నిధుల లేమితో ఆగిన బీసీ బంధు?
posted on Jul 19, 2023 @ 12:57PM
బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన బీసీ బంధు లక్షరూపాయల సాయం ఆగిపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికల సీజన్ లో తమకు ఆర్థిక సాయం అందుతుంది అని భావించిన ప్రజానీకానికి చేదు వార్తే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 5లక్షల 28వేల 862 అప్లికేషన్లు వచ్చాయి. క్రమసంఖ్య ప్రకారం దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రతినెల 5వ తేదీన వెరిఫికేషన్ పూర్తి కానుండగా...15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలతో ప్రభుత్వం లబ్ధిదారులకు చెక్కులు అందజేయనుందని తొలుత వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. మరో వైపు ప్రతి పక్షాలు బీసీ బంధు ఎన్నికల జిమ్మిక్కు అని ఆరోపించిన సంగతి తెలిసిందే.బీసీ బంధు అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడవచ్చని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు సమాచారం. నిధుల లేమితో పథకాన్ని ఆపే బదులు ముందే పథకాన్ని నిలుపదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది