీ ద్వారా మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కోవ‌ల్సి వ‌చ్చింది. అయినా సరే ఏమంత లెక్క  చేయ‌లేదు.. సూర్యా భాయ్. పైపెచ్చు ఆ  దేశాన్ని త‌మ‌కు ప్ర‌త్య‌ర్ధిగా అభివ‌ర్ణించ‌రాద‌ని కూడా సూచించారాయ‌న‌. కార‌ణం.. త‌మ‌తో ఏ పిచ్ మీద, ఏర‌క‌మైన మ్యాచ్ జ‌రిగినా.. వ‌రుస‌గా ఓడిపోయే టీమ్ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు  సూర్య‌. ఇక ఫైన‌ల్ అయితే టాస్ ఓడి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన పాక్.. తొలుత మంచి ప్రారంభం చేసింది. కానీ ఓపెన‌ర్లు ఔట్ కాగానే, ఆ ఇన్నింగ్స్ కాస్తా పేక‌మేడ‌లా కూలింది. కుల్ దీప్ అయితే ఏకంగా  నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు ఆ నాలుగు వికెట్లలో మూడు ఒకే ఓవర్ లో తీసుకున్నాడు. ఇక 147 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న మొద‌లు పెట్టిన భార‌త్ .. అభిషేక్ శ‌ర్మ రూపంలో ఊచ కోత మొద‌వుతుంద‌ని అంద‌రూ ఆశిస్తే.. అది కాస్తా ఆశ అడియాశే అయ్యింది. ఆపై శుభ్ మ‌న్ గిల్, సూర్య కూడా త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్  అయ్యారు. అయితే ఇండియా చేతులెత్తేయలేదు. తెలుగింటి కుర్రాడు.. తిల‌క్ వ‌ర్మ‌.. త‌న‌దైన బ్యాటింగ్ విధ్వంసంతో క‌ప్పు భార‌త్ చేజారి పోకుండా కాపాడాడు. దీంతో 9వ సారి ఆసియా క్రికెట్ కింగ్ భార‌తే అని నిరూపించ‌గ‌లిగాడు.  ఒక్క మాట‌లో చెప్పాలంటే తిల‌క్ వ‌ర్మ చేసినవి కేవ‌లం 69 తొమ్మిది ప‌రుగులు మాత్ర‌మే కావు, కోటాను కోట్ల మంది భార‌తీయుల‌ భావోద్వేగాలు. దీంతో సూర్య‌కుమార్ యాద‌వ్ తిల‌క్  వ‌ర్మ‌కి టేక్ అబౌ ఇచ్చి గౌర‌వించాడు. ఇక క‌ప్ ఒక పాకిస్తానీ నుంచి అందుకోవ‌డం భారత్ కు నచ్చకపోవడంతో.. ప్రజంటేషన్  సెర్మ‌నీ గంట‌న్న‌ర ఆల‌స్యంగా జ‌రిగింది. ఆపై మ‌రొక‌రి ద్వారా ఇస్తార‌న్న మాట కూడా వినిపించింది .కానీ..  ఏషియ‌న్ ఛాంప్స్- 2025 ఈ సారి క‌ప్ అందుకోకుండానే టీమిండియా స‌భ్యులు త‌మ‌ సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌ల్సి వ‌చ్చింది.  దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానీయుల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌క పోవ‌డం మాత్ర‌మే కాదు, వారిచ్చే క‌ప్పు కూడా మాకు గ‌డ్డిపోచ‌తో స‌మానం అన్న అర్ధ‌మొచ్చేలా వ్య‌వ‌హ‌రించింది భార‌త జ‌ట్టు. ఒక ద‌శ‌లో టోర్నీ  నుంచి నిష్క్ర‌మిద్దామ‌నుకున్న పాక్ జ‌ట్టు.. కోట్ల రూపాయ‌ల‌  న‌ష్ట‌ప‌రిహారం క‌ట్ట‌లేక కొన‌సాగ‌డం మాత్ర‌మే కాదు.. ఫైన‌ల్ లోనూ భార‌త్ చేతిలో ఓడి.. భార‌త్ ముందు త‌న ప‌రాజ‌య ప‌రంప‌ర‌ను పూర్తి చేసుకుంది.  దీంతో క‌ద‌న రంగంలో,క్రికెట్ పిచ్ పైనా.. రెండింటా.. భార‌త్ ముందు పాక్ దిగ‌దుడుపే అని మ‌రోమారు ప్ర‌పంచానికి అర్ధమయ్యేలా   ఈ ఆసియా క‌ప్ జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పండ్రా అమెరిక‌న్లూ.. కాల్పుల విర‌మ‌ణ మీరు చేశారా? లేక భార‌తే పాక్ ని త‌ల వంచేలా చేసిందా?  అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  ఆ మాట‌కొస్తే ఇండియ‌న్ ఫ్యాన్స్ ఫ‌స్ట్ మ్యాచ్ నే బాయ్ కాట్ చేశారు. పెహ‌ల్గాంలో అకార‌ణంగా 26 మంది చావుకు కార‌ణ‌మైన పాక్ జ‌ట్టుతో మ‌నం క్రికెట్ ఆడ్డం ఏంట‌న్నది వీరి వాద‌న‌.  కాగా.. ఇపుడీ ఫైన‌ల్ మ్యాచ్ విన్నింగ్ ద్వారా పాక్ కి మ‌రో మారు బుద్ధి చెప్ప‌గ‌లిగింది భార‌త్. ఇదిలా ఉంటే కొంద‌రు పాకిస్థాన్ క్రికెట్ ల‌వ‌ర్స్.. మా క్రికెట్ జ‌ట్టు వ‌ల్ల మాకెలాంటి లాభం లేదు. సుఖం సంతోషం లేదు.. పాకిస్థాన్ మొత్తం క‌ట్ట‌క‌ట్టుకుని వ‌చ్చినా కూడా భార‌త్ పై మేం గెల‌వ‌డం సాధ్యం కాదు. అందుకే ఐ ల‌వ్ ఇండియా. మేం కూడా టీమిండియా అభిమానుల‌మే.. అన‌డం క‌నిపించింది.

ఔషధాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌ బాంబు

ఇప్పటికే.. భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. మరోసారి టారిఫ్ షాక్ ఇచ్చింది. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్ విధించింది. దాంతో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైనా అమెరికా అధ్యక్షుడు సుంకాలతో విరుచుకుపడ్డారు.  ముఖ్యంగా పేటెంట్ ఔషధాలపై.. ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక.. కిచెన్ క్యాబినెట్, బాత్ రూమ్ పరికరాలపై 50 శాతం, అప‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై పాతిక శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ విధించిన   జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని.. ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సుంకాలతో.. భారత ఫార్మా ఉత్పత్తులపై ఎంత ప్రభావం పడుతుం దన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 28 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం ఔషధాలు యూఎస్‌కే వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం ఇండియా నుంచి సరఫరా అయ్యేవే ఉంటాయి.  ఇప్పుడు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో  అమెరికా మార్కెట్‌లో భారత ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే.. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసే మెడిసిన్లలో ఎక్కువ భాగం జనరిక్ మందులే ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై టారిఫ్ లేదు. కేవలం.. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే ఈ వంద శాతం టారిఫ్ వర్తిస్తుంది. దీంతో.. ఈ తరహా ఔషధాలు ఎగుమతి చేసే కంపెనీల లాభాల మార్జిన్‌లు, స్టాక్ ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ.. టారిఫ్ పరిధిని కాంప్లెక్స్ జనరిక్స్‌కి కూడా విస్తరిస్తే.. భారతీయ ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.  తక్కువ ధరలలో నాణ్యమైన ఔషదాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసమయ్యే 47 శాతం ఔషధ అవసరాలను భారత్ కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్‌లు కేవలం బ్రాండెడ్, పేటెంట్ కలిగిన  ఔషధ దిగుమతులకే వర్తిస్తాయి. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి జనరిల్ ఔషధాలే. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత్ ఎగుమతులపై ప్రభావం ఉండబోదంటున్నారు.  అయితే.. సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు.. భారతీయ కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గానీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై ఫోకస్ చేయడం లాంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తరచుగా ట్రంప్ సర్కార్.. భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని.. విదేశాంగ విధాన వైఫల్యంగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. సుంకాలు, హెచ్1బీ వీసాల ఫీజు పెంపు, వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. అమెరికా చర్యల పట్ల.. కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంపైనా.. విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

రాహుల్ కోరుకుంటున్న జెన్ జెడ్ మూవ్ మెంట్ ఇదేనా?

మొన్నా మ‌ధ్య రాహుల్ ఓట్ చోరీ వ్య‌వ‌హారంలో చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్ లోనూ విద్యార్ధులు జెన్ జెడ్ ఉద్య‌మం మొద‌లు పెడితే.. వారికి తాము అండ‌గా నిలుస్తామ‌ని అన్నారాయ‌న‌. అందులో భాగంగానే త‌న విదేశీ స‌ల‌హాదారు శ్యామ్ పిట్రోడా ద్వారా.. పాకిస్థాన్ సొంతింటిలా అనిపిస్తుంది.. నేపాల్, బంగ్లా ప్ర‌శాంతంగా ఉంటాయ‌న్న రాంగ్ కామెంట్స్ చేయించిన‌ట్టు గానూ తెలుస్తోంది. ఇవ‌న్నీ అలాగుంటే ఇప్పుడు ల‌డక్ నుంచి రాహుల్ కొన్ని విదేశీ శ‌క్తుల‌తో క‌ల‌సి జెన్ జెడ్ మూమెంట్ ని మొద‌లు పెట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. కావాలంటే చూడండి.. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తోంది పైకి సోనం వాంగ్ చుక్ అయినా.. దీని వెన‌క ఉన్న‌ది స్థానిక కాంగ్రెస్ నేత‌.. పుంట్సోక్ త్సెసాగ్ అంటారు వీరు. లేహ్ లోని ప్ర‌భుత్వ ఆస్తుల‌తో పాటు బీజేపీ కార్యాల‌యాన్ని త‌గ‌ల‌బెట్టించ‌డం అనే ఘ‌న కార్యం ఈ త్సెసాగ్ చేతుల మీదుగానే జ‌రిగింద‌ని చెప్పుకొస్తారు. ఇంత‌కీ ఎవ‌రీ సోనం వాంగ్ చుక్. ఏంటీ ల‌డ‌క్ డిమాండ్? అని చూస్తే..  ఒక విద్యావేత్తగా, ఇంజినీర్‌గా, పర్యవరణ సంరక్షకునిగా, సామాజిక కార్యకర్తలు ఈ దేశ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని సోనమ్ వమ్ము చేశాడ‌ని అంటారు బీజేపీ నేత‌లు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో లడ‌క్ ప్రజలను రెచ్చగొడుతున్నార‌నీ ఆరోపిస్తున్నారు వీరంతా.   లడ‌క్ ప్ర‌స్తుత‌ పరిస్థితిని మనమంతా గమనించాలనీ.. ఇప్పటికే లడక్‌లోని సగభాగం అక్సాయ్ చిన్‌ను చైనా ఆక్రమించిందనీ.. దేశ భద్రత దృష్ట్యా అది మన దేశానికే కీలక ప్రాంతమ‌నీ.. ఈ కారణాలవల్లే ఆర్టికల్ 370 రద్దు దర్వాత జమ్మూ కశ్మీర్ నుంచి లడ‌క్ ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించించారనీ చెప్పుకొస్తారు కాషాయ నేత‌లు.   కేవలం 2 లక్షల మంది కోసం ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం?  ఈ లెక్కన మన దేశంలోని ప్రతి జిల్లాను ఒకటో, రెండో రాష్ట్రాలు చేయాల్సిందేనా? లడ‌క్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలంటే దాన‌ర్ధ‌మేంటి? దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు, ఏర్పాటు చేయకాకుండా అడ్డుకోవాల‌నే కుట్ర కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు క‌మ‌ల‌నాథులు.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్ హ్యాండిల్స్  ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? ఈయన వెనుక కొన్ని విదేశీ శక్తులు దాగి ఉన్నాయా? అన్న కోణంలోనూ ఆరా తీయాల్సిందేనంటారు బీజేపీ వారు. ఈ అనుమానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా.. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో పర్యటించి వచ్చారు. అంతే కాదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో కూడా స‌త్సంబంధాలు ఉన్నాయి సోన‌మ్ కి. వాంగ్‌చుక్ చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్న కేంద్రం చర్చల కోసం తేదీలను కూడా ప్రకటించింది. అసలు సోనమ్ ఇచ్చిన జన్ జడ్ పిలుపు అర్థం హింసేనా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తో పోల్చ‌డంలోని ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ అంత‌ర్గ‌తంగా దేశ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అత‌లాకుత‌లం చేసే కుట్రలు కావా? అని ప్ర‌శ్నిస్తున్నాయి కాషాయ వ‌ర్గాలు. రాహుల్ గాంధీ చెప్పిన జన్ జడ్ తిరుగుబాటు ఇదేనా? లడాక్‌లో అల్లరి మూకలను పోగేసి విధ్వంసానికి దిగింది ఎవరో గమనించ‌మంటున్నారు క‌మ‌ల‌నాథులు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంట్సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ చేతిలో ఆయుద్ధం పట్టుకొని హింసాకాండకు నాయత్వం వహించాడ‌నీ.. లేహ్‌లో ప్రభుత్వ ఆస్తులతో పాటు బీజేపీ కార్యాలయానికి కూడా ఇత‌డే నిప్పు పెట్టించాడనీ అంటారు బీజేపీ లీడ‌ర్లు. అయితే ఫోటోల్లో ఉన్నది తాను కాదని త్సెపాగ్ బుకాయిస్తున్నాడనీ.. నిజమేంటో త్వ‌ర‌లో దర్యాప్తు ద్వారా తేలుతుందని చెప్పుకొస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు.  అసలు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ విష‌యం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డుతుంద‌ని.. ఇదంతా రాహుల్ విదేశీ శ‌క్తుల‌తో చేతులు క‌లిపి చేస్తున్న కుట్ర మాత్ర‌మేన‌ని అంటోంది క‌మ‌ల‌ద‌ళం. మ‌రి చూడాలి.. ఈ పోరాటం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో!

విశ్వవిద్యాలయాలపై కాషాయ జెండా రెపరెపలు.. దేనికి సంకేతం?

కాంగ్రెస్ అగ్ర నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమ మనసులోని మాటను చాలా చక్కగా బయట పెట్టారు. మన ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో వచ్చిన జెన్  జెడ్    తిరుగుబాటు మన దేశంలో కూడా వస్తుందనీ, దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్ముక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళన సాగిస్తున్న రాహుల్ గాంధీ.. తమ ఓటు చోరీ ఆందోళన జెన్ జెడ్  ఆందోళనగా రూపాంతరం చెందుతుందని ఆశిస్తున్నారు. నమ్ముతున్నారు. అదే మాట అంటున్నారు. విద్యార్ధులు, యువత ఒక్కటై రాజ్యాంగాన్ని కాపాడుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఎప్పుడూ ముందుంటాననీ, జెన్ జెడ్  ఆందోళనకు సంపూర్ణ మదటు ఉంటుందని  రాహుల్ గాంధీ చెబుతున్నారు.  ఒక్క  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు..  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామరావు కూడా  ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే మన దేశంలోనూ నేపాల్ తరహా  జెన్  జెడ్ తిరుగుబాటు తప్పక వస్తుందంటున్నారు. మొత్తానికి  రాహుల్ గాంధీ మొదలు కేటీఆర్ వరకు.. ఇంకా ఇండి  కూటమి పార్టీల నాయకులు కూడా నేపాల్  తరహా  తిరుగుబాటు మన దేశంలోనూ వస్తుందనీ.. రావాలని ఆశిస్తున్నారు.  మరో వంక  బీజేపీ రాహుల్  గాంధీ ఆలోచనలను అర్బన్ నక్సల్  ఆలోచనలుగా పేర్కొంటూ.. దేశంలో అస్థిరత్వాన్ని ప్రోది చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపి స్తున్నారు.  అదలా ఉంటే..  భారత దేశంలో నిజంగా   ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితి ఉందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే..   విద్యార్ధి లోక నుంచి లేదనే జవాబే వస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు, ఇటివల కాలంలో వెలువడిన విద్యార్ధి తీర్పులను ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇటీవలి కాలంలో ఢిల్లీ జరిగిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘం ఎన్నికల్లో  ఆర్ఎస్ఎస్  అనుబంధ అఖిల భారతీయ విద్యర్ది పరిషత్ (ఏబీవీపీ) వరస విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీ నుంచి మణిపూర్ వరకూ,మణిపూర్ నుంచి గుహవటి వరకూ,  గుహవటి నుంచి పంజాబ్ , పంజాబ్ నుంచి పాట్నా, పాట్నా నుంచి ఉత్తారఖండ్, ఉత్తారఖండ్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాల ఎన్నికలలో ఏబీవీపీ ఎదురులేని విజయాలను సొంత చేసుకుంది.  ఈ విజజయాలు   నేపాల్ తరాహా విద్యార్ధి తిరుగుబాటును ఆశించిన రాహుల్ గాంధీ, సహా పలువురు నేతల ఆశలను అడి యాసలు చేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే..  విద్యార్ధులు, యువతలో అశాంతి అసలే లేదా అంటే ఔనని చెప్పలేం. అయితే..  ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంచడంలో విఫలం కావడం వల్లనే విద్యార్ధులు,యువత సహా అన్ని వర్గాల ప్రజలు కాషాయంవైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటు న్నారు.