ఇంటికి రప్పించండి.. చైనాలో చిక్కుకున్న భారతీయ ఉద్యోగుల ఇళ్లల్లో ఆందోళన

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కు ఏపీ ప్రజలు భయపడిపోతున్నారు. ఇక్కడ నుంచి చైనాకి ఉద్యోగం కోసం వెళ్లిన వారి బంధువుల కోసం ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి విస్తృతం కావడంతో చైనాలోని వుహాన్ నగరంలో ఉంటున్న 58 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. చైనా వుహాన్ నగరం లోని అప్టోడిస్ ప్లే టెక్నాలజీ ప్రైవేటు కంపెనీలో 58 మంది భారతీయుల ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 23 న ఛైన్ అప్టో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ట్రైనింగ్ లో భాగంగా 58 మంది భారతీయులను వుహాన్ సిటీకి పంపించింది సదరు కంపెనీ. 

ముఖ్యంగా కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వుహాన్ సిటీకే ఉంది అనే హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడి టీసీఎల్ ఉద్యోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ కు లేఖ రాశారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సేమ్ జగన్ కు లేఖ రాశారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అక్కడి జననంతో పాటుగా వుహాన్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న 58 మంది భారతీయుల తల్లిదండ్రులను కూడా భయపెడుతోంది. తమ వాళ్లను వైరస్ బారిన పడకుండా వెంటనే స్వదేశానికి రప్పించేయాలని తలిదండ్రులు వేడుకుంటున్నారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో దుబాయి ఫ్లైట్ లో దిగిన ఒక వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో అతడికి వైద్యులు స్క్రీనింగ్ చేశారు. అక్కడి నుంచి కేజీహెచ్ కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత కరోనా వైరస్ సోకలేదని తేలడంతో డిశ్చార్జ్ చేశారు.

Teluguone gnews banner