మంచు లక్ష్మికి పదవి
posted on Mar 23, 2015 @ 4:54PM
మంచు లక్ష్మీ, శివకృష్ణ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనికెళ్ల భరణి ఉపాధ్యక్షుడిగా, శివాజీరాజా మా ప్రధాన కార్యదర్శిగా, ఆలీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా 'మా' అధక్ష్య పదవికి మాత్రం నట కిరిటీ రాజేంద్రప్రసాద్, సహజనటి జయసుధ పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరూ పోటీ నుండి తప్పుకొనే స్థితిలో లేరు. రాజేందర్ ప్రసాద్ కు నాగబాబు మద్దతు తెలుపగా, జయసుధకు మురళీమోహన్ మద్దతు తెలిపారు. దీంతో 'అధ్యక్ష' పదవికి ఓటింగ్ తప్పేలా లేదు. ఈ నెల 29న 'అధ్యక్ష' పదవికి ఎన్నిక జరగనుంది.