Read more!

ముండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడే!

 

 

 

విధి చిన్నచూపు చూడటంతో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నప్పటికీ, ఆయన త్వరలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యేవారని, కానీ ఇంతలోనే విధి ఆయన్ని బలి తీసుకుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీ మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇవ్వడానికి శివసేన అంగీకరించిన పక్షంలో గోపీనాథ్ ముండేనే ముఖ్యమంత్రి పదవిని పొందేవారు. మహారాష్ట్ర రాజకీయాలలో ముండే చాలా చురుకైన నాయకుడు కావడం, బీసీ వర్గాల్లో గట్టి పట్టుండటం, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహారాష్ట్ర వ్యవహారాలపై తిరుగులేని సాధికారత సాధించడంతో ముండే పేరును బీజేపీ సీఎం అభ్యర్థిత్వానికి ముందుకు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తే ముండేనే ముఖ్యమంత్రి అయ్యేవారు. అయితే ఇంతలోనే విధి వక్రించడంతో గోపీనాథ్ ముండే అకాలమరణం పాలయ్యారు.