నీలిమ మృతి కేసులో సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ జరుగుతోందని డీసీపీ యోగానంద్ తెలిపారు. ఈరోజు ఆయన నీలిమ మృతికి సంబంధించిన కొన్ని వివరాలను విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు 11గంటలకు సమాచారం వచ్చింది. 9 గంటలకు 18-19 నెంబర్ గల భవనంలోకి నీలిమ వెళ్లింది. 9.36నిమిషాల వరకు విజువల్స్ లభించాయి. 9.36నిమిషాలకు పార్కింగ్ భవనంలోకి నీలిమ వెళ్లింది. నీలిమ భవనంపై నుంచి పడిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డు రమేష్ గమనించారు. కంపెనీ ఉద్యోగులు ముగ్గురు నీలిమను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీలిమ పడిపోయే సమయలో ఒక చెప్పు ఏడో అంతస్తులో పడింది. సమాచారం ఆలస్యమవడానికి కారణం సరైన ఫోన్‌ నెంబర్లు లేకపోవడమేనని డీసీపీ తెలిపారు. 10వ ఫ్లోర్‌లో నీలిమ హ్యాండ్‌బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్‌లో దొరికిన చీటీ ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఏడో అంతస్తుపై నుంచి పడిపోయిందనడానికి పైపులపై మరకలున్నాయని ఆయన చెప్పారు.


 

నీలిమ మొబైల్ స్క్రీన్ లాక్ అయింది. ఓపెన్ చేసేందుకు నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. నీలిమ ఈ-మెయిల్‌ను కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీలిమ మృతికి సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. 9.30 సమయంలో నీలిమ సెల్ నుంచి ఒక నెంబర్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని డీసీపీ చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కొంత సమాచారం అభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.