పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి చంద్రబాబు బాబు గ్రీన్‌ సిగ్నల్‌

 

 

అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపును అందుకున్నది. రాష్ట్రంలో ఎక్కడ విభేదాలు భగ్గుమన్నా దాని వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న లేచిందో ఈ నియోజకవర్గ నేతను గుర్తు చేసుకునేవారు. దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. గొడవలు, అల్లర్లు అన్నింటినీ నియంత్రించగలిగిన నేతగా ఈయన ఎదిగిన తీరు రామ్‌గోపాల్‌వర్మ వంటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత చిత్రీకరించాక ఈ నియోజకవర్గం పేరు ఇంకా పాపులర్‌ అయింది. ఈ పాపులార్టీని రవి వ్యతిరేక గ్రూపు కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే పరిటాల రవి కుటుంబమే ఆ ఫేమ్‌ నిలబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్లు గడిచేకొద్ది మార్పులు సహజం కాబట్టి పరిటాల రవి హత్యానంతరం సునీత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్‌ తాజా ఆకర్షణ అయ్యారు. ఈయనే భవిష్యత్తు ఎమ్మెల్యే అని పరిటాల అభిమానులు భావిస్తున్నారు. పైగా పరిటాల కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టులో కీలకమైన బాధ్యతలు శ్రీరామ్‌ ఇటీవలే చేపట్టారు. దీంతో రవి అభిమానులు తమ ఆశ నెరవేరే సమయం వచ్చేసిందని భావిస్తున్నారు. అయితే, తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ రాజకీయాల్లోకి వస్తాడని, 2014 ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉండడని తల్లి, ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడిరచారు. సునీత ఈ ప్రకటన చేయటం ద్వారా అభిమానులు ఎంత వరకూ తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారో అంచనా వేసుకునేందుకు అవకాశం తీసుకున్నారు. ఇప్పటికే ట్రస్టు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీరామ్‌ తాజాగా తల్లితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్రకు హాజరయ్యారు. దీంతో అభిమానులు ఉండబట్టలేక చంద్రబాబును శ్రీరామ్‌తో మాట్లాడిరచమని అభిమానులు కోరారు. దీనికి సునీత నవ్వుతూ దానికి ఇప్పుడు కాదు అన్నారు. అంటే సునీత ముందుగా శ్రీరామ్‌కు రాజకీయానుభవం తెలియజేశాక కానీ, రంగంలో దించకూడదని ఆలోచించి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వెంటనే శ్రీరామ్‌ను దించేస్తానని గతంలో రవి అభిమానులకు సునీత మాట ఇచ్చారు. చంద్రబాబు కూడా పాదయాత్ర సమయంలో తెలివిగా త్వరలో శ్రీరామ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అభిమానులకు భరోసా ఇచ్చారు. అంటే చంద్రబాబు, సునీత ఇద్దరూ కూడా శ్రీరామ్‌కు రాజకీయ అవగాహన పెంచేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే సునీత వైఖరి ఊరించేదిలా ఉందని అభిమానులు అంటున్నారు. ఇలా ఊరించి ఊరించి ఒక్కసారిగా రంగంలోకి దించితే గెలుపు ఖాయం అవుతుందని సునీత, చంద్రబాబు భావిస్తున్నారేమో? అయి ఉండొచ్చు కదా!

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.