శంకర్రావుకి బైపాస్ సర్జరీ

 

గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే శంకర్రావుకి హైదరాబాద్ లో ని కేర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. శంకర్రావుని ప్రశ్నించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వారెంట్ కూడా జారీ అయ్యింది. వారెంట్ జారీ అయిన తర్వాత శంకర్రావు హటాత్తుగా మాయమయ్యారు. నాలుగురోజులపాటు ఆచూకీ తెలియలేదు. సడెన్ గా తాను శని సింగణాపూర్ లో ఉన్నానని, నాలుగు రోజుల్లో వస్తానని కుటుంబానికి తెలియజేశారు. హైదరాబాద్ వచ్చీ రాగానే నన్ను అరెస్ట్ చేస్తారా.. దమ్ముంటే చేయండి.. అంటూ తీవ్రస్థాయిలో ఆవేశపడుతూ డిజిపి కార్యాలయం ముందు బైఠాయించారు. బ్లడ్ ప్రెజర్ విపరీతంగా పెరిగిపోవడంతో సొమ్మసిల్లి పడిపోయిన శంకర్రావుని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆఖరికి బైపాస్ సర్జరీ చేసేవరకూ పరిస్థితి వెళ్లింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.