చంద్రబాబుతో పోటీ పడలేకే... కంభంపాటి
posted on Jun 13, 2015 @ 11:39AM
ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని.. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరమని మండిపడ్డారు. తెలంగాణ లో తెదేపాకు వస్తున్న ప్రజాదారణను చూసి ఓర్వలేక ఏలాగైనా దెబ్బతీయాలనే ఫోన్ ట్యాపింగ్ లాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబుతో పోటీపడలేక కేసీఆర్ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం ఆపేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే చాలా బాగుంటుందని హితవు పలికారు.