రా౦సింగ్ మృతుదేహానికి శవపరీక్ష
posted on Mar 12, 2013 @ 10:49AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సాముహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రా౦సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. రా౦సింగ్ మృతుదేహానికి ఎయిమ్స్ లో శవపరీక్ష నిర్వహించనున్నారు. రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు.