పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్నా! మెడలో మంగళసూత్రం చూశారా?
posted on May 13, 2024 @ 12:28PM
భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు. కళ్లు తెరిచి చూడు జగన్ అంటూ సోషల్ మీడియాలో సైటైర్లు... జగన్, పోతిన్ ఆరోపణలకు పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు... కాస్త కళ్లు తెరిచి చూడు జగన్, పోతిన మహేష్ అంటూ జనసైనికులు రెచ్చిపోతున్నారు. నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్నా.. మెడలో మంగళసూత్రం చూశారా? అంటూ పోలింగ్ బూత్ దగ్గర జనం మాట్లాడుకున్నారు. ఓటు వేసేందుకు సతీసమేతంగా వచ్చిన పవర్ స్టార్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇక పవన్ అభిమానులు… సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అయితే అవేమీ పట్టించుకోకుండా పవన్ తన భార్యతో కలిసి ఓటు వేశారు. అన్నా లెజినోవా చూసిన స్థానిక ప్రజలు, అభిమానులంతా ఆశ్యర్యపోయారు. ఆమె ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ లుక్కుతో ఓటు వేసేందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్నా.. మెడలో మంగళసూత్రం చూశారా? అయితే ఆమె కట్టుకున్న చీర నుంచి.. పెట్టుకున్న జువెలరీ వరకు అంతా సింపుల్ సిటీతో కనిపించారు. మెడలో కూడా సింగిల్ లైన్ ఉన్న మంగళ సూత్రం వేసుకున్నారు. చేతులకు సింగిల్ బ్యాంగిల్స్ వేశారు. ఇక నుదుటున చిన్న బొట్టు పెట్టుకున్నారామె. ఆమె కట్టుకున్న చీర కూడా చాలా సాధారణంగా కనిపించింది. చూడటానికి అది కాటన్ శారీలా కనిపిస్తుంది. దీంతో పవర్ స్టార్ భార్య అయినా అంత సింపుల్గా ఉన్నారా? అంటూ ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అన్నా లెజినోవా రష్యాకు చెందిన యువతి. ఆమె పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ విషయాలన్నీ అక్కడ జనం మాట్లాడుకోవడం వినిపించింది.
జగన్మోహన్ రెడ్డితో పాటు పోతిన మహేశ్ కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానం చెప్పారు. గత కొన్ని నెలలుగా నాలుగో పెళ్లి అంటూ వైఎస్ జగన్ తన హోదాకు దిగజారి చేసిన ఆరోపణలకు పవర్ స్టార్ తనదైన రీతిలో షాక్ ఇచ్చారు. తన భార్యతో కలిసి ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కును ఉపయోగించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్న వారి నోరు మూయించారు.
ముఖ్యమంత్రి జగన్ పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పెళ్లిళ్ల గురించి మీటింగ్లో పదే పదే ప్రస్తావించడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే నాలుగో పెళ్లి అంటూ పదే పదే మీటింగుల్లో చెప్పడంతో అసహనానికి గురైన జనసేన చీఫ్ నువ్వే నా నాలుగో పెళ్లాం అంటూ కామెంట్ చేయడం వైరల్ అయింది. అయినా తన ప్రవర్తన మార్చుకోని జగన్, పిఠాపురంలో చివరి పబ్లిక్ మీటింగ్లో కూడా పవన్ కల్యాణ్ ప్రతీ ఐదేళ్లకు కార్లను మార్చినట్టు ఆయన పెళ్లాలను మార్చుతాడు అంటూ ఆవేశంగా మాట్లాడారు. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా.. ఆయన చేసిందేమీ లేదు అంటూ ఆరోపణలు చేశాడు.
ఇటీవల జనసేన నుంచి వైసీపీ లోకి వెళ్ళిన పోతిన మహేష్ కూడా పవన్ ను తీవ్రంగా విమర్శిస్తూనే వున్నారు. పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేశారు. మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే కలిసి ఉంటే, పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి ఆరోపణలకు జనసేనాని తన దైన స్టైల్లోనే ధీటుగా జవాబిచ్చారని పోలింగ్ బూత్ వద్ద జనం చెప్పుకున్నారు. అయితే పవన్ తన భార్యతో కలిసి ఓటు వేయడంతో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- ఎం.కె. ఫజల్