ఆగని కీచకపర్వం
posted on Mar 20, 2013 8:20AM
షిరిడీ సాయినాథుని దర్శనార్థం షిరిడీకి వెళ్తున్న నార్వేకు చెందిన మహిళకు నగరానికి చెందిన పలువురు కీచకులనుండి వేధింపులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి షిరిడీకి ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. నగరానికి చెందిన చిత్రం రంజిత్ కుమార్ (దిల్ షుక్ నగర్), రాయదుర్గం సాయికిరణ్ (గౌలిగూడ), పిరాజీ విజయ్ (బేగంబజార్), ఉప్పల్ చందర్ (కాచిగూడ) పిన్నింటి సుదర్శన్ రెడ్డి (సరూర్ నగర్) యువకులు బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నార్వే దేశ మహిళపై వీరి కన్నుపడింది. అంతే, ఇక వీరి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. వీరు ఆమెను తమ వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురిచేశారు. బస్సులోని మిగతా ప్రయాణీకులు అడ్డుచెప్పినా, డ్రైవర్, కండక్టర్ అడ్డుతగిలినా వీరు వారి మాటలను పట్టించుకోకుండా వీరిపైనే దౌర్జన్యానికి దిగారు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా సూచన మేరకు డ్రైవర్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపి, నిందుతులను పోలీసులకు అప్పచేప్పాడు. పోలీసులు వీరిని నిజామాబాద్ రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ ఎదుట హాజరుపరచగా వీరిపై 290, 502, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందుతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించి, నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు.