టీవీ9 బద్రి చిన్న కుమారుడి మృతి

 

టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ బద్రి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బద్రి భార్య, ఆయన ఇద్దరు కుమారుడు, ఒక బంధువు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రి చిన్న కుమారుడు సాత్విక్ (9) కూడా ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద కుమారుడు సాయి (12) పరిస్థితి కూడా విషమంగా వున్నట్టు తెలుస్తోంది. బద్రి భార్య లక్ష్మీ సుజాతకు ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతున్న బద్రి బంధువు తారక్ కూడా కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బద్రి మరణంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బద్రి సోదరుడు కూడా గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తమ కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదంలోనే మరణించడం వారిని కలచివేస్తోంది.

Teluguone gnews banner