తూర్పు తీర్పే.. రాష్ట్రం తీర్పు!

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సారి తూర్పు ప్రజల దీవెన ఎవరి ఉంది అంటే.. జిల్లాలో గెలపు ఓటములను ప్రభావితం చేయగలిగే రెండు సామాజిక వర్గాల మొగ్గు ఎటువైపు ఉందన్నది పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు.

జిల్లాలలో కాపు, సెట్టిబలిజ సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాలలో శెట్టిబలిజ సామాజిక వర్గం బీసీల కిందకి వస్తుంది. సంప్రదాయకంగా శెట్టిబలిజలు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ జిల్లాలో వారి మొగ్గు వేరే పార్టీవైపు మళ్లినా అది తాత్కాలికమే. ఎందుకంటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో అత్యధికులు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. వారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా నిలుస్తూ వచ్చింది. ఆదరణ వంటి పథకాల ద్వారా చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలాగే రాజకీయంగా కూడా వారి ఎదుగుదలకు తెలుగుదేశం అండగా నిలిచింది. 

ఇక కాపు సామాజికవర్గం విషయానికి వస్తే.. ఈ సారి కాపు సామాజికవర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అంటే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఆ సామాజికవర్గం నిలి చింది.   ఒక అంచనా ప్రకారం కాపుసామాజిక వర్గ ఓటర్లలో 70శాతం మందికి పైగా ఈ సారి తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు కాపు నేతం పథకం లబ్ధిదారులైన మహిళలు కూడా ఈ సారి తెలుగుదేశం కూటమికే జై కొట్టారు.  2017లోనూ కూటమి ప్రభావం ఏమిటన్నది చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు. అయితే వాటి ద్వారా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదనుకోండి అది వేరే  విషయం.  

ఇక శెట్టిబలిజ సామాజిక వర్గంలో  గౌడ, యాత, ఈడిగ వంటి ఉపకులాల వారు ఆర్థికంగా ఒకింత మెరుగైన స్థితిలో  ఉంటారు. ఈ ఉప కులాలకు చెందిన వారంతా ప్రధానంగా  మద్యం వ్యాపారం అంటే బార్లూ, వైన్ షాపులు నిర్వహించే వారు. జగన్ మోహన్ రెడ్డి మద్యం విధానం కారణంగా వీరంతా బాగా దెబ్బతిన్నారు. కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట ప్రాతాలలో వీరి జనాభా ఎక్కువ.  అలాగే  పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు లలో కూడా వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.  అదే విధంగా అనపర్తి, రాజమహేంద్రవరంలలో కూడా విరి ప్రభావం కనిపిస్తుంది. చివరి క్షణంలో కూటమిని దెబ్బ కొట్టేందుకు జగన్  జిల్లాలో శెట్టిబలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా వారి మద్దతు సాధించాలన్న ప్రయత్నం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గాలలో జగన్ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లిచ్చారు.  అదే సమయంలో   సీట్ల సర్దుబాట్ల కారణంగా  తెలుగుదేశం కూటమి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా సీట్లు కేటాయించడానికి అవకాశం లేకుండా పోయింది.  ఇది తమకు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు  కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాలు తెలుగుదేశం కూటమివైపే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొగ్గు తెలుగుదేశంవైపే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

Teluguone gnews banner