పొలిటికల్ కామెడీ.. పాల్ ను మించిపోయిన జగన్

పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అయితే ఇప్పడు ఇక  పాల్ ప్లేస్ ను జగన్ ఆక్రమించేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా పాల్ విశాఖ ఎంపీగా తన విజయం ఖాయమని ప్రకటించేయడమే కాకుండా... తాను ఎంపీగా తన పని కూడా ప్రారంభించేస్తున్నానని చెప్పి జనం పొట్టలు చెక్కలు చేశారు. ఇది  జరిగిన మరుసటి రోజునే జగన్ పాల్ ను మించిన కామెడీ చేశారు. 

పనిమాలా అమరావతిలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరీ కామెడీ చేశారు. ముఖంలో ఇసుమంతైనా విశ్వాసం కనిపించకపోయినా, ఆయన వెనుక నిలుచుని ఉన్న మంత్రులు బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ముఖాలలో నైరాశ్యం విస్పష్టంగా కనిపిస్తున్నా.. జగన్ మాత్రం ఎన్నికలలో ఘన విజయం గురించి ఐప్యాక్ సభ్యులకు గోప్పగా చెప్పారు. 151ని మించి అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించబోతోందని ఆయన చెబుతుంటే.. ఐ ప్యాక్ సభ్యులు  ఎగతాళిగా చప్పట్లు కొడుతూ 175 అని అరవడం వినిపించింది. కనిపించింది. పాల్ విశాఖ ఎంపీగా విజయం సాధించేశానని ప్రకటించడాన్ని మించి జగన్ గత ఎన్నికల కంటే అధిక స్థానాలు సాధిస్తామని చెప్పుకోవడమే జనాలను ఎక్కువగా నవ్వించింది. 

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పోలింగ్ పూర్తయిన తరువాత గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. పార్టీ క్యాడర్ లో విశ్వాసం నింపడానికి, ఓట్ల లెక్కింపునకు ముందే వారు జారిపోయి.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లే లేని పరిస్థితి రాకుండా ఉండటానికి విజయం సాధిస్తున్నామంటూ పార్టీల నాయకులు ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు. కానీ జగన్ విజయం సాధించబోతున్నామంటూ జగన్ చెప్పిన సంఖ్యే సొంత పార్టీ నేతలకు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నామన్న సంకేతాన్ని పంపింది. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ విజయంపై చేసిన ప్రకటన చూసిన తరువాత సొంత పార్టీ శ్రేణులే రివర్స్ పాలన అలవాటైన మా నాయకుడికి ఎన్నికల ఫలితాలను కూడా రివర్స్ లో అంచనా వేయడం అలవాటైపోయిందని సెటైర్లు వేసుకుంటున్నారంటే ఆయన పొలిటికల్ కామెడీ ఏ స్థాయికి చేరిందో అర్ధమైపోతుంది. 

ఒక వైపు సొంత పార్టీకి చెందిన తన ఆంతరింగుకుడి లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించిందని ప్రకటించి ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఆయన దాకా ఎందుకు పోలింగ్ కు ముందే ఓటమి పసిగట్టిన జగన్ ఈ సారి ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న విశ్వాసం తనకు లేదని ప్రకటించి చేతులెత్తేశారు. ఇలా ఇప్పటి వరకూ వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాలిచ్చి.. ఇప్పుడు పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించి, నివేదికలు అందించిన ఐప్యాక్ కార్యాలయంలో ఘన విజయం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు మించిన కామెడీ ఏముంటుందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

Teluguone gnews banner