ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన లయన్స్

 

 

ఛాంపియన్స్ లీగ్‌లో లయన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ పై లయన్స్ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబయి ఓపెనర్లు స్మిత్, సచిన్ శుభారంభం అందించారు. మాస్టర్ ఆచితూచి ఆడగా, స్మిత్ ఫోర్లతో విజృంభించాడు. దీంతో నాలుగు ఓవర్లలో 35 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో స్మిత్ అవుటవడంతో ముంబయి జోరు కాస్త తగ్గింది. మిచెల్ జాన్సన్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 30, రోహిత్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27, డ్వెన్ స్మిత్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 26, దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 19 నాటౌట్ రాణించారు. సచిన్ 16, పొలార్డ్ 11 పరుగులు చేశారు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు 4 పరుగులు చేశాడు. టాపార్డర్ రాణించినా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లయన్స్ మెకంజీ 41 బంతుల్లో 68, డి కాక్ 33 బంతుల్లో 51లు18.5 ఓవర్లలోనే విజయాన్ని అందించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.