మోడీకి అంత సీను లేదు: బీజేపీ నేత జోషి
posted on Apr 14, 2014 @ 7:26PM
బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నుండే ఆ పార్టీకి దేశంలో మంచి ఊపు వచ్చింది. నాటి నుండి నేటి వరకు మోడీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన నానాటికి ఆయన రేటింగ్, దానితో బాటే పార్టీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇది కాంగ్రెస్ నేతలు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయన కోసం తన వారణాసి సీటుని వదులుకోవలసివచ్చిన మురళీ మనోహర్ జోషీ మాత్రం అలా భావించడం లేదు. దేశంలో అందరూ చెప్పుకొంటున్నట్లు మోడీ ప్రభంజనమేమీ లేదని అధికేవళం బీజేపీ ప్రభంజనమని దాని వలన మోడీయే లబ్ది పొందుతున్నారని అన్నారు. అంతే కాక మోడీ కేవలం పార్టీలో ఒక ముఖ్యమయిన పదవికి ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంటే, ఇటువంటి అతి కీలకమయిన సమయంలో స్వంత పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతే వ్యక్తిగత కారణాలతో మోడీకి అంత సీను లేదని కించపరుస్తూ మాట్లాడటం వలన పార్టీకే కాదు, ఆయనకీ నష్టమే కలిగిస్తుంది. ప్రత్యర్ధ కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవలసిన ఈ తరుణంలో ఆయన స్వంత పార్టీ ప్రధాని అభ్యర్ధి మీదే బాణాలు ఎక్కుపెడితే అందుకు కాంగ్రెస్ కూడా చాలా సంతోషిస్తుంది.