Read more!

మంత్రి పదవి రాలేదని కాదు.. వెంకట్రావు ఆరోగ్యం బాగాలేదంతే

 

 

 

కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం గత కొన్ని రోజులుగా కాగిత వెంకట్రావు బిజీగా వున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం రోజైన ఆదివారం నాడు ఉన్న ఆయన నిన్న ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రిపాలయ్యారు. కాగిత వెంకట్రావుకు బీపీ, సుగర్ వ్యాధులు వున్నాయి. ఇదిలా వుంటే కాగిత వెంకట్రావుకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం వల్ల గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఒక దినపత్రిక ఇంటర్‌నెట్‌లో కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తోందని వారు తెలుగుదేశం నాయకులు అంటున్నారు. శాసనసభ్యుడి అనారోగ్యాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న వారిని ఏమనాలని వారు ప్రశ్నిస్తున్నారు.