జగన్ రెడ్డికి తీన్మారేనా? రఫ్పాడిస్తున్న రఘురామ.. 

ర‌ఘురామ‌. వీడు మామూలోడు కాదురా బాబూ అని జ‌గ‌న్‌రెడ్డి త‌ల ప‌ట్టుకుంటున్నారట. అన‌వ‌స‌రంగా ఎందుకు పెట్టుకున్నామా అని తెగ బాధ‌ప‌డుతున్నారట.. ర‌చ్చ‌బండ‌తో రాజీ ప‌డితే.. ఢిల్లీ స్థాయిలో డ్యామేజీ జ‌రిగేది కాదుగా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నారట.. వీడియోల‌తోనే వాడిని వ‌దిలేస్తే.. పార్ల‌మెంట్ స్థాయిలో ప‌రువు పోయేది కాదుగా అని నిద్ర‌లేని రాత్రులు గుడుపుతున్నారట. ర‌ఘురామ అనే పేరు వింటేనే.. జ‌గ‌న్‌రెడ్డి ఉలిక్కిప‌డుతున్నాడరట‌. ఎవ‌రైనా కాంప్ర‌మైజ్ చేస్తే బాగుండంటూ క‌నిపించిన వారిన‌ల్లా వేడుకుంటున్నారట‌. ఇది కాస్త వెట‌కార‌మే అయినా.. ర‌ఘురామ కౌంట‌ర్ అటాక్‌తో గొడ్డుకారం తిన్న వాడిలా త‌యారైంది జ‌గ‌న్‌రెడ్డి ప‌రిస్థితి అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. అవును మ‌రి, ర‌ఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్ల‌మెంట్‌, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన దారుణంపై, త‌న‌పై జ‌రిపిన థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంపై.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నారు. ర‌ఘురామ‌. ఇక త‌న అరెస్టులో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ప్ర‌తీ ఒక్క‌రినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నారు. గుంటూరు అర్బ‌న్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఆర్మీ హాస్పిట‌ల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి.. ఇలా ఏ ఒక్క రెడ్డినీ వ‌ద‌ల‌డం లేదు ర‌ఘురామ‌. రాజు గారి దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి.

ఇంట్లోకి చొర‌బ‌డి అరెస్ట్ చేశామా! క‌స్ట‌డీలో కుమ్మేశామా! జైల్లో పెట్టి మూసేశామా! అంతే. క‌ట్టె.. కొట్టె.. తెచ్చె. ఇంతే సింపుల్ అనుకున్నారు. ర‌ఘురామ ఖేల్ ఖ‌తం.. వీడియోల‌ దుకాణం బంద్ అనుకున్నారు. కానీ, మొండిఘ‌టం ర‌ఘురామ ఆ త‌ర్వాత జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తారని ఆ స‌మ‌యంలో వారికి తెలీదు. సుప్రీంకోర్టులో పోరాడి మ‌రీ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఢిల్లీ ఎగిరిపోయి.. ఇక అక్క‌డి నుంచి అస‌లైన ఆట మొద‌లుపెట్టారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. వీల్‌చెయిర్‌లో వెళ్లి మ‌రీ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు క‌లిశారు. సీఐడీ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించారు. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిశారు. కాలి గాయాల‌ను చూపించారు. ఎంపీ అయిన త‌న‌పై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. జాతీయ మ‌న‌వ హ‌క్కుల సంఘాన్నీ ఆశ్ర‌యించారు. త‌న‌ను దారుణంగా కొట్టి.. మాన‌వ హ‌క్కుల‌ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా.. త‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం జ‌రిపిన అమానుషంపై దేశ అత్యున్న‌త‌ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటి దృష్టికీ తీసుకెళ్లారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌రెడ్డిని ఢిల్లీ స్థాయిలో దోషిగా నిల‌బెట్టారు. 

అక్క‌డితో ఆగలేదు ర‌ఘురామ‌. పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తో పాటు.. వివిధ పార్టీల‌కు చెందిన‌ స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యుల‌కూ లేఖ రాశారు. త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో ఎలా కొట్టింది.. త‌న‌పై రాజ‌ద్రోహం కేసు పెట్టి ఎలా హింసించిందీ.. అంతా పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రిస్తూ తోటి ఎంపీల‌కు లేఖ రాశారు. దెబ్బ‌ల‌తో క‌మిలిన త‌న కాలి గాయాల ఫోటోల‌నూ లేఖ‌కు జ‌త చేశారు. ఆ ఫోటోలు చేసి.. ఆ లేఖ చ‌దివి.. స‌హ‌చ‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు అవాక్క‌వుతున్నారు. ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక గౌర‌వ ఎంపీ ప‌ట్ల‌.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుందా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులున్నాయని, వాటిలో జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారని, జగన్ తో పాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని తాను సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసినందుకే త‌న‌ను ఇలా హింసించార‌ని లేఖలో వివ‌రించారు ర‌ఘురామ‌. ఆయ‌న‌ రాసిన లేఖ‌, పంపిన ఫోటోల‌ను.. త‌మ అధికారికి సోష‌ల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేస్తున్నారు. ర‌ఘురామ‌కు సంఘీభావం వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు ఎంపీలు. ర‌ఘురామ‌పై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు చేసిన దారుణాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా దుయ్య‌బ‌డుతున్నారు. 

ఏపీలో హిట్ల‌ర్ రాజ్య‌మా? అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు  తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తానని, కానీ ఒక పార్లమెంటేరియన్‌ పట్ల ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి?ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేశారు మాణికం ఠాగూర్‌. 

క‌ర్ణాట‌కకు చెందిన ఎంపీ హేమ‌ల‌త అంబ‌రీష్‌.. శివ‌సేన‌కు చెందిన ప్రియాంక చ‌తుర్వేది.. ఇలా అనేక మంది ఏపీ ప్ర‌భుత్వ తీరును సోష‌ల్ మీడియాలో నిప్పుల‌తో క‌డిగేస్తున్నారు.

అనేక మంది ఎంపీల పోస్టుల‌తో.. ఈ రాష్ట్రం, ఆ పార్టీ అనే తేడా లేకుండా.. యావ‌త్ దేశానికి ఇప్పుడు ర‌ఘురామ ఎపిసోడ్ చేరింది. దేశ‌ ప్ర‌జ‌లంద‌రి ముందు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డింది. ఒక ఎంపీని కొట్టిన వైనం.. ఆయ‌న కాలికి అయిన గాయాల ఫోటోలు చూసి.. పార్ల‌మెంట్ స‌భ్యులంతా ఉలిక్కిప‌డుతున్నారు.  ఒక ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం ఏంట‌ని.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాలోనే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని శిక్షిస్తున్న ఎంపీలు.. రాబోవు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అస‌లైన శిక్ష విధించ‌డానికి.. ఏపీ స‌ర్కారును పార్ల‌మెంట్ కోర్టులోకి లాగేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే త‌న‌కు న్యాయం చేయ‌మంటూ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు ర‌ఘురామ‌. మ‌రోవైపు, ఎంపీలంతా ముక్త‌కంఠంతో ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. తాజా వ్య‌వ‌హారంపై కేంద్రం సైతం ఆగ్ర‌హంగా ఉంది. అటు, జాతీయ మాన‌వ‌ హ‌క్కుల సంఘం సైతం విచార‌ణ ప్రారంభించింది. వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీ ర‌ఘురామ‌పై జ‌రిగిన దాడి వ్య‌వ‌హారం ప్ర‌ధాన ఎజెండాగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు పార్ల‌మెంట్ క‌న్నెర్ర‌కు గురికాక త‌ప్ప‌దు. వెయిటింగ్ ఇక్క‌డ అంటూ.. ర‌ఘురామ ఢిల్లీలో కూర్చొని.. తొడ‌గొట్టి స‌వాల్ విసురుతుంటే.. ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారులో ద‌డ మొద‌లైంది.

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8)న తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   

క.వి.త అంటే?

క.  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన క‌విత‌.. ప్రొఫైల్  చూస్తే ఆమె త‌న‌కు తాను చెప్పే మాట‌.. కేసీఆర్, ప్రొ. జ‌య‌శంక‌ర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వ‌చ్చి.. అటు పిమ్మ‌ట జాగృతి అనే  క సంస్థ ఏర్పాటు చేశాన‌నీ, అప్ప‌టి వ‌ర‌కూ అనాథ‌గా ఉన్న బ‌తుక‌మ్మ‌ను త‌న నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమ‌స్ చేశాన‌ని అంటారు క‌విత‌.  ఇక ఉద్య‌మ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపుల‌ర్ అయ్యారు. ఏది ఏమైనా క‌ల్వ‌కుంట్ల క‌విత‌గా స్థిర‌ప‌డ్డారు. ఉద్య‌మ య‌త్నం ఫ‌లించి.. తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్ర‌మోట్ అయ్యారు. ప్ర‌మోష‌న్ ల‌భించిన త‌ర్వాత క‌విత‌.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ క‌విత నుంచి ఎమ్మెల్సీ క‌విత‌గా మారారు. ఇంత‌లో పార్టీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం.. కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డంతో.. అతి ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టం ముగిసిన‌ట్ట‌య్యింది ఆమె రాజ‌కీయ జీవితంలో. దీంతో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ తండ్రికి లేఖ రాశారు క‌విత. ఇది బ‌య‌ట ప‌డ్డంతో మొత్తం గేమ్ ఛేంజ‌ర్ గా మారిపోయింది. ఈ వివాదం త‌ర్వాత పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌న త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని.. ఇక‌పై తాను బీఆర్ఎస్ క‌విత కాదు.. జాగృతి క‌విత అంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వి.   అంటే విడిపోవ‌డం. క‌ల్వ‌కుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవ‌డం. క‌విత జీవితంలో ఇది అత్యంత కీల‌క‌మైన మ‌లుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చారో అప్ప‌టి నుంచీ కాంగ్రెస్ క‌న్నా మించి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా త‌న బావ హ‌రీష్ ని చెడుగుడు ఆడుకున్నారు.  పార్టీలో ట్ర‌బుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హ‌రీష్ ని బ‌బుల్ షూటర్ అంటూ   అవ‌హేళ‌న చేశారు. హ‌రీష్ రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నిటినీ ఎండ‌గ‌ట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హ‌రీష్ రావ్ అంటూ తూర్పార బ‌ట్టారు. ఇక కాళేశ్వ‌రం అవినీతి మొత్తం హ‌రీష్ రావు పాప‌మే అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేనా ఇటు సోద‌రుడు  కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వ‌ద‌ల‌కుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎంద‌రో ఎమ్మెల్యేలపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. జాగృతి జ‌నం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్ర‌లు చేసి.. బీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై, మ‌రీ ముఖ్యంగా హ‌రీష్ పై   విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక స‌మ‌యంలో కాంగ్రెస్ లీడ‌ర్లు చేయాల్సిన ప‌ని క‌విత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది.  కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మంటూ హ‌రీష్‌, కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది.  అయితే త‌న‌ది ఆస్తి కోసం పోరాటం కాద‌ని ఆత్మ‌గౌర‌వ‌ పోరాట‌మ‌నీ.. మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంత‌మై క‌విత‌..   ఎమోష‌న‌ల్ హైడ్రామాకు తెర‌లేపారు. త‌న ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించ‌మ‌ని కోరారు. అన్న‌ట్టుగానే క‌విత రాజీనామా ఆమోదం పొందింది. త‌.    త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డానికి కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు క‌విత‌. ఒక టైంలో గాంధీ భ‌వ‌న్ వైపు ఆమె అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట వినిపించినా.. 2028 ఎన్నిక‌ల్లో తన పార్టీ అయితే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయమని చాటారు క‌విత‌. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మంటోన్న క‌విత‌.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజ‌కీయంగా ఎంత మేర‌కు రాణించ‌గ‌ల‌రు? ఆమె చిర‌కాల వాంఛ సీఎం కావ‌డం  సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  లేక  ష‌ర్మిళ‌లా ఆమె కూడా తేలిపోతారా? అన్న‌ది  క‌విత‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆమె వెన‌క న‌డిచే నాయ‌క‌త్వాన్ని బ‌ట్టి  భవిష్య‌త్ రూపు దిద్ద‌కుంటుంది.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

    ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.