జీపు డ్రైవర్.. డిఎస్పీ అవతారం..
posted on May 25, 2021 @ 2:20PM
అతని పేరు రాచర్ల శ్రీనివాస్. 2005 లో అనంతపురం జిల్లా కదిరి పోలీసుస్టేషన్ లో పోలీస్ జీపు డ్రైవర్గా పనిచేశాడు. అనంతరం వ్యసనాలకు బానిసై నేరాలబాట పట్టాడు. పోలీసుల మాట తీరు, విధి నిర్వహణపై ఉన్న అవగాహనతో అధికారినంటూ ప్రజలను సులభంగా నమ్మించేవాడు. చిత్తూరు, బెంగళూరులో ఆయనపై 50వరకు చైన్స్నాచింగ్ కేసులున్నాయి. గతంలో చిత్తూరు ఎస్పీ ఎదుట లొంగిపోయి ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించిన శ్రీనివాస్ జైలు నుంచి బయటికొచ్చాక మళ్లీ నేరాల బాట ఎంచుకున్నాడు. ఆ తర్వాత వేరే దుకాణం స్టార్ట్ చేశాడు. అదే డిఎస్పీ అవతారం. ఎక్సమ్ రాసి మాత్రం కోదండోయ్.. అలా మని లంచం ఇచ్చికూడా జాబ్ చేయలేదు. ఓన్లీ తన మాటతో అందరిని నమ్మించి.. అతను పధకం వేస్తే పని అయిపోవాల్సిందే.. పక్కవాడి జేబులు చిల్లు పడాల్సిందే.. అదెలా..? అని అనుకుంటున్నారా ..? అంతక ముండు పోలీస్ జీపుగా డ్రైవర్ గా పనిచేశాడు కదా.. అదే అతని బలం అయింది ఎదుటి వాడికి బలహీనత అయింది. ఎందుకంటే ఆ ఉద్యోగం మానేసిన తరువాత అతని యవ్వారం నడిపింది ఆ దైర్యం తోనే అనుకోవాలి ఒకరకంగా. ఉద్యోగం పోయిన అధికారులు, అతని టార్గెట్ అని చెప్పాలి ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఏసీబీ కేసుల్లో ఉన్న, సస్పెండైన అధికారులే లక్ష్యంగా చేసుకుని తాను ఏసీబీ, ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ వారిని నమ్మించేవాడు. కేసుల నుంచి విముక్తి కల్పిస్తానంటూ డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయేవాడు. కొన్నాళ్ల క్రితం సామర్లకోటలో గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడం వల్ల ఎద్దులు చనిపోగా.. బాధిత రైతుకు శ్రీనివాస్ ఫోన్ చేసి డీఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఎద్దులకు రూ.45 లక్షల బీమా పరిహారం ఇప్పిస్తానంటూ ఆ రైతు నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు.
రాచపల్లి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 70కి పైగా కేసులున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోడ పోలీసులు అరెస్ట్ చేశారు. సామర్లకోట ఎస్ఐ సుమంత్ కథనం మేరకు.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వెలమద్ది గ్రామానికి చెందిన రాచపల్లి శ్రీనివాస్ ఏసీబీ, ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ పరిచయం చేసుకొని పలువురిని మోసం చేశాడు. అతడిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 70కి పైగా కేసులున్నాయి. విజయవాడ జైలు నుంచి విడుదలై విశాఖపట్నానికి మకాం మార్చేందుకు వెళ్తున్న అతడిని సోమవారం ప్రత్తిపాడు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు.